అధికారులతో చర్చిస్తున్న బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి

0
113

ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎండౌమెంట్స్ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఏఈ, ఈఓ మరియు సిబ్బందితో కలిసి దేవాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా గోపురాల నిర్మాణం, పెయింటింగ్, కంపౌండ్ వాల్, కళ్యాణ మండపాలు మరియు ఇతర సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.

నందవరం మండలం గురుజాల రామలింగేశ్వర స్వామి ఆలయం, గోనేగండ్ల మండలం చింతలముని స్వామి ఆలయం, ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల చెన్నకేశవ స్వామి ఆలయం, అలాగే ఎమ్మిగనూరు పట్టణంలోని రామస్వామి ఆలయం, పాత ఆంజనేయ స్వామి ఆలయం మరియు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని పేర్కొంటూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు తెలిపారు.

ఈ సమావేశంలో ఎండౌమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్, ఏఈ, ఈఓ, సిబ్బంది, ఆలయ పూజారులు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిపై గుంతలు పడి...
By Kothuru Murali 2026-04-07 05:49:06 0 141
Andhra Pradesh
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
By Kothuru Murali 2026-02-15 05:43:43 1 476
Andhra Pradesh
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ
*ఢిల్లీ*   తాజ్ ప్యాలెస్ హోటల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Rajini Kumari 2025-12-20 14:50:27 0 177
Delhi - NCR
Formal Request Submitted for 100-Bed ESI Hospital in Vasanthanarasapura Industrial Area
In a significant step toward enhancing healthcare infrastructure for the industrial workforce, a...
By Venugopal Gopal 2026-01-01 17:42:07 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com