*ట్రాఫిక్ సమస్య పరిష్కరించడమే మా లక్ష్యం* *-ట్రాఫిక్ ఎస్సై పవన్ కుమార్*

0
738

చీరాల పట్టణంలో ప్రతిరోజు రాత్రి 7 దాటితే మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉండేది.ట్రాఫిక్ సమస్యకు ముఖ్య కారణం ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఆ రోడ్లో ప్యాసింజర్స్ కోసం నిలిపి ఉండటం.అందువల్ల ప్రజలు,వాహనదారులు ఎంతో ఇబ్బందిగా ప్రయాణించేవారు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాలన్న నరకయాతన పడేవారు.ఈ సమస్యను ప్రజలు పోలీసు వారికి తెలియజేయగా పోలీస్ సిబ్బంది స్పందించి పరిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ చీరాల డిఎస్పి మోయిన్ ఆదేశాల మేరకు పట్టణ సీఐ సుబ్బారావు సూచనలతో టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పట్టణంలో పర్యటించి ఒక నిర్ణయం తీసుకున్నామని, ట్రాఫిక్కు సమస్య ఎక్కువ బస్సులు ఈ రోడ్లో నిలిపి ఉండటమే కారణం అని గ్రహించామని,ఈ సమస్యను నిర్మూలించాలంటే కొన్ని బస్సులను పార్కింగ్ టిటిడి కళ్యాణ మండపం ఎదురుగా మార్చడం జరిగిందని తెలిపారు.ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లకి తాగు సూచనలు చేసి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించామని తెలియజేశారు.ప్రజల క్షేమమే మాకు ముఖ్య లక్ష్యమని అన్నారు.దీంతో పట్టణంలో వాహనదారులు ప్రజలు ట్రాఫిక్ నియంత్రించిందని పోలీసు వారిని అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అంగన్‌వాడీల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం మండలంలోని వీపీ తాండ అంగన్‌వాడీ కేంద్రాన్ని...
By Pagadala Venkateswar 2026-06-11 05:17:04 0 62
Delhi - NCR
Delhi Police Arrest 255 in Operation Kavach Drive
Delhi Police arrested 255 alleged drug traffickers during the 14th edition of Operation Kavach, a...
By Navya Sree 2026-06-27 06:33:54 0 62
Andhra Pradesh
మదనపల్లి: బేకరీ మాస్టర్ ఆత్మహత్యాయత్నం.
మదనపల్లిలో మంగళవారం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక 26 ఏళ్ల ఆనంద్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి...
By Pagadala Venkateswar 2026-02-10 07:39:31 0 161
Andhra Pradesh
నగర రోడ్లపై ప్రమాదకరంగా మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లు - ఆందోళనలో వాహనదారులు
చీరాల పట్టణం లో రద్దీగా ఉండే నగర రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న భారీ వాహనాలు సామాన్య...
By Vadlamudi NagaVenkat 2026-03-06 11:17:36 0 490
Andhra Pradesh
ఏఐఎస్ఎఫ్ తాలూకా సహాయ కార్యదర్శి హాజీ బాబు
ఎమ్మిగనూరు పట్టణంలోని అధిక ఫీజులు వల్ల ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ తల్లిదండ్రులు ఇబ్బంది...
By Boya Dasthagiri 2026-06-11 09:19:15 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com