తూ.గో జిల్లాలో పులి సంచారం కలకలం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

0
272

తూర్పు గోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం మండలం మర్రివీడు, కంబాలపాలెం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తెలిపారు. పులి కదలికలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని ఆమె పేర్కొన్నారు.

ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా రాత్రిపూట బయటకు రావడం, ఒంటరిగా ప్రయాణాలు చేయడం నివారించాలని తెలిపారు. చిన్నపిల్లలు మరియు పశువులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని గ్రామస్థులకు సూచించారు.

అటవీశాఖ అధికారులు గ్రామ పరిసర ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచి పులిని పట్టుకునేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని కోరారు.

Search
Categories
Read More
Media Academy
what is the Hyper Local Journalism?
Hyper Local Journalism Refers To News Coverage That Focuses On Very Small, Community-Level Areas...
By Media Academy 2025-05-05 05:43:38 0 3K
Manipur
Torrential Rains Trigger Landslides and Floods in Manipur
Heavy and continuous rainfall has triggered severe landslides across key routes between...
By Bharat Aawaz 2025-07-17 08:19:15 0 998
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ :పులిచెర్ల మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మంగళవారం, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక...
By Kothuru Murali 2026-02-11 08:45:53 0 84
Telangana
డ్రా నేఙీ పనులో పేరుతో రోడ్ల మీద నరారం
బాబా నగర్ నండి చాంద్రయణగుటాకు వెల్లె దారిలో ప్రధాన రహదారులో డ్రైనేజీ పనులు ఙరుగుతునవి. ఈ పనులు...
By Poloju Bhaskar 2026-03-12 07:14:10 0 150
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com