Putta Mahesh: పార్టీకి నష్టం చేసే వారిని మోయలేం: పుట్టా మహేశ్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్.

0
181

మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను తుపాను సృష్టిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

 

 

తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పుట్టా మహేశ్ కు ఎంపీ టికెట్ ఇస్తే, ఆయన ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి డ్రగ్స్ పార్టీలకు వెళ్లడం క్షమించరాని తప్పని, ఇలాంటి వారి ప్రవర్తన వల్ల పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దురలవాట్లతో పార్టీ పరువు తీసే వారిని మోయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు.

 

 

 

టీటీడీ మాజీ చైర్మన్, ప్రస్తుత మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడైన మహేశ్... మంచి రాజకీయ నేపథ్యం ఉండి కూడా ఇలా ప్రవర్తించడం సరికాదని చంద్రబాబు హితవు పలికారు. ఇప్పటికే పార్టీ నుండి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయని, ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించామని గుర్తు చేశారు. వివరణ సంతృప్తికరంగా లేకపోతే కఠినమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. నాయకులంతా ప్రజల్లో విశ్వసనీయతను కాపాడుకోవాలని, వ్యక్తిగత ప్రవర్తన విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు.

Search
Categories
Read More
Telangana
"మల్కాజిగిరి కమిషనరేట్‌కు కొత్త క్యాంప్ కార్యాలయం ప్రారంభం."|
"ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు అందించడమే లక్ష్యం: డీజీపీ సీ.వి. ఆనంద్." మేడ్చల్ మల్కాజిగిరి...
By Sidhu Maroju 2026-06-17 09:24:46 0 125
Goa
Outrage Grows Over Illegal Land Filling in Taleigao: Activists Decry Environmental Damage and Alleged Corruption
Outrage Grows Over Illegal Land Filling in Taleigao: Activists Decry Environmental Damage and...
By BMA ADMIN 2025-05-21 08:54:16 0 2K
Andhra Pradesh
హాస్పిటల్ కి ఐఎస్ఓ సర్టిఫికెట్ : కర్నూలు
కర్నూలు : కర్నూలులోని మెడికెవరు హాస్పిటల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఐఎస్ఓ సర్టిఫికెట్...
By Hari Krishna 2025-12-25 07:59:38 0 215
Business & Finance
Section 8 Company: A Smart Choice for Social Impact
A Section 8 Company is a non-profit organization registered under the Companies Act, 2013. It is...
By Navya Sree 2026-07-18 05:36:31 0 35
Telangana
మహిళల సాధికారతకు అంబేద్కర్ చూపిన మార్గం ఆదర్శం: మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి|
హైదరాబాద్, మే 7: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం సమాజ అభివృద్ధికి మార్గదర్శకం...
By Avunoori Mahesh 2026-05-07 12:26:51 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com