అమరావతిలో ఫిట్స్ పిలాని సందర్శించిన నారా లోకేష్

0
176

*అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన లోకేష్*

 

అమరావతి: అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BITS) పిలాని ఏఐ ప్లస్ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. బిట్స్ ప్రతినిధులు సిద్ధార్థ బెనర్జీ, ఎన్.చెన్నవీర్, బీఎస్ సహాని శుక్రవారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ను కలిసి బిట్స్ ఏఐ క్యాంపస్ ప్లాన్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బిట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ... ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులు అమరావతి క్యాంపస్ లో ఉంటాయని తెలిపారు. “రెండు దశల్లో 7వేలమంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా అమరావతి బిట్స్ పిలాని నిర్మాణాలను చేపడుతున్నాం, ఈ క్యాంపస్ పై వచ్చే ఐదేళ్లలో వెయ్యికోట్ల పెట్టుబడి పెడతాం” అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దార్శనికతకు అనుగుణంగా నెక్ట్స్ జెన్ టెక్నాలజీలతో ఈ క్యాంపస్ నిర్మిస్తున్నాం. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణంలో గ్రీన్ బిల్డింగ్, రెన్యువబుల్ ఎనర్జీ వంటి పర్యావరణహిత విధానాలను పాటిస్తున్నాం. అమరావతి బిట్స్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ గా ఉండబోతోంది. అధునాతన సాంకేతికలతో పాటు వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వంటి కోర్సులు కూడా ఇక్కడ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు బిట్స్ ప్రతినిధులు తెలిపారు. బిట్స్ నిర్మాణ ప్లాన్లను పరిశీలించిన మంత్రి లోకేష్ సంతృప్తి వ్యక్తంచేశారు. సాధ్యమైనంత త్వరగా అమరావతి క్యాంపస్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డోన్ ఉప తపాలా కార్యాలయాన్ని తనిఖీ చేసిన పోస్టల్ ఎస్పీ.
కర్నూలు: డోన్ : కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరిండెంట్ జనార్ధన్ రెడ్డి శనివారం రోజు డోన్ ఉప తపాలా...
By Hari Krishna 2025-12-14 04:47:03 0 286
SURAKSHA
Apoorva Chandra IAS: A Visionary Leader in Indian Administration
The Journey Begins "Good governance is measured not by promises, but by the...
By Fathima Safa 2026-07-23 07:02:34 0 37
SURAKSHA
Shamsher Singh Rawat IAS: A Legacy of Visionary Governance
A distinguished Andhra Pradesh cadre IAS officer whose decades of administrative excellence,...
By Lokeshwari Panthadi 2026-07-16 05:25:46 0 63
Andhra Pradesh
జనసేన నాయకుల విందు: పార్టీ బలోపేతంపై చర్చ.
ఆదివారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జనసేన నాయకులు విందులో పాల్గొన్నారు. కదిరి నియోజకవర్గం...
By Pagadala Venkateswar 2026-04-20 03:31:48 0 108
Telangana
సీఎం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
మంచిర్యాల కాగజ్నగర్ ఎక్స్ రోడ్ వద్ద జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ...
By Bonagiri RaviShankar 2026-05-22 00:51:35 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com