నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో కుల ఉన్మాదుల దాడి – 2 నెలల చిన్నారి మౌనిక మృతి బొల్లికుంట గ్రామస్తుల అశృనివాళి
నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో చోటుచేసుకున్న ఘటన ప్రతి మనసును కలచివేసింది. కేవలం రెండు నెలల పసికందు మౌనిక కుల ఉన్మాదానికి బలైపోవడం మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది.
ఇది కేవలం ఒక కుటుంబం విషాదం మాత్రమే కాదు – ఇది సమాజం మొత్తానికి మచ్చ. కులం పేరుతో ద్వేషం పెంచుకుంటూ చివరకు అమాయక శిశువు ప్రాణం తీసే స్థాయికి చేరుకోవడం ఎంత దారుణమో మనమందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
కుల వివక్ష భారత రాజ్యాంగం నిరాకరించిన దుష్ప్రవర్తన. సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం – ఇవే మన రాజ్యాంగ మూల సూత్రాలు. కానీ ఇంకా కొన్ని చోట్ల కుల విద్వేషం పేరుతో అమానుష ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం.
ఈ ఘటనపై బొల్లికుంట గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ చిన్నారి మౌనికకు అశృనివాళులు అర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం,ప్రజా ప్రతినిధులు – అందరూ కలిసి ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. కుల విద్వేషానికి బదులు మానవత్వాన్ని పెంపొందించేలా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి.
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy