బాపట్ల జిల్లా అప్పికట్ల రోడ్డు నందు యర్ర కాలువ లో ఈతకు దిగి ప్రమాదవశాత్తు గల్లంతైన పీట వంశీ, వేటగిరి చందు ల మృతి బాధాకరం

0
159
 
బాపట్ల మండలం: బాపట్ల మండలం అప్పికట్ల రహదారిలోని నాగరాజు కాలువలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన విషాద సంఘటనపై బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా విషాదకరమైన సంఘటనగా పేర్కొన్నారు.
చిన్నవయసులోనే యువకులు మృత్యువాత పడటం తనను కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నాగరాజు
కాలువలో ఈత కొడుతూ పిట్టల వాని పాలెం మండలం పోతన కట్ట వారి పాలెం చెందిన పీటా లీలా వంశీకృష్ణ, బాపట్ల మండలం కనకాద్రి నగర్ యాటగిరి చందు ఈ సంఘటనలో దుర్మరణం చెందారు. ఆయా కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. దురదృష్టకరమైన ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రమాదకరమైన నాగరాజు కాలువలో ఎవ్వరూ మునగటానికి వీలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా అధికారులకు సూచన చేశామని తెలిపారు. ప్రమాద హెచ్చరికల బోర్డు ఏర్పాటు చేయాలని సూచన చేశామని అన్నారు. జరిగిన సంఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
బాపట్ల జిల్లా అప్పికట్ల రోడ్డు నందు యర్ర కాలువ లో ఈతకు దిగి ప్రమాదవశాత్తు గల్లంతైన పీట వంశీ, వేటగిరి చందు ల మృతదేహాలను బాపట్ల అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రెస్క్యూ బోటు ద్వారా బాపట్ల అగ్నిమాపక అధికారి జి రామ సిద్ధార్థ ఆధ్వర్యం లో రెస్క్యూ టీం బృందాలను కాలువ వద్దకు పిలిపించి పోలీసులు, గజ ఈతగాళ్లు, రెవెన్యూ సిబ్బంది సాయం తో గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు (24-02-2026) న మృతదేహాన్ని కాలువ నుండి వెలికి తీసి పోలీసులకు అప్పగించడం జరిగింది.
ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందిని గ్రామ ప్రజలు మరియు జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీ K.Vinay గారు అభినందించారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
సకాలములో చెల్లించండి వడ్డీ భారాన్ని తగ్గించుకోండి
మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు మార్చి 1వ తేదినుండీ 31 తేదీ వరకు ప్రచార కర పత్రాలతో ఆటో వాహనం...
By Mobbu Venkatramana 2026-03-18 14:26:59 0 268
Andhra Pradesh
జర్నలిస్టుల సమస్యలపై ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ ఎన్నికల ఏకగ్రీవం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆదివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా...
By Pagadala Venkateswar 2026-04-27 05:45:01 0 65
Telangana
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లు,తరలింపు,*
ప్రెస్ రిలీజ్  మే 20, బుధవారం మహబూబాబాద్ జిల్లా,      *ప్రత్యేక అధికారుల...
By Kadari Komuravelli 2026-05-20 12:58:43 0 48
Andhra Pradesh
పుంగనూరులో ఉరుసు నిర్వహణపై సూచనలు చేసిన సీఐ
పుంగనూరు పట్టణంలో మే 8వ తేదీ నుంచి జరగనున్న హజరత్ సయ్యద్ నూర్షా వలి బాబా ఉరుసు సందర్భంగా,...
By Kothuru Murali 2026-04-23 15:17:37 0 67
Andhra Pradesh
పెద్ద వడ్లమూడి గ్రామంలో ముగ్గురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
*మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు*   *పెద్దవడ్లపూడి గ్రామంలో 3 గురికి సీఎం రిలీఫ్ ఫండ్ రూ...
By Rajini Kumari 2026-02-23 12:45:06 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com