Chandrababu: తిరుమలలో మనవడితో సీఎం చంద్రబాబు.. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డన.

0
130

సీఎం చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారు భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి ప్రత్యేక సేవలో పాల్గొన్నారు.

 

శ్రీవారి దర్శనం పూర్తయ్యాక, ఆలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌, దేవాన్ష్‌తో కలిసి కాలినడకన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి బయలుదేరారు. ఈ క్రమంలో మాడ వీధుల గుండా వెళ్తూ దారిపొడవునా ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన భద్రతా సిబ్బందిని పక్కకు జరిపి, భక్తుల వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. పలువురు భక్తులతో ఆయన, మనవడు దేవాన్ష్ కలిసి ఫొటోలు దిగారు. భక్తులు దేవాన్ష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

అనంతరం అన్నదాన సత్రానికి చేరుకున్న చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఈ సేవలో పాల్గొనడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాయల్పాడు వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి.
శుక్రవారం ఉదయం మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప...
By Pagadala Venkateswar 2026-04-03 06:04:33 0 109
Manipur
“मणिपुर में अवैध पॉपि खेती पर नकेल, सरकार सख़्त”
मणिपुर सरकार नै #वनविभाग के अफ़सरां कूं सतर्क रहणो कह्यो है। मुख्य मकसद राज्य में होण वालो अवैध...
By Pooja Patil 2025-09-12 05:01:47 0 230
Andhra Pradesh
పిల్లల ఎదుగుదలలో పోషకాహారం కీలకం – డాక్టర్ ఉమాకాంత్ సూచనలు
రాజమండ్రి: చిన్నపిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో సరైన ఆహారపు అలవాట్లు ఎంతో కీలకమని రాజమండ్రిలోని శ్రీ...
By Ratna Sekhar 2026-03-11 03:42:40 0 239
Telangana
"బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి.. ప్రముఖుల వెల్లువ.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నూతన చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి ఘనంగా...
By Sidhu Maroju 2026-05-21 07:39:43 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com