మదనపల్లె: ఇంట్లో పాతిపెట్టిన బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం.
Posted 2026-03-21 06:09:55
0
172
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లిలో శుక్రవారం ఒక అనుమానాస్పద ఘటన వెలుగుచూసింది. ఇంట్లో పాతిపెట్టిన బాలుడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఉద్యోగరీత్యా కదిరిలో నివసిస్తున్న విజయబాబు–నందిని దంపతుల కుమారుడు వర్షిత్, గత నెల 12న మెట్లపై నుంచి పడి మృతి చెందాడని తల్లి చెప్పడంతో, మృతదేహాన్ని గ్రామంలోని ఇంట్లో పాతిపెట్టారు. అయితే, భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాసిల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డాక్టర్ లేక పేషంట్ అవస్థలు
బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు
హాస్పిటల్ లో కనబడని డాక్టర్లు
మహబూబాబాద్ జిల్లా:::...
Premier League Title Race Pushed to the Absolute Wire
An absolute thriller is unfolding in the English Premier League as today’s high-stakes...
MARK OF REPUBLIC DAY
Republic Day marks the day India chose law over power and institutions over individuals. The...
మదనపల్లిలో ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలి –STU నిరసన.
శుక్రవారం మదనపల్లెలో స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) నాయకులు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్...
. 'CEN' Wings for Tackling Cyber Crime
To combat growing digital threats, Karnataka Police established dedicated 'CEN' (Cyber, Economic,...