ఆంధ్ర రాజాసింగ్ రఘురామ పురం రాజును అరెస్టు చేయాలి, విలేఖరుల సమావేశంలో దళిత నేత నీలం డిమాండ్.

0
27

చీరాల 

అకివీడు మాల పేట పై రాముడు పేరుతో అధికార పోలీస్ బలగలాతో దాడి చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు ను అరెస్టు చేయాలని నీలం నాగేంద్ర రావు డిమాండ్ చేశారు. చీరాల అంబేద్కర్ భవన్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ అకివీడు నియోజకవర్గం లో అనుమతి లేని చర్చ్ లను కూల్చి వేయటానికి నోటీసు లు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రం లోని అనుమతులు లేని గుడులు, వైయస్సార్, ఎన్టీర్ విగ్రహాలను కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. ఆకువీడు మాల పేట పై డీప్యూటీ స్పీకర్ హోదా లో, పోలీస్ బలగాలతో టీడీపీ, జనసేన కార్యకర్తలతో వెళ్లి మత ఘర్షణల కు సనాతన కూటమి డాడీ చేయటం హెయమన్నారు. ఆకువీడు ఘటన లో 63మంది మాల ల పై హత్యయత్నం మత విద్యేశ చట్టం క్రింద పోలీస్ కేసు లు పెట్టి 10వ తరగతి పరీక్షలు రాయకుండా పిల్లలును, మహిళలను అరెస్టు చేయటం కూటమి ప్రభుత్వం మాలల అణిచి వెతకు నిదర్శనం అన్నారు. మాల ల పై రఘురామకృష్ణం రాజు మనువాద అధికార దాడిని టీడీపీ, జనసేన తో పాటు ప్రతి పక్ష మైన వైయస్సార్ పార్టీ కూడా కండించలేదు అన్నారు. జైల్లో వున్న వైఎస్సార్ పార్టీ నాయకుల ను జైలులోపలకి వెళ్లి పరామర్శించిన జగన్ అకివీడు ఎందుకు వెళ్ళలేదు అన్నారు. మాల పేరుతో కుల సంఘాలో ఎమ్మెల్సీ ,కార్పొరేషన్ చెర్మెన్ పదవులు పొందిన జూపూడి ప్రభాకర్ లాంటి మాల మేధావులు అకివీడు పై ఎందుకు నోరు విప్పడం లేదు అన్నారు. తెనాలి లో మాల యువకులపై పోలీసులు అధికారులు చేసిన దాడి పై స్పందించిన రాజ్యాంగం నిపుణురాలు హోమ్ శాఖ మంత్రి అనిత, ఆకువీడు మాల భాదితులను పరామర్శిచలన్నారు. ప్రకాశం జిల్లా బండ్లమూడి లోమాదిగ ల పై జరిగిన చిన్న దాడి పై స్పందించి, స్వయంగా విచారణ కు వచ్చి అగ్రకుల నిందితులను అఘామేఘాలమీద స్పందించిన ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్ అకివీడు మాల పేట ను సందర్శించి మాలలపై దాడి చేసిన రఘురామకృష్ణంరాజు ముఠాపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్టు చేయాలన్నారు. రఘురామకృష్ణం రాజు లాగే హైదరాబాదులో హిందూ మతం పేరుతో ఓవర్ యాక్షన్ చేసిన బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను కూడా బిజెపి పార్టీ సభ్యత్వం నుండి తొలగించించాలన్నారు. మాలల కోటాలో మంత్రి పదవి పొందిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అకివీడు మాలలను పరామర్శించకుండా కూటమి ప్రభుత్వ దాడులకు డోలు కొడుతున్నారన్నారు. అకివీడు మాలలపై ఓటమి ప్రభుత్వ సనాతన దాడిలో పాల్గొన్న రఘురామకృష్ణ రాజు పై ప్రైవేటు కేసు హైకోర్టులో వెయ్యాలని నీలం నాగేంద్ర డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కార్యదర్శి కాకుమాను రవి మరియు వివిధ సంఘాల నాయకులు మేడికొండ మురళి, పట్రాబంగారం, బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Goa
AI Enters Goa Classrooms: A Powerful Tool, Not a Replacement
AI Enters Goa Classrooms: A Powerful Tool, Not a Replacement Artificial Intelligence (AI) is no...
By BMA ADMIN 2025-05-21 09:27:54 0 2K
Andhra Pradesh
44వ జాతీయ యోగ చాంపియన్ షిప్ 2025-26 ప్రారంభోత్సవ కార్యక్రమం..
జిల్లెలమూడి శ్రీవిశ్వ జనని పరిషత్... అమ్మ ప్రాంగణంనందు ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం.. బాపట్ల :...
By Gadiyapudi Narendra 2025-12-27 11:05:28 0 395
Telangana
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం- మంత్రి పొంగులేటి.|
హైదరాబాద్: పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డుల జీవో. వచ్చే ఏడాది ఇళ్ల స్థలాల కేటాయింపు పై తీపి...
By Sidhu Maroju 2025-12-20 10:49:21 0 156
Telangana
ఒకేసారి రెండు చోట్ల విపత్తులు సంభవిస్తే తగిన చర్యలు ఎలా తీసుకోవాలి... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ జిల్లాలో రెండు ప్రాంతాలలో ఓకే సారి వర్షాలు,వరదలు లాంటి విపత్తులు సంభవించిన జిల్లా యంత్రాంగం...
By Gangaram Rangagowni 2025-12-22 11:46:22 0 255
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం సదుం మండలంలోని గొంగివారిపల్లి గ్రామపంచాయతీ...
By Kothuru Murali 2026-03-01 14:42:18 0 74
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com