భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో మరింత వేగం పెంచాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

0
202

హనుమకొండ, ఏప్రిల్ 10:భద్రకాళి చెరువు పూడికతీత పనులను మరింత వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం భద్రకాళి చెరువులో కొనసాగుతున్న పూడికతీత పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం కాజీపేట మండలం అమ్మవారిపేటలోని ప్రభుత్వ స్థలాలలో డంపింగ్ చేస్తున్న పూడిక మట్టిని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా చెరువులో జరుగుతున్న పూడికతీత పనుల పురోగతిని తెలుసుకుని, మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. భద్రకాళి చెరువులో తీస్తున్న పూడిక మట్టిని ప్రభుత్వ భూముల్లో క్రమపద్ధతిలో నిల్వ చేయాలని, భూముల పరిరక్షణకు ఇది ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పూడికతీత పనులను మే 15 నాటికి పూర్తిచేసే విధంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే అమ్మవారిపేటతో పాటు ఇతర ప్రాంతాలలో పూడిక మట్టిని నిల్వ చేస్తున్న ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.మొత్తం 7.70 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు సుమారు 2 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత పూర్తయిందని, మిగిలిన పనులను వేగవంతం చేసి లక్ష్యాన్ని సమయానికి చేరుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తాగునీటి పారుదల శాఖ ఈఈ కిరణ్ కుమార్, డిఈ మధుసూదన్ రెడ్డి, కుడా సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, ఏఈ శ్యామ్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదం పై కేసు నమోదు చేసిన పోలీసులు
శనివారం మధ్యాహ్నం పుంగనూరు మండలం, బొనేపల్లి గ్రామ మలుపు వద్ద టాటా ఏస్ వాహనాన్ని వ్యాక్స్ వ్యాగన్...
By Kothuru Murali 2026-02-08 10:19:56 0 184
Andhra Pradesh
రాయల్పాడు వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి.
శుక్రవారం ఉదయం మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప...
By Pagadala Venkateswar 2026-04-03 06:04:33 0 151
SURAKSHA
Police Solve Murder Case in Nagarkurnool District
In a tragic incident in Avanja village, Nagarkurnool district, Ammapalli Yadaiah (50) was...
By Kalaga Sailaja 2026-06-27 04:32:27 0 45
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సోమల మండలం సమస్య పరిష్కరించకపోతే ఆత్మహత్య శరణ్యం: రాధమ్మ
అన్నమయ్య జిల్లా సోమల మండలం, మిట్టపల్లి గ్రామానికి చెందిన రాధమ్మ అనే మహిళ డ్వాక్రా రుణం వడ్డీ...
By Kothuru Murali 2026-06-06 15:18:22 0 86
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండల సరిహద్దులో ఉన్న రేగల్లుకు చెందిన ముగ్గురు గురువారం అర్ధరాత్రి...
By Kothuru Murali 2026-06-26 16:23:30 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com