YS Sharmila: చంద్రబాబు పాపులేషన్ పాలసీపై షర్మిల సెటైర్.

0
92

Andhra

 

YS Sharmila Slams Chandrababus Population Policy

చంద్రబాబు జనాభా విధానంపై వైఎస్ షర్మిల వ్యంగ్యం

ఉన్న పిల్లలకే దిక్కులేదు.. ఇప్పుడు ముగ్గురు ఎందుకని ప్రశ్న

నిరుద్యోగులు ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటున్నారని ఆవేదన

రాష్ట్ర అప్పులు 12 లక్షల కోట్లకు చేరాయని మండిపాటు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాభా నియంత్రణ ఎత్తివేత, ఎక్కువ మంది పిల్లలను కనడంపై అసెంబ్లీలో చేసిన ప్రకటన పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యంగ్యంగా స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.

 

"చంద్రబాబు పాపులేషన్ పాలసీ హాస్యాస్పదం. ఉన్న బిడ్డలకే దిక్కులేదు... ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనాలా? మీరిచ్చే బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా? ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆటోలు తోలుకుంటూ, ట్యాక్సీ డ్రైవర్లుగా బ్రతుకుతున్నారు. రాష్ట్రంలో మీరిచ్చిన హామీలు అమలు కాలేదు. మీరు, జగన్ గారు కలిసి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవు. ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్య శ్రీ పథకానికి 3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ పథకానికి 6 వేల కోట్లు బకాయిలు పెట్టారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపారు. మాఫియాలు చేసుకుంటూ, రాష్ట్రాన్ని దోచుకుంటూ... బిడ్డలను కనమని చెబితే ఎలా చంద్రబాబు గారూ?" అంటూ షర్మిల ధ్వజమెత్తారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భారీ విరాళం
విషయం: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భారీ విరాళం  విజయవాడ, చెరువు సెంటర్ ప్రాంతానికి చెందిన...
By Rajini Kumari 2026-03-03 11:59:07 0 99
Andhra Pradesh
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2026-01-05 11:47:01 0 157
Andhra Pradesh
ఘోరం.. జనరేటర్లో చిక్కుకొని..!
దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం 8వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారి...
By Boiena Rajesh 2026-04-04 08:26:01 0 63
Telangana
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మార్గాలు నిర్వహిస్తున్న ఉద్యోరులకోసం కలెక్టరెట్లోని ఐడి...
By Sadaq Sadaq 2026-02-07 15:51:26 0 134
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా గొట్టిపాటి రామకృష్ణ గారి నాయకత్వంలో రవిచంద్ర గారి సన్మానం
NTR జిల్లా టిడిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ గొట్టిపాటి...
By Rajini Kumari 2025-12-25 10:54:08 0 227
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com