బాపట్ల జిల్లా అప్పికట్ల రోడ్డు నందు యర్ర కాలువ లో ఈతకు దిగి ప్రమాదవశాత్తు గల్లంతైన పీట వంశీ, వేటగిరి చందు ల మృతి బాధాకరం

0
130
 
బాపట్ల మండలం: బాపట్ల మండలం అప్పికట్ల రహదారిలోని నాగరాజు కాలువలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన విషాద సంఘటనపై బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా విషాదకరమైన సంఘటనగా పేర్కొన్నారు.
చిన్నవయసులోనే యువకులు మృత్యువాత పడటం తనను కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నాగరాజు
కాలువలో ఈత కొడుతూ పిట్టల వాని పాలెం మండలం పోతన కట్ట వారి పాలెం చెందిన పీటా లీలా వంశీకృష్ణ, బాపట్ల మండలం కనకాద్రి నగర్ యాటగిరి చందు ఈ సంఘటనలో దుర్మరణం చెందారు. ఆయా కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. దురదృష్టకరమైన ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రమాదకరమైన నాగరాజు కాలువలో ఎవ్వరూ మునగటానికి వీలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా అధికారులకు సూచన చేశామని తెలిపారు. ప్రమాద హెచ్చరికల బోర్డు ఏర్పాటు చేయాలని సూచన చేశామని అన్నారు. జరిగిన సంఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
బాపట్ల జిల్లా అప్పికట్ల రోడ్డు నందు యర్ర కాలువ లో ఈతకు దిగి ప్రమాదవశాత్తు గల్లంతైన పీట వంశీ, వేటగిరి చందు ల మృతదేహాలను బాపట్ల అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రెస్క్యూ బోటు ద్వారా బాపట్ల అగ్నిమాపక అధికారి జి రామ సిద్ధార్థ ఆధ్వర్యం లో రెస్క్యూ టీం బృందాలను కాలువ వద్దకు పిలిపించి పోలీసులు, గజ ఈతగాళ్లు, రెవెన్యూ సిబ్బంది సాయం తో గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు (24-02-2026) న మృతదేహాన్ని కాలువ నుండి వెలికి తీసి పోలీసులకు అప్పగించడం జరిగింది.
ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందిని గ్రామ ప్రజలు మరియు జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీ K.Vinay గారు అభినందించారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపు
పత్రికా ప్రకటన    మచిలీపట్నం డిసెంబర్ 20: ---------   ప్రతి ఒక్కరూ పరిసరాల...
By Rajini Kumari 2025-12-20 14:07:57 0 125
Andhra Pradesh
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ 09-03-2026   ప్రచురణార్ధం   భవానీపురం రజ మసీద్ లో ఇఫ్తార్ విందు  ...
By Rajini Kumari 2026-03-10 08:36:40 0 105
Andhra Pradesh
వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.... మహిళతో పాటు ఏడు గేదెల మృతి..
బాపట్ల జిల్లా: వాడరేవు నుండి పిడుగురాళ్లకు వెళ్లే జాతీయ రహదారి–167పై సోమవారం సాయంత్రం ఘోర...
By Gadiyapudi Narendra 2026-03-03 05:38:38 0 154
Andhra Pradesh
పదోతరగతి పరీక్షకు 75 మంది దూరం
విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 23,015 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా,...
By Boiena Rajesh 2026-03-16 14:11:25 0 120
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com