తపాలా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ పథకం కింద నగదు ప్రోత్సాహం

0
309

నందిగామ ఎన్టీఆర్ జిల్లా

2025 సంవత్సరమునకు గాను తపాలా శాఖ వారు నిర్వహించినటువంటి దీన్ దయాల్ స్పర్శ యోజన స్కాలర్షిప్ పరీక్షలో నందిగామ కాకతీయ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని అందులో భాగంగా విజేతలైన విద్యార్థులకు 6000 క్యాష్ ప్రైస్ మరియు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందని, ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ విజయవాడ డివిజన్ విజయవాడ శ్రీ ఎం నరసింహస్వామి తెలిపారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించినటువంటి తపాలా స్కాలర్షిప్ పరీక్షలో 40 విజేతలకు గాను 6 గురు కాకతీయ స్కూల్ నుండి ప్రాతినిధ్యం వహించడం అభినందనీయమని విద్యార్థులకు మరియు కాకతీయ స్కూల్ యాజమాన్యం వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ విధముగా ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి తపాలా శాఖ స్కాలర్షిప్ పరీక్షల్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగా విద్యార్థులు ఎక్కువ మొత్తంలో పాల్గొనాలని నరసింహ స్వామి పిలుపునిచ్చారు. మరియు జాతీయస్థాయిలో జరిగేటువంటి ఫిలాటిలిక్ ఎగ్జిబిషన్ లో భాగంగా పేరున్న ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు వారి యొక్క జాతీయ స్థాయి గుర్తింపు నిమిత్తం కార్పొరేట్ మరియు కామెమోరాటివ్ స్టాంప్స్ రిలీజ్ కు ముందుకు రావలసిందిగా  ఎం. నరసింహస్వామి  అభ్యర్థించారు. ఈ కార్యక్రమమునకు నందిగామ పోస్టల్ ఇన్స్పెక్టర్ లాహోరి విష్ణు, కాకతీయ స్కూల్ డైరెక్టర్ కార్తికేయ స్కూల్ ప్రిన్సిపల్, స్కూల్ సిబ్బంది మరియు పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కిడ్నీ వ్యాధి రహిత సమగ్ర కార్యాచరణ ఎంపీ కేసినేని శివనాథ్
*Revized*       *ప్ర‌చుర‌ణార్థం* *10-01-2026*   *కిడ్నీ...
By Rajini Kumari 2026-01-10 12:33:47 0 142
Andhra Pradesh
పుంగనూరులో ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష తేదీ ఎప్పుడంటే
పుంగునూరు మండలంలోని అడవినాదుని కుంట ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతిలోకి ప్రవేశ పరీక్ష ఈనెల 12న ఉదయం 10...
By Kothuru Murali 2026-04-10 04:51:37 0 69
Telangana
నిజామాబాద్.SFS పాఠశాల సైన్స్ ఫెయిర్ నిర్వాహణ
నిజామాబాద్.ఎస్ఎఫ్ఎస్ స్కూల్ లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఇ కారయక్రమంలో పాలు పఠశాలల...
By Sadaq Sadaq 2026-02-28 15:27:46 0 130
Andhra Pradesh
ఆనందంగా హోలీ పండుగ
విశాఖ పట్నం జిల్లా లో నలుమూలలనుంచి ప్రజలు హోలీ పండుగ జరుపుకొన్నారు .వివరాలు కు వెళ్లితే పట్టణం...
By Mobbu Venkatramana 2026-03-03 08:10:38 1 206
Andhra Pradesh
Pawan Kalyan: ఢిల్లీలో డిప్యూటీ సీఎం.. పిఠాపురం అభివృద్ధికి పవన్ ప్రత్యేక చొరవ.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ పిఠాపురం...
By Pagadala Venkateswar 2026-01-29 07:03:07 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com