వేసవి జాగ్రత్తలు తప్పనిసరి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

0
241

బాపట్ల జిల్లా: జిల్లాలో మార్చి, ఏప్రిల్, మే, నెలల్లో ఎండలు తీవ్రత క్రమేపి పెరగనునుందని, దీనితో పాటు వడగాలులు ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ బులెటిన్ లో పేర్కొందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఇక నుంచి మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకెళ్లాలన్నారు. తెలుపు రంగు, పలుచటి కాటన్ వస్త్రాలు ధరించడం, కర్చీఫ్ కట్టుకోవడం , టోపి పెట్టుకోవడం, కళ్ళ రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలన్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు  వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలి. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్. Mp అరవింద్ తో జైత్య పర్యాట న
ఎంపీ అరవింద్ తో  జగిత్యాల్ ప్రయాణంలో పలుగొన్న  జ్యోతి మురళీకృష్ణ9 వ డివిజన్...
By Sadaq Sadaq 2026-03-05 17:45:54 0 132
Andhra Pradesh
కొల్లబైలులో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం - పునీత్.
మదనపల్లి మండలం కొల్లబైలు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 629/2 ప్రభుత్వ భూమిని ఆక్రమించి...
By Pagadala Venkateswar 2026-02-03 06:17:29 0 104
Andhra Pradesh
ఇంటర్ ఫలితాల్లో మదనపల్లె ప్రభుత్వ కళాశాల విద్యార్థినుల సత్తా.
మదనపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఎంపీసీ...
By Pagadala Venkateswar 2026-04-16 03:18:34 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com