అలివేలమ్మ తల్లి తిరుణాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సౌమ్య

0
209

ఘనంగా చందర్లపాడులో అలివేలమ్మ తల్లి తిరునాళ్లు 

అమ్మవారి ఆశీస్సులతో ప్రజల సంక్షేమం, పాడిపంటలాభివృద్ధి కోరిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

చందర్లపాడు మండలంలో శుక్రవారం నిర్వహించిన అలివేలమ్మ తల్లి తిరునాళ్ల కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య  భక్తులు, మహిళలు, గ్రామస్తులు మరియు కూటమి నేతలతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో విశేష పూజల్లో పాల్గొన్న తంగిరాల సౌమ్య గారికి దేవాలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం అమ్మవారి దర్శనం అనంతరం మాట్లాడిన తంగిరాల సౌమ్య  ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల పై అవగాహన
బాపట్ల: ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ మరియు బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల...
By Gadiyapudi Narendra 2026-02-18 14:15:52 0 226
Andhra Pradesh
అభివృద్ధిలో సర్పంచులు, కౌన్సిలర్లదే కీలకపాత్ర: బేబినాయన
పట్టణం, గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, కౌన్సిలర్లదే కీలకపాత్ర అని ఎమ్మెల్యే బేబినాయన, బుడా...
By Boiena Rajesh 2026-04-16 01:19:56 0 125
Andhra Pradesh
కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి CR పాటి తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ*   *కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీ.ఆర్.పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ*...
By Rajini Kumari 2025-12-19 10:24:41 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com