అడవి పంది ఢీకొన్న దివ్యచక్ర వాహనం ఇద్దరు కన్నడ భక్తులకు తీవ్ర గాయాలు పంది మృతి

0
164

అడవి పందిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఇద్దరు కన్నడ భక్తులకు తీవ్ర గాయాలు, పంది మృతి

మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం గంటవాని పల్లె గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అడవి పందిని ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, అడవి పంది అక్కడికక్కడే మృతి చెందింది.

ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా ఉంగరాల దిబ్బ గ్రామానికి చెందిన దూలప్ప, శంకరప్ప అనే భక్తులు శ్రీశైలం దైవ దర్శనార్థం ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో గంటవాని పల్లె గ్రామ సమీపానికి చేరుకోగానే అకస్మాత్తుగా అడవి పంది రోడ్డుపైకి రావడంతో వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం దానిని ఢీకొని ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో అడవి పంది అక్కడికక్కడే మృతి చెందగా, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న దూలప్ప, శంకరప్పలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని పెద్ద దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన ఇరువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Search
Categories
Read More
Telangana
తెలుగు పద్యాల పోటీల్లో మెరిసిన విద్యార్థులు
​మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 21(భారత్ ఆవాజ్): మాతృభాష మనిషికి ప్రాణం వంటిదని, దాన్ని...
By Bittu Bittu 2026-02-21 15:29:02 0 333
Andhra Pradesh
అనిల్ రావిపూడి కామెంట్స్
మన శంకర్ వరప్రసాద్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడకి వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి...  ...
By Rajini Kumari 2025-12-30 10:51:48 0 155
Telangana
తెలంగాణ పర్యాటక రంగం: ₹15,000 కోట్ల పెట్టుబడులతో కొత్త ప్రణాళిక విడుదల
సరికొత్త విధానం: తెలంగాణ ప్రభుత్వం 2025-2030 పర్యాటక అభివృద్ధి విధానాన్ని ప్రారంభించింది.భారీ...
By Triveni Yarragadda 2025-08-11 14:18:05 0 1K
Dadra &Nager Haveli, Daman &Diu
Weather Alert: Heavy Rainfall Predicted
Weather Alert: Heavy Rainfall Predicted The India Meteorological Department has issued a yellow...
By BMA ADMIN 2025-05-23 07:01:19 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com