Sreelalitha: విజయవాడ గాయనిపై మోదీ ప్రశంస.. ప్రధాని పోస్ట్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు.

0
166

విజయవాడ గాయని శ్రీలలిత ఆలపించిన ఓ భక్తి గీతానికి అరుదైన గౌరవం దక్కింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవిని స్తుతిస్తూ ఆమె పాడిన పాటను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. విజయవాడ గాయనికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.

 

విజయవాడ సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన గాయని శ్రీలలిత దుర్గమ్మపై ‘కనకదుర్గా మహా ప్రమావిత’ అనే పాటను ఆలపించారు. ఈ పాట యూట్యూబ్ లింకును ప్రధాని మోదీ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ "దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మనసు అపారమైన శక్తిసామర్థ్యాలతో నిండిపోతుంది" అని పేర్కొన్నారు. ప్రధాని స్వయంగా ఒక తెలుగు భక్తిగీతాన్ని ప్రశంసించడంతో ఈ పాట ఒక్కసారిగా వైరల్ అయింది.

 

ఈ పరిణామంపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ నగరానికి చెందిన ఓ మహిళ పాడిన పాటను ప్రధాని గుర్తించి, ప్రజలతో పంచుకోవడం విజయవాడ వాసులందరికీ గర్వకారణమని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రతిభకు ప్రధాని నుంచి ప్రోత్సాహం లభించడం ఎంతో సంతోషకరమని అన్నారు.

Search
Categories
Read More
Legal
Delhi High Court Issues Notice to Centre on Plea to Equalise Legal Age of Marriage for Men and Women
Delhi High Court Issues Notice to Centre on Plea to Equalise Legal Age of Marriage for Men and...
By BMA ADMIN 2025-05-21 12:41:17 0 2K
Andhra Pradesh
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలో వకుళ మాత ఆలయంలో అక్షరాభ్యాసం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలో వకుళ మాత ఆలయంలో అక్షరాభ్యాసం -...
By Chennaiah Kati 2026-07-03 17:04:34 0 54
Andhra Pradesh
ఆధునిక పరికరాల పై 90 శాతం రాయితీ.
AP Weavers Get Machines At 90% Subsidy: చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త....
By John Baji 2025-12-23 07:39:49 0 231
Andhra Pradesh
మదనపల్లె ఘటన.. ఘోరంగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు.
మదనపల్లెలోని రాగిమానిదిన్నెపల్లెలో కుమార్తె రిషిక ప్రియా మృతదేహాన్ని చూసి తల్లి తీవ్ర దుఃఖంలో...
By Pagadala Venkateswar 2026-02-18 07:07:05 0 173
Andhra Pradesh
నిమ్మనపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు.
గురువారం రాత్రి నిమ్మనపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా,...
By Pagadala Venkateswar 2026-01-23 07:33:11 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com