Muppidi Avinash Reddy: ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామం.. సిట్ ముందు లొంగిపోయిన ముప్పిడి అవినాశ్ రెడ్డి.

0
108

ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అవినాశ్ రెడ్డి సిట్ ముందు లొంగుబాటు

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇవాళ‌ లొంగిపోయిన అవినాశ్ రెడ్డి

వైసీపీ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల స్కాంలో ఈయన ఏ7 నిందితుడు

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ నేతృత్వంలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు

 

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డి ఇవాళ‌ విజయవాడలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట లొంగిపోయారు. ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించి, ఈ నెల‌ 26లోగా లొంగిపోవాలని ఆదేశించిన రెండు రోజులకే ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు.

 

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, అవినాశ్ రెడ్డి కచ్చితంగా లొంగిపోయి దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్న ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. అయితే, ట్రయల్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు స్వేచ్ఛనిచ్చింది. అంతకుముందు ఏపీ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో అవినాశ్ రెడ్డి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో (2019-24) ఎక్సైజ్ పాలసీని మార్చి, డిస్టిలరీల నుంచి ముడుపులు స్వీకరించడం ద్వారా సుమారు రూ.3,500 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రధాన ఆరోపణ. మద్యం సరఫరాదారుల నుంచి కమీషన్ల రూపంలో వసూలు చేసిన డబ్బును అవినాశ్ రెడ్డి విదేశాలకు తరలించి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. ఆయన దేశం విడిచి పారిపోయాడని, ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి ఇందుకు సహకరించాడని ప్రాసిక్యూషన్ గతంలో కోర్టుకు తెలిపింది.

 

2024లో టీడీపీ-ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుంభకోణంపై కేసు నమోదైంది. తొలుత ఎక్సైజ్ శాఖ అధికారి ఫిర్యాదుతో సీఐడీ దర్యాప్తు ప్రారంభించగా, తర్వాత ప్రభుత్వం కేసును లోతుగా విచారించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

 

వైసీపీ నేతలు తమకు అనుకూలమైన నూతన మద్యం పాలసీని ప్రోత్సహించి, కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టి, డిస్టిలరీ కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించారని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించారని సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ కేసులో పలువురు ఎంపీలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, డిస్టిలరీ కంపెనీల యజమానులను కూడా సిట్ నిందితులుగా చేర్చింది. అవినాశ్ రెడ్డి లొంగుబాటుతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
జగన్ మోహన్ రెడ్డి గారి సైలెంట్ వ్యూహం: 2029 లక్ష్యంగా రాజకీయ పునర్నిర్మాణమా?
2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారాన్ని కోల్పోయిన...
By Babitha Babitha 2026-05-23 05:59:03 0 40
Andhra Pradesh
ప్లాస్టిక్ నిషేదించాలి పకృతిని కాపాడాలి - చీరాల ఎమ్మెల్యే కొండయ్య
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర విజన్...
By Vadlamudi NagaVenkat 2026-04-18 07:22:52 0 166
Telangana
గొర్రెను కాపాడబోయి మృత్యువు బడిలోకి....!
బావిలో పడి బాలుడు మృతి.. రంగాపురంలో ఘటన.... భారత్ అవాజ్ న్యూస్: 15 మే నేడు సాయంత్రం ఖానాపురం...
By Gujile Ramu 2026-05-15 06:18:04 0 52
Andhra Pradesh
రైల్వే భద్రతకు పటిష్ఠ చర్యలు
రైల్వే భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రైల్వే సీఐ పీసీ పండా కోరారు. బొబ్బిలి రైల్వే స్టేషన్లో...
By Boiena Rajesh 2026-03-16 14:07:51 0 145
Andhra Pradesh
హార్సిలీహీల్స్ ఘాట్ రోడ్డులో టాటా ఏస్ బోల్తా.. పలువురికి గాయాలు.
మదనపల్లె నుంచి ఆదివారం 10 మంది కుటుంబ సభ్యులతో హార్సిలీహీల్స్ సందర్శనకు వెళ్లిన టాటా ఏస్ వాహనం,...
By Pagadala Venkateswar 2026-03-23 05:52:03 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com