అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

0
166

 

-- 861 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం

-- రూ. 15 వేల కోట్ల‌కు పైగా విలువైన భూమిని కాపాడిన ప్ర‌భుత్వం

న‌గ‌ర చ‌రిత్ర‌లో నిలిచిపోయే భారీ ఆప‌రేష‌న్‌ను ప్ర‌భుత్వ‌ యంత్రాంగం శ‌నివారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో నిర్వ‌హించింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విదంగా 861ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని రెవెన్యూ, మున్సిప‌ల్, పోలీసు అధికారుల‌తో క‌లిసి హైడ్రా కాపాడింది. ఈ భూమి విలువ‌ మార్క‌ట్లో రూ. 15 వేల కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంచ‌నా. భారీ పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య హైడ్రా, రెవెన్యూ, మున్సిప‌ల్ శాఖ‌ల‌తో పాటు ఇత‌ర విభాగాలు ఈ ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించాయి. ఇప్ప‌టికే ఇల్లు క‌ట్టుకుని ఉన్న వారిని మిన‌హాయించి ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇల్లు క‌ట్టుకున్నపేదలు, సామాన్యులు ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని ఎప్ప‌టిక‌ప్పుడు మైకులో అధికారులు మైకు ద్వారా ప్ర‌క‌టించాయి. దీంతో పేద‌లంతా ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రా ఫెన్సింగ్ కార్య‌క్ర‌మానికి స‌హ‌క‌రించారు. ఇదే స‌మంలో అక్క‌డ పాత లే ఔట్ల‌లోని ప్లాట్ల య‌జ‌మానులు సంబ‌రాలు చేసుకున్నారు. ట‌పాసులు పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. మా లే ఔట్ల‌ను కాపాడుకోడానికి మేమంతా కోర్టుకు వెళ్లి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. ప్ర‌భుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు.. కాదు లే ఔట్లు వేశాం ఆ భూమి మాది అని అక్క‌డి ప్లాట్ల య‌జ‌మానులు కోర్టులో పోరాడుతున్నారు. మ‌ధ్య‌లో ఎం. ఎ. ముఖీం అనేటోడు వ‌చ్చి అన్యాయంగా ఆ భూముల‌ను తెగ‌న‌మ్ముకోడానికి ఇన్నాళ్ల‌కు ప్ర‌భుత్వ యంత్రాంగం అడ్డుక‌ట్ట వేసింద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్‌లకు ఉచిత డిగ్రీ విద్య: అంబేద్కర్ యూనివర్శిటీ కీలక నిర్ణయం
సరికొత్త అవకాశం: తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ...
By Triveni Yarragadda 2025-08-11 14:08:16 0 1K
Andhra Pradesh
కర్నూలు పోలీస్ ఎస్పీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు !
కర్నూలు : కర్నూలు సిటీ :  కర్నూలు  ఎస్పీ  క్యాంపు కార్యాలయంలో  77  వ...
By Hari Krishna 2026-01-26 08:35:04 0 379
Telangana
చేప ప్రసాదం పంపిణీ
రాష్ట్ర ప్రజలందరికి మృగశిర కార్తె శుభాకాంక్షలు. నేడు,రేపు చేప ప్రసాదం పంపిణీ-పటిష్ట ఏర్పాట్లు...
By Vadla Egonda 2025-06-08 02:05:43 0 2K
Telangana
దొంగతనల నివారణకు ప్రత్యేక దృష్టి : ఏసీపీ కిరణ్ కుమార్
మంచిర్యాల జిల్లా : బంగారు ఆభరణాల వ్యాపారులు,గోల్డ్ లోన్ సంస్థల సిబ్బంది అప్రమత్తంగా...
By Avunoori Mahesh 2026-05-08 11:50:58 0 133
Andhra Pradesh
పుంగనూరు మండలంలో సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
పుంగనూరు మండలంలోని మర్సనపల్లికి చెందిన మంగమ్మ కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ. 60,000 విలువైన...
By Kothuru Murali 2026-03-22 07:15:12 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com