విద్యార్థుల భవిష్యత్తుకు 'గరుగు' భరోసా

0
210

Bharath aawaz today news మొయినాబాద్, మార్చి 27: విద్యార్థుల విద్యా భవిష్యత్తు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మొయినాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గరుగు రాజు తన ఉదారతను చాటుకున్నారు. హిమాయత్నగర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు ఆరు నెలల క్రితం పదోన్నతిపై వెళ్లడంతో, పదో తరగతి విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆయన గుర్తించారు. పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థులకు నష్టం

జరగకూడదని భావించిన ఆయన, జీ ఆర్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా మహేందర్ అనే ప్రైవేట్ గణిత ఉపాధ్యాయుడిని నియమించారు. నియమించిన ఉపా ధ్యాయుడికి బుధవారం తన సొంత డబ్బులతో గరుగు రాజు వేతనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులే దేశ భవిష్యత్తుకు దిక్సూచి అని, వారికి నాణ్యమైన విద్య అందాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఎంఈఓ మల్లయ్య, ప్రధానోపాధ్యాయురాలు జులేక సుల్తానా, ఎస్ఎంసి ఛైర్మన్ మహేశ్వరి, నాయకులు చదువు రామచందర్, ఉపాధ్యాయులు రాములు, అరుణ, శైలజ, భాగ్యలక్ష్మి, సుమిత్ర, సుగుణ, రవి, విద్యార్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేసిన కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్
 దొడ్డి అల్వాల్ సుభాష్‌నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్తులకు కార్పొరేటర్  సబిత అనిల్...
By Sidhu Maroju 2025-06-26 10:06:01 0 1K
Andhra Pradesh
మహిళల మాన ప్రాణాలకు భద్రత లేదా. - జిల్లాలో శాంతిభద్రతలు కరువు. - కూటమి పాలనలో రక్షణ లేని రాష్ట్రంగా, ఆంధ్ర రాష్ట్రం - పూజిత.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా...
By Ratna Sekhar 2026-03-11 07:09:39 0 131
Andhra Pradesh
Godavari Pushkaralu: 2027 గోదావరి పుష్కరాలు: మహా కుంభమేళా తరహాలో నిర్వహణకు ఏపీ సర్కార్ నిర్ణయం.
2027 గోదావరి పుష్కరాలపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం మహా కుంభమేళా స్థాయిలో పుష్కరాలు...
By Pagadala Venkateswar 2026-02-27 04:26:59 0 82
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com