APSDMA: ఏపీకి ఎండల హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!

0
137

గత ఏడాదితో పోలిస్తే కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం

మార్చి నుంచే పలు జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు

 

 

గుంటూరు, పల్నాడు, కర్నూలు సహా పలు జిల్లాల్లో తీవ్ర వడగాలుల ముప్పు

ప్రాణ నష్టం నివారణకు ముందస్తు చర్యలు చేపట్టిన విపత్తుల సంస్థ

రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ ఏడాది వేసవి తీవ్రత గతం కంటే ఎక్కువగా ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాలు వెల్లడించారు. 

 

విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం..ఈ మార్చి నెల నుంచే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో ఎక్కువ రోజుల పాటు వడగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

 

 

 

మార్చి నుంచి మే నెలల మధ్య కాలంలో శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాలు మినహా మిగిలిన ప్రదేశాల్లో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని సంస్థ అంచనా వేస్తోంది.

 

పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. జిల్లా యంత్రాంగాలతో సమన్వయం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించగలమని ఆయన తెలిపారు. ఎండల తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచారం కోసం ప్రజలు టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101లను సంప్రదించాలని సూచించారు.

Search
Categories
Read More
Ladakh
Ladakh High Court Refuses Bail in Narco‑Terrorism Juvenile Case
On July 16, 2025, the Jammu & Kashmir & Ladakh High Court denied bail to a juvenile...
By Bharat Aawaz 2025-07-17 06:29:24 0 1K
Andhra Pradesh
డ్రంకెన్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలుశిక్ష
డ్రంకెన్ డ్రైవ్ కేసులో బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన వ్యక్తికి మూడు రోజులు జైలుశిక్ష...
By Boiena Rajesh 2026-07-23 08:08:14 0 30
SURAKSHA
Administrative Stalwart: The Vision of D.K. Singh
Architect of Odisha’s Growth: The Legacy of D.K. Singh:  In the complex corridors of...
By Kalaga Sailaja 2026-07-18 09:02:05 0 50
Telangana
సర్జరీలో వేగం.. వైద్యంలో కచ్చితత్వం : మెడికవర్ రోబోటిక్ విభాగాన్ని ప్రారంభించిన హైదరాబాద్ సిపి.|
సికింద్రాబాద్ :  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో మెరుగైన వైద్య సేవలను అందిస్తూ మెడికవర్...
By Sidhu Maroju 2026-01-21 10:31:44 0 199
Telangana
నిజామాబాద్: అంబేత్కర్ జయంతి వేడుకలు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135జయంతి సంద్రభంగా ఫులాంగ్‌చౌరస్థలోని అంబేత్కర్ గారి విగ్రహానికి...
By Sadaq Sadaq 2026-04-14 10:02:06 0 125
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com