అమరావతిలో ఫిట్స్ పిలాని సందర్శించిన నారా లోకేష్

0
133

*అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన లోకేష్*

 

అమరావతి: అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BITS) పిలాని ఏఐ ప్లస్ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. బిట్స్ ప్రతినిధులు సిద్ధార్థ బెనర్జీ, ఎన్.చెన్నవీర్, బీఎస్ సహాని శుక్రవారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ను కలిసి బిట్స్ ఏఐ క్యాంపస్ ప్లాన్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బిట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ... ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులు అమరావతి క్యాంపస్ లో ఉంటాయని తెలిపారు. “రెండు దశల్లో 7వేలమంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా అమరావతి బిట్స్ పిలాని నిర్మాణాలను చేపడుతున్నాం, ఈ క్యాంపస్ పై వచ్చే ఐదేళ్లలో వెయ్యికోట్ల పెట్టుబడి పెడతాం” అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దార్శనికతకు అనుగుణంగా నెక్ట్స్ జెన్ టెక్నాలజీలతో ఈ క్యాంపస్ నిర్మిస్తున్నాం. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణంలో గ్రీన్ బిల్డింగ్, రెన్యువబుల్ ఎనర్జీ వంటి పర్యావరణహిత విధానాలను పాటిస్తున్నాం. అమరావతి బిట్స్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ గా ఉండబోతోంది. అధునాతన సాంకేతికలతో పాటు వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వంటి కోర్సులు కూడా ఇక్కడ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు బిట్స్ ప్రతినిధులు తెలిపారు. బిట్స్ నిర్మాణ ప్లాన్లను పరిశీలించిన మంత్రి లోకేష్ సంతృప్తి వ్యక్తంచేశారు. సాధ్యమైనంత త్వరగా అమరావతి క్యాంపస్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: పోలీసుల ఆరోగ్యంపై ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.
మదనపల్లిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం...
By Pagadala Venkateswar 2026-05-22 05:09:26 0 44
Andhra Pradesh
Chandrababu Naidu: నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.
Chandrababu Naidu: నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ 04-02-2026 Wed 10:05 | Andhra...
By Pagadala Venkateswar 2026-02-04 07:45:35 0 126
Telangana
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి - నివాళులు అర్పించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిజాంపేట్ >  భారతదేశంలో బడుగు, బలహీన వర్గాల...
By Sidhu Maroju 2025-11-28 16:30:09 0 178
Andhra Pradesh
ఎగ్జిబిషన్లో తనకి పశ్చిమ తహసిల్దార్ ఇన్చార్జి రిబ్కా రాణి
*విజయవాడ పశ్చిమ తహసీల్దార్ ఇంచార్జి గా* *ఉన్న డి రిబ్కా రాణి*  *మంగళవారం*   *సితార...
By Rajini Kumari 2026-01-13 16:16:00 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com