తూ.గో జిల్లాలో పులి సంచారం కలకలం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

0
947

తూర్పు గోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం మండలం మర్రివీడు, కంబాలపాలెం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తెలిపారు. పులి కదలికలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని ఆమె పేర్కొన్నారు.

ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా రాత్రిపూట బయటకు రావడం, ఒంటరిగా ప్రయాణాలు చేయడం నివారించాలని తెలిపారు. చిన్నపిల్లలు మరియు పశువులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని గ్రామస్థులకు సూచించారు.

అటవీశాఖ అధికారులు గ్రామ పరిసర ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచి పులిని పట్టుకునేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
న్యూ ఇయర్ సెలబ్రేషన్ శాంతియుతంగా నిర్వహించాలి: డీఎస్పీ
గుంటూరు నగర ప్రజలకి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు వేస్ట్ డీఎస్పీ కే.అరవింద్ తెలిపారు. బుధవారం...
By John Baji 2025-12-31 11:06:34 0 240
Andhra Pradesh
అక్షయ తృతీయ రోజున మహిళలకు శుభవార్త
*అక్షయ తృతీయ ముందు మహిళలకు శుభవార్త*   - భారీగ తగ్గిన బంగారం ధరలు - 24 క్యారెట్ల బంగారం...
By Rajini Kumari 2026-04-17 15:57:39 0 103
Andaman & Nikobar Islands
Islands Record India's Lowest Petrol Prices
As skyrocketing global crude oil prices push petrol past the ₹100-per-litre mark across almost...
By Dunna Jessicaruth 2026-05-25 04:44:58 0 60
Telangana
ఘనంగా చత్రపతి శివాజీ 396 వ జయంతి ఉత్సవాలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 వ...
By Sidhu Maroju 2026-02-19 17:16:53 0 214
SURAKSHA
Sanjeev Kumar Jain: A Beacon of Human Rights
Upholding Justice: The Integrity of a Dedicated Officer JOURNEY ; In the complex landscape of...
By Kalaga Sailaja 2026-07-17 05:59:08 0 30
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com