అమరావతి అభివృద్ధికి కీలక ముందడుగు.. రూ.2,534 కోట్లతో కేంద్ర సచివాలయం.

0
209

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపడంతో నిర్మాణ కార్యకలాపాల్లో కదలిక మొదలైంది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. మొత్తం రూ.2,534 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ) కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపింది.

 

ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.1,299.08 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం సెంట్రల్ సెక్రటేరియట్, రూ.1,234.91 కోట్లతో ఉద్యోగుల కోసం నివాస సముదాయాలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సీఆర్డీఏ ఇప్పటికే 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సచివాలయం, మిగిలిన 17 ఎకరాల్లో నివాస భవనాలు నిర్మిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ శాఖ పంపిన ప్రతిపాదనకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదివరకే ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

 

మరోవైపు, అమరావతిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కూడా ఖరారైంది. ఇక్కడి రాయపూడిలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 787 సెంట్ల భూమికి సంబంధించిన లీజు అగ్రిమెంట్‌ ప్రక్రియ బుధవారం పూర్తయింది. సీఆర్డీఏ, కాగ్ అధికారుల మధ్య ఒప్పంద పత్రాల మార్పిడి జరిగింది. ఇదే క్రమంలో, 10 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తామని హడ్కో కూడా ఆసక్తి చూపడం విశేషం.

Search
Categories
Read More
Andhra Pradesh
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్ప
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కూనుబిల్లి ఆదేశాలు, డిఎస్పి మహేంద్ర సూచనల మేరకు సంక్రాంతి పండుగ...
By Kothuru Murali 2026-01-13 09:25:56 0 186
Tripura
Tripura Healthcare: Debate Over Doctors' Private Practice Ban
The government's recent prohibition on private practice for doctors at GB Pant Hospital and...
By Lokeshwari Panthadi 2026-07-03 04:33:21 0 42
Andhra Pradesh
తేది :16.6.2026 కొత్తూరు గ్రామం వెలుగొండ ప్రాజెక్ట్ ====
తేది :16.6.2026. కొత్తూరు గ్రామం.వెలుగొండ ప్రాజెక్ట్ =======  ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆగస్టు...
By Chennaiah Kati 2026-06-16 09:10:49 0 81
Telangana
నిజామాబాద్
సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న గ్రహీత డాక్టర్...
By Sadaq Sadaq 2026-04-14 02:43:23 0 122
Andhra Pradesh
జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో పాలగొన్న: కలెక్టర్.
అమరావతిలో శుక్రవారం జరిగిన జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-02-21 04:30:49 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com