Muppidi Avinash Reddy: ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామం.. సిట్ ముందు లొంగిపోయిన ముప్పిడి అవినాశ్ రెడ్డి.

0
141

ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అవినాశ్ రెడ్డి సిట్ ముందు లొంగుబాటు

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇవాళ‌ లొంగిపోయిన అవినాశ్ రెడ్డి

వైసీపీ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల స్కాంలో ఈయన ఏ7 నిందితుడు

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ నేతృత్వంలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు

 

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డి ఇవాళ‌ విజయవాడలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట లొంగిపోయారు. ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించి, ఈ నెల‌ 26లోగా లొంగిపోవాలని ఆదేశించిన రెండు రోజులకే ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు.

 

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, అవినాశ్ రెడ్డి కచ్చితంగా లొంగిపోయి దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్న ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. అయితే, ట్రయల్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు స్వేచ్ఛనిచ్చింది. అంతకుముందు ఏపీ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో అవినాశ్ రెడ్డి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో (2019-24) ఎక్సైజ్ పాలసీని మార్చి, డిస్టిలరీల నుంచి ముడుపులు స్వీకరించడం ద్వారా సుమారు రూ.3,500 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రధాన ఆరోపణ. మద్యం సరఫరాదారుల నుంచి కమీషన్ల రూపంలో వసూలు చేసిన డబ్బును అవినాశ్ రెడ్డి విదేశాలకు తరలించి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. ఆయన దేశం విడిచి పారిపోయాడని, ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి ఇందుకు సహకరించాడని ప్రాసిక్యూషన్ గతంలో కోర్టుకు తెలిపింది.

 

2024లో టీడీపీ-ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుంభకోణంపై కేసు నమోదైంది. తొలుత ఎక్సైజ్ శాఖ అధికారి ఫిర్యాదుతో సీఐడీ దర్యాప్తు ప్రారంభించగా, తర్వాత ప్రభుత్వం కేసును లోతుగా విచారించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

 

వైసీపీ నేతలు తమకు అనుకూలమైన నూతన మద్యం పాలసీని ప్రోత్సహించి, కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టి, డిస్టిలరీ కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించారని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించారని సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ కేసులో పలువురు ఎంపీలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, డిస్టిలరీ కంపెనీల యజమానులను కూడా సిట్ నిందితులుగా చేర్చింది. అవినాశ్ రెడ్డి లొంగుబాటుతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
బోయకొండ అటవీ ప్రాంతంలో వ్యక్తి హత్య
చౌడేపల్లి మండలం బోయకొండ పరిసర అటవీ ప్రాంతంలో వ్యక్తిని హత్య చేసిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల...
By Kothuru Murali 2026-04-07 05:35:04 0 174
Business & Finance
Kolkata Wholesale Markets See Trading Surge
Major wholesale markets in Kolkata have reported increased trading activity ahead of the festive...
By Navya Sree 2026-07-06 06:37:19 0 41
Andhra Pradesh
పుంగనూరులో ఆకట్టుకున్న గంధం వేడుకలు
పుంగునూరులోని పుంగమ్మ చెరువు కట్టపై ఉన్న హజరత్ నూరుషావలి బాబా ఉరుసు ఉత్సవాన్ని శుక్రవారం రాత్రి...
By Kothuru Murali 2026-05-09 14:57:24 0 124
Andhra Pradesh
అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన శ్రీ వైయస్‌ జగన్‌.
గుంటూరు:మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్‌పై టీడీపీ గుండాల దాడి. సర్వం విధ్వంసం. అంబటి...
By John Baji 2026-02-05 05:33:17 0 450
Andhra Pradesh
నేడు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
నేడు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. డోన్ మండలం కొత్తబురుజులో గ్రామ సభలో...
By Chennaiah Kati 2026-03-09 13:36:49 0 353
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com