వేటపాలెం రోమన్ క్యాతిలిక్ మిషన్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్బంగా పరిశుద్ధ సిలువ మార్గ ధ్యానములు.

0
329

సర్వమానవాళి పాప పరిహారమునకై జేసు క్రీస్తు ప్రభువు సిలువను మోసి, తన రక్తం చిందించి, సిలువపై మరణమొంది తిరిగి మూడవ రోజు లేచిన యేసుక్రీస్తు బోధించిన మార్గమే సర్వమానవాళ్ళికి మోక్ష మార్గమని ఆర్.సి.ఎం చర్చి విచారణ గురువు టీ. కరుణాకర్ పేర్కొన్నారు.ఈ సందర్బంగా గుడ్ ఫ్రైడే సూచికంగా ఆనాడు ఏసు ప్రభువు శిలువను మోస్తూ పొందిన శ్రమలను కళ్ళకు కట్టినట్లుగా పురవిధులలో ప్రదర్శించారు.

ప్రపంచములోని క్రైస్తవ ప్రజలు 40 రోజులు పాటు ఎంతో పవిత్రముగా భక్తి శ్రద్దలతో ఉపవాసలతో పవిత్రంగా ఆచరించే 

ఈ శిలువ మార్గం వేటపాలెంలో ప్రత్యేక ఆకర్షణంగా ఉందని చీరాల మాజీ ఏఎం సీ చైర్మన్ మార్పు గ్రెగోరి అన్నారు.ఈ కార్యక్రమము లోరోమన్ క్యాతోలిక్ మిషన్ గురువు టీ. కరుణాకర్, జె.యం.జె సిస్టర్స్ రాజమ్మ, సంతోషమ్మ,పెద్దలు మార్పు జార్జి, మార్పు విన్సెంట్ పాల్, బాపట్ల జిల్లా రెవిన్యూ అధ్యక్షులు చేగూడి సురేష్ పాల్గొన్నారు.

ముఖ్యంగా 40 రోజులు ఉపవాస దీక్ష లో ఉన్న భక్తులకు ఈ కార్యక్రమము లో పాల్గొన గ్రామాల ప్రజలకు *మరియ దళం మహిళ* సభ్యులు మార్పు బుజ్జి, సలగల ప్రభావతి, మార్పు లక్ష్మి, మార్పు సుప్రియ, సలగల జ్యోతి, మార్పు అరుణ, కూరకుల సుశీలా, పేర్లి ఉష, కూరాకుల రోజానా, మార్పు పవిత్ర, దాసరి రూతుమ్మ, కొమ్మరాభత్తిన ఏసుమ్మ, నీస్సి ప్రదీప్ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది.వేటపాలెం లోని జేసునగర్, పొట్టిసుబ్బయ్య పాలెం, అక్కాయపాలెం, సిలోన్ కాలనీ, సెయింట్ ఆంథోనీ లెప్రసీ కాలనీ, రామచంద్రాపురం,సర్వోదయ కాలనీ క్రైస్తవ మహిళలు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Payyavula Keshav: కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ గుట్టురట్టు... ఇవిగో ఆధారాలు: పయ్యావుల కేశవ్.
టీటీడీ నెయ్యి కల్తీకి వైసీపీ ప్రభుత్వమే కారణమన్న పయ్యావుల 2022లోనే కల్తీపై...
By Pagadala Venkateswar 2026-01-31 12:13:00 0 112
Andhra Pradesh
జనసేన నాయకులపై రైతుల మోసం ఆరోపణలు
పుంగనూరు నుంచి రైతుల వద్ద నుంచి టమోటాలు కొనుగోలు చేసి, వారికి డబ్బులు చెల్లించకుండా మోసం...
By Kothuru Murali 2026-05-18 15:13:44 0 26
Andhra Pradesh
“విశాఖ నిజంగా భవిష్యత్ మెట్రో సిటీయేనా?”
విశాఖపట్నం… సముద్రం, కొండలు, పోర్టులు, IT అవకాశాలతో వేగంగా ఎదుగుతున్న నగరం....
By Babitha Babitha 2026-05-18 08:05:10 0 47
Andhra Pradesh
YS Sharmila: ప్రత్యేక హోదా అడిగే సత్తా జగన్‌కు లేదు: షర్మిల.
ప్రధాని మోదీ చేతిలో సీఎం జగన్ కీలుబొమ్మగా మారారన్న షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా...
By Pagadala Venkateswar 2026-02-13 06:57:01 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com