నందిగామలో "జలధార జలహారతి "కార్యక్రమం

0
374

నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన పెంపొందించడం ముఖ్య లక్ష్యం:

మున్సిపల్ కమిషనర్ లోవరాజు

నందిగామ, ఎన్టీఆర్ జిల్లా 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన "స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర" (SASA) ప్రతినెల 3వ శనివారం కార్యక్రమములో ఏప్రిల్ నెలకు సంబంధించి "జలధార జలహారతి" కార్యక్రమమును మునిసిపల్ కమిషనర్ జి.లోవరాజు గారు నిర్వహించారు. అనంతరం పురపాలక సంఘం కార్యాలయములో మరియు జయ సిద్ధార్ధ స్కూల్ ఆవరణలో భూగర్భ జలాల మెరుగు కొరకు ఇంకుడు గుంతలను తవ్వించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నీటి వనరుల పరిసరాలను శుభ్రపరిచే పనులు చేపట్టడంతో పాటు, భూగర్భ జలాల నిల్వ పెంపు లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమానికి అనుగుణంగా నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన పెంపొందించడం ముఖ్య లక్ష్యమని తెలిపారు. ప్రతి ఇంటిలో వర్షపు నీటి నిల్వ విధానాలను అమలు చేయడం, నీటి వృథాను నివారించడం ద్వారా భూగర్భ జలాల స్థాయిని పెంపొందించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, పురపాలక సంఘ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, మెప్మా సిబ్బంది "SASA "ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమములో శానిటరీ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్  మరియు కార్యాలయ సిబ్బంది. సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Madhya Pradesh
Bhopal Emerges as Global Hub for Innovation
The capital city, Bhopal, is buzzing today as it hosts a series of International Conferences...
By Dunna Jessicaruth 2026-05-15 05:33:20 0 43
Telangana
"అరైవ్ అలైవ్”తో అల్వాల్‌లో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద రహదారి ప్రమాదాలను...
By Sidhu Maroju 2026-04-13 11:55:58 0 360
Andhra Pradesh
కల్తీ పాల మృతుల కేసులో సీఎం చంద్రబాబు నాయుడు 10 లక్షల పరిహారం
*Press Release*   *కల్తీపాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం*  ...
By Rajini Kumari 2026-02-23 11:57:32 0 139
Telangana
కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి.. సీఎం రేవంత్ రెడ్డి మరో ఎత్తుగడ
ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ సభ ఉన్న రోజే.. రేవంత్ రెడ్డి కాళేశ్వరం బరాజ్ ల సందర్శన కాళేశ్వరంలో...
By Ponnala Srinivasrao 2026-04-19 02:13:00 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com