మున్సిపాలిటీకి ఉచితంగా ట్రాక్టర్ అందజేసిన కాంట్రాక్టర్ పాలేటి సతీష్

0
199

నందిగామ పట్టణం కమ్మ కళ్యాణ మండపం నందు శుక్రవారం నాడు కాంట్రాక్టర్ పాలేటి సతీష్ సౌజన్యంతో నందిగామ మున్సిపల్ కార్యాలయానికి ట్రాక్టర్ మరియు రక్షిత మంచినీటి ట్యాంకర్‌ను ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వసంత నాగేశ్వరరావు  మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే  సౌమ్య  పాల్గొని మున్సిపాలిటీ అధికారులకు వాహనాలను అధికారికంగా అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు, తాగునీటి సరఫరా అందించడంలో ఈ ట్రాక్టర్ మరియు మంచినీటి ట్యాంకర్ ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. సమాజ సేవా దృక్పథంతో మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించిన కాంట్రాక్టర్ పాలేటి సతీష్ గారిని ప్రత్యేకంగా అభినందించారు. నందిగామ పట్టణ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, దాతలు కలిసి ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, వివిధ రాష్ట్ర కార్పోరేషన్ డైరెక్టర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నా.రు.

Search
Categories
Read More
Andhra Pradesh
శరవేగంగా బూరిపేట-గంగాడ రోడ్డు పనులు
తెర్లాం మండలం బూరిపేట నుంచి గంగాడ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. రోడ్డు పాడైపోవడంతో...
By Boiena Rajesh 2026-03-23 06:54:01 0 165
Andhra Pradesh
వేలాడుతున్న విద్యుత్ తీగలు.. ప్రమాదానికి ఆహ్వానం.
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లి రహదారి వద్ద చేతికి అందేంత ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రజల...
By Pagadala Venkateswar 2026-04-27 06:04:27 0 61
Andhra Pradesh
రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్ !! నేర ప్రవృత్తి వదిలిపెట్టాలి !!
కర్నూలు :కర్నూలు జిల్లా...నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్...
By Hari Krishna 2025-12-28 10:55:16 0 187
Andhra Pradesh
జూదం, కోడి పందేలపై దాడులు… 29 మంది అరెస్ట్: డీఎస్పీ.
ఆదివారం, మదనపల్లె మండలంలో జూదం మరియు కోడి పందేలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి...
By Pagadala Venkateswar 2026-04-20 03:26:41 0 68
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com