Five states election dates declared by E C
[15/03, 6:16 pm] null: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ప్రతి పోలింగ్ బూత్లో 1200 మంది ఓటర్లకు మించకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో కలిపి 2.18 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో 17.4 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగేలా ఏర్పాట్లు చేశామని సీఈసీ తెలిపారు.
[15/03, 6:17 pm] null: అసోం ఎన్నికల షెడ్యూల్ విడుదల
అసోంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఈ నెల 23 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా, మే 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.
[15/03, 6:18 pm] null: ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ
తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్, మే 4న ఫలితాలు ప్రకటించనున్నారు. కేరళలో ఏప్రిల్ 9న ఎన్నికలు, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.
బెంగాల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్, మే 4న ఫలితాలు ప్రకటించనున్నారు.
పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగగా, మే 4న ఫలితాలు వెల్లడించనున్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz