APSRTC: ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు శుభవార్త.

0
154

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు అందుబాటులో ఉండనున్న సేవలు

పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే అనుమతి

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా... పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త చెప్పింది. పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్ ఉంచుకుంటే సరిపోతుంది. దానిని కండక్టర్‌కు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు.

 

ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు తమ ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి, పరీక్ష పూర్తయ్యాక తిరిగి ఇంటికి రావడానికి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది సుమారు 6.42 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు.

 

పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. బస్సుల్లో విద్యార్థులను అనుమతించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, వారికి సహకరించాలని ఆర్టీసీ ఎండీ క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుంది. రవాణా ఖర్చుల భారం లేకుండా, సురక్షితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఇది దోహదపడుతుంది. విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్లను తమ వెంట తీసుకువెళ్లాలని అధికారులు సూచించారు.

Search
Categories
Read More
Business & Finance
TDS Returns Ensure Timely and Accurate Tax Filing
TDS Returns are essential for reporting tax deducted at source to the Income Tax Department....
By Navya Sree 2026-07-22 04:58:56 0 24
Andhra Pradesh
Ayyanna Patrudu: అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు... నో పే!: అయ్యన్నపాత్రుడు.
స్పీకర్ల మహాసభలో అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు 'నో వర్క్.. నో పే' విధానం అమలు చేయాలన్న అయ్యన్న...
By Pagadala Venkateswar 2026-01-21 09:51:12 0 159
Telangana
హనుమకొండ లో ఇంటింటా కుష్టి వ్యాధి నిర్ధారణ సర్వే
జిల్లాలోని  అని ప్రాథమిక అరగ్య కేంద్రల పరిధిలో  కుష్టి వ్యాధి నిర్ధారణ సర్వే ...
By CM_ Krishna 2025-12-28 05:20:20 0 305
Telangana
శ్రీ బాలాజీ రాధాకృష్ణ మఠం భూమి, లీజును రద్దు చేయండి.
మేడ్చల్ మల్కాజిగిరి  జిల్లా/ అల్వాల్ అల్వాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-07-28 11:08:10 0 932
Andhra Pradesh
Nara Lokesh: ఢిల్లీ చేరుకున్న నారా లోకేశ్... రేపు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు.
రాష్ట్ర అభివృద్ధి, నిధుల సమీకరణే ప్రధాన అజెండా అమరావతి, విభజన హామీలపై చర్చించే అవకాశం ఐటీ,...
By Pagadala Venkateswar 2026-02-04 08:01:41 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com