హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మృతి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మృతి చెందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్ గారి సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన సంతాపం ప్రకటించారు.
బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన కేటీఆర్, వారికి ధైర్యం చెబుతూ తాము అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే కేటీఆర్ తన కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని తన పీఏ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.
అలాగే శంషాబాద్ ఏసీపీ నాగభూషణం గారితో స్వయంగా మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంలో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మృతుల దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించే ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని తన బృందాన్ని కేటీఆర్ ఆదేశించారు.
తమ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు ఇలా రోడ్డు ప్రమాదాల్లో పోవడం తనను ఎంతగానో కలిచివేసిందని పేర్కొంటూ.. మృతుల కుటుంబాలకు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో తోడుంటామని కేటీఆర్ గారు భరోసా కల్పించారు.
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy