Sreelalitha: విజయవాడ గాయనిపై మోదీ ప్రశంస.. ప్రధాని పోస్ట్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు.

0
165

విజయవాడ గాయని శ్రీలలిత ఆలపించిన ఓ భక్తి గీతానికి అరుదైన గౌరవం దక్కింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవిని స్తుతిస్తూ ఆమె పాడిన పాటను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. విజయవాడ గాయనికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.

 

విజయవాడ సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన గాయని శ్రీలలిత దుర్గమ్మపై ‘కనకదుర్గా మహా ప్రమావిత’ అనే పాటను ఆలపించారు. ఈ పాట యూట్యూబ్ లింకును ప్రధాని మోదీ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ "దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మనసు అపారమైన శక్తిసామర్థ్యాలతో నిండిపోతుంది" అని పేర్కొన్నారు. ప్రధాని స్వయంగా ఒక తెలుగు భక్తిగీతాన్ని ప్రశంసించడంతో ఈ పాట ఒక్కసారిగా వైరల్ అయింది.

 

ఈ పరిణామంపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ నగరానికి చెందిన ఓ మహిళ పాడిన పాటను ప్రధాని గుర్తించి, ప్రజలతో పంచుకోవడం విజయవాడ వాసులందరికీ గర్వకారణమని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రతిభకు ప్రధాని నుంచి ప్రోత్సాహం లభించడం ఎంతో సంతోషకరమని అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఘన నివాళులు
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు...
By Benguluri Madhubabu 2026-01-18 06:36:15 0 303
Andhra Pradesh
ద్విచక్ర వాహనాలు సీజ్
తాడిపత్రి లో ఏ ఎస్పీ  రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ వారి ఆదేశాల తో తాడిపత్రి లో సి ఐ...
By Gitta Raju 2026-04-10 01:38:20 0 268
Telangana
కూకట్పల్లిలో 62 మంది నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే కలుషితరహిత త్రాగునీరు, మెరుగైన రహదారులు, నిరంతర...
By Jagadeesh Babu 2026-05-27 14:27:29 0 285
Telangana
గోదావరిలో నీళ్లు లేకపోతే.. పోలవరంలో రోడ్లు ఎలా కొట్టుకుపోతాయి? రేవంత్ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలు!
గోదావరి నదిలో అసలు నీటి ప్రవాహమే లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలకు,...
By Ponnala Srinivasrao 2026-07-09 01:46:55 0 119
Puducherry
CM Rangasamy Urges Centre For Fishermen's Special Diesel Subsidy Continuation
Puducherry Chief Minister N. Rangasamy has officially approached the Union Petroleum Minister,...
By Tejaswini Komanduru 2026-06-05 11:01:13 0 396
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com