తమిళనాడులో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం
తమిళనాడు/కృష్ణగిరి/తళి
*తమిళనాడులో కొనసాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం.*
*ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థులకు ఓట్లేయాలని కోరుతున్న ఏపీ ముఖ్యమంత్రి*
*కృష్ణగిరి జిల్లా తళి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి నాగేష్ కుమార్ ను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు*
*తళి నుంచి తిరుపతికి బస్ వేయాలని కోరిన స్థానిక ఎన్డీఏ నేతలు... అంగీకరించిన సీఎం చంద్రబాబు*
*ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...*
• ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్న ఆదరణ, అభిమానం తమిళనాడులోనూ చూపిస్తున్నారు.
• తమిళనాడుకు వచ్చినా నాకు సొంత గడ్డపై ఉన్నట్టే ఉంది.
• తమిళ సంస్కృతిపై ఎన్నో దాడులు జరిగినా ప్రాచీన వారసత్వాన్ని కాపాడుకున్న ప్రాంతం ఇది.
• ఎంతో మంది ప్రముఖులు, ఆధ్యాత్మిక ప్రాంతాలు కలిగిన తమిళనాడు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది.
• ఏపీలోని తిరుపతికి తమిళ భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. మన భాష ఏదైనా అంతా ద్రవిడులమే.
• ఎన్టీఆర్ సినీ జీవితం కూడా తమిళనాడు నుంచే ప్రారంభమైంది.
• తమిళనాడు- ఏపీ సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు నుంచే నేను వచ్చాను.
• చెన్నైకి తెలుగు గంగ నీళ్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దే.
• తమిళనాడు- ఏపీ అన్నదమ్ములుగా కలిసి అభివృద్ధి చెందుతున్నాం.
• ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి సమర్ధ నాయకత్వం ఇస్తున్నారు.
• ప్రధాని మోదీ సంక్షేమం- అభివృద్ధి- సుపరిపాలనతో దేశ భవిష్యత్తును పరుగులు పెట్టిస్తున్నారు.
• భారత్ ను ప్రపంచ పటంలో గౌరవమైన స్థానంలో ఉంచిన వ్యక్తి ప్రధాని మోదీనే.
• తమిళుల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు పట్టని పార్టీలు కొన్ని ఉన్నాయి.
• వికసిత్ భారత్ కోసం ప్రధాని విజన్ తయారు చేశారు.
• మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు బిల్లు తెచ్చారు.
• సమాజంలో మహిళలకు సమాన గౌరవం ఇచ్చేందుకు ఈ బిల్లు తెస్తే కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ఆ బిల్లును వ్యతిరేకించాయి.
• ఢిల్లీని ఓడించామని డీఎంకే విర్రవీగుతోంది... మహిళా బిల్లును అడ్డుకున్న డీఎంకే పార్టీ ఏ సాధించింది..?
• పెరిగిన సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే కాంగ్రెస్, డీఎంకేలకు వచ్చిన ఇబ్బందేమిటి..?
• గతంలోనూ కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సహకరించలేదు.
• క్రెడిట్ అవసరం లేదని... ప్రతిపక్షాలకే క్రెడిట్ ఇస్తున్నామని ప్రధాని నేరుగా చెప్పినా కాంగ్రెస్, డీఎంకేలు బిల్లును ఓడించాయి.
• నియోజకవర్గాలు 50 శాతం పెరుగుతాయని స్పష్టంగా పేర్కొన్నా ఎందుకు వ్యతిరేకించారో డీఎంకే సమాధానం చెప్పాలి.
• తమిళనాడుకు తిరిగి పూర్వ వైభవం రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ గెలవాలి.
• ఏపీలో గత పాలకులు విధ్వంసం చేస్తే 22 నెలల్లో విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం.
• గోదావరి నుంచి కావేరి వరకూ నీళ్లు తీసుకువెళ్లేలా నదులు అనుసంధానం చేస్తాం.
• ఇది జరగాలంటే కేంద్రంలో ప్రధాని మోదీ ఉండాలి. త్వరలో గంగా-కావేరీ కలవాలి.
• దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగదు. ఈ ప్రాంతానికి అన్యాయం జరగనివ్వను.
• తమిళనాడు అన్ని అంశాల్లోనూ వెనుకబడే ఉంది. దీనికి కారణం ఎవరో ప్రజలందరికీ తెలుసు.
• బసవ జయంతి లాంటి పవిత్రమైన రోజు ఈ ప్రాంతానికి రావటం నా అదృష్టం.
• తమిళనాడులో అప్పుల భారం పెరిగింది. శాంతిభద్రతలు పడిపోయాయి, డ్రగ్స్, మహిళలపై దాడులు, కస్టోడియల్ మరణాలు పెరిగాయి.
• మద్యంపై రేట్లు పెంచుకుని డీఎంకే ఆదాయం పెంచుకుంటోంది.
• అభివృద్ధి, ఉద్యోగాలు కావాలంటే కేంద్ర సహకారం అవసరం. జయలలిత స్పూర్తితో అభివృద్ధి జరగాలి.
• ఎన్డీఏకు వేసే ఓటుతో తమిళనాడు రాష్ట్రం గెలుస్తుంది. ప్రతీ ఇల్లూ, ప్రతీ వ్యక్తీ గెలుస్తారు.
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy