వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.... మహిళతో పాటు ఏడు గేదెల మృతి..

0
179

బాపట్ల జిల్లా: వాడరేవు నుండి పిడుగురాళ్లకు వెళ్లే జాతీయ రహదారి–167పై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్ లేలాండ్ మినీ వ్యాన్ అతివేగంగా వెళ్లి రోడ్డుపై నడుస్తున్న మహిళను మరియు ఆమె వెంట ఉన్న గేదెలను ఢీకొట్టింది.
స్థానికుల సమాచారం మేరకు ప్రమాదానికి ప్రధాన కారణం వాహనం అతివేగమేనని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చీరాల మండలం ఈపురుపాలెం గ్రామం స్థావరం పాలెంకు చెందిన కొమ్మనబోయిన సుబ్బయ్యమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందారు.
ఆమె తనకు చెందిన గేదెలను పొలంలో మేపుకుని ఇంటికి తీసుకెళ్తుండగా ఈ విషాదం జరిగింది. ప్రమాదంలో మొత్తం ఏడు గేదెలు కూడా మృత్యువాత పడ్డాయి.
సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతమంతా దుఃఖంలో మునిగిపోయింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారధి ఆధ్వర్యంలో
డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) విద్యార్థి సంఘం, పోరాట ఫలితంగా కూటమి ప్రభుత్వం స్పందించి...
By Boya Dasthagiri 2026-05-15 10:41:55 0 83
Telangana
హైదరాబాద్లో గాంధీ భవన్లో సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశం లో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ
హైదరాబాద్‌ గాంధీ భవన్ లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశంలో పెద్దపల్లి...
By Avunoori Mahesh 2026-04-27 10:18:01 0 143
Andhra Pradesh
మచిలీపట్నంలోని పలు పోలీస్ స్టేషన్ల తనిఖీ చేసిన ఐ జి పి అశోక్ కుమార్
*కృష్ణాజిల్లా మచిలీపట్నం*    మచిలీపట్నం లోని పలు పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన ఐ జి...
By Rajini Kumari 2026-03-24 12:09:45 0 159
Andhra Pradesh
నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు కేశినేని చిన్నికి ఆహ్వానం
*ప్ర‌చుర‌ణార్థం* *22-02-2026*   నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు ఎంపి...
By Rajini Kumari 2026-02-22 10:03:44 0 114
Telangana
ప్రపంచ శాంతి కోసమే క్రైస్తవ ఉజ్జీవ సభనలు: ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్: కంటోన్మెంట్|  మడ్ ఫోర్డ్ హాకీ గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి కోసం ఫాదర్...
By Sidhu Maroju 2025-10-25 16:14:32 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com