హన్మాజిపేట పాఠశాలలో పరీక్ష ఫలితల్లో విద్యార్థినిల ప్రతిభ

0
139

వేములవాడ రూరల్: మండలం హన్మాజిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు విద్యా ఫలితాల్లో తమ సత్తా చాటారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో పాఠశాలకు చెందిన విద్యార్థినులు అత్యుత్తమ మార్కులు సాధించి పాఠశాల ప్రతిష్టను పెంచారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో టాపర్లుగా నిలిచిన విద్యార్థినులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న బొల్లారం గ్రామానికి చెందిన బుర్ర తపస్వి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే ఆరో తరగతికి చెందిన హన్మాజిపేట విద్యార్థిని కోడం స్ఫూర్తి పాఠశాలలో ద్వితీయ స్థానాన్ని, అలాగే తన తరగతిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. "ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటుకు ఏమాత్రం తీసిపోరని ఈ ఫలితాలు నిరూపించాయని క్రమశిక్షణ, నిరంతర కృషితో చదివితే ఏదైనా సాధించవచ్చని తపస్వి, స్ఫూర్తి నిరూపించారన్నారు . ఇతర విద్యార్థులు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి" అని పిలుపునిచ్చారు.

​తమ పిల్లల ప్రతిభ పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ, నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు తోటి విద్యార్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కాలినడకన వెళ్లే భవానిల ఆగ్రహం ఆవేదన
ఆదివారం రాత్రి 9.40-9.50 సమయం.     నగరంలో అన్ని రోడ్ల మీద భవానీలు కాలి నడకన...
By Rajini Kumari 2025-12-15 07:57:43 0 184
Telangana
జగ్జీవన్ రామ్ జయంతి
మనూర్ :- మనూర్ మండలంలోని బాధల్ గవ్ గ్రామ చౌరస్థలో మాజీ ఉప ప్రధాని, స్వసంత్ర సమరయోధుడు డాక్టర్...
By Gandla Vaijanath 2026-04-05 07:43:08 0 227
Andhra Pradesh
అనంతపురం గంగమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో వెలిసినటువంటి అనంతపురం గంగమ్మ తల్లిని దర్శించుకుని...
By Benguluri Madhubabu 2026-01-22 11:38:04 0 250
Telangana
"రైల్వే స్టేషన్‌లో.. గంజాయి గుట్టురట్టు”
సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో...
By Sidhu Maroju 2026-05-08 11:41:01 0 139
Andhra Pradesh
డోన్ ఒకతపల కార్యాలయం నందు ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ;;
కర్నూలు : కర్నూల్ డివిజన్ పరిధిలోని  డోన్ ఉప తపాలా కార్యాలయం నందు, భారత 77వ గణతంత్ర దినోత్సవ...
By Hari Krishna 2026-01-26 08:24:15 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com