బాపట్ల జిల్లా అప్పికట్ల రోడ్డు నందు యర్ర కాలువ లో ఈతకు దిగి ప్రమాదవశాత్తు గల్లంతైన పీట వంశీ, వేటగిరి చందు ల మృతి బాధాకరం

0
193
 
బాపట్ల మండలం: బాపట్ల మండలం అప్పికట్ల రహదారిలోని నాగరాజు కాలువలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన విషాద సంఘటనపై బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా విషాదకరమైన సంఘటనగా పేర్కొన్నారు.
చిన్నవయసులోనే యువకులు మృత్యువాత పడటం తనను కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నాగరాజు
కాలువలో ఈత కొడుతూ పిట్టల వాని పాలెం మండలం పోతన కట్ట వారి పాలెం చెందిన పీటా లీలా వంశీకృష్ణ, బాపట్ల మండలం కనకాద్రి నగర్ యాటగిరి చందు ఈ సంఘటనలో దుర్మరణం చెందారు. ఆయా కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. దురదృష్టకరమైన ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రమాదకరమైన నాగరాజు కాలువలో ఎవ్వరూ మునగటానికి వీలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా అధికారులకు సూచన చేశామని తెలిపారు. ప్రమాద హెచ్చరికల బోర్డు ఏర్పాటు చేయాలని సూచన చేశామని అన్నారు. జరిగిన సంఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
బాపట్ల జిల్లా అప్పికట్ల రోడ్డు నందు యర్ర కాలువ లో ఈతకు దిగి ప్రమాదవశాత్తు గల్లంతైన పీట వంశీ, వేటగిరి చందు ల మృతదేహాలను బాపట్ల అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రెస్క్యూ బోటు ద్వారా బాపట్ల అగ్నిమాపక అధికారి జి రామ సిద్ధార్థ ఆధ్వర్యం లో రెస్క్యూ టీం బృందాలను కాలువ వద్దకు పిలిపించి పోలీసులు, గజ ఈతగాళ్లు, రెవెన్యూ సిబ్బంది సాయం తో గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు (24-02-2026) న మృతదేహాన్ని కాలువ నుండి వెలికి తీసి పోలీసులకు అప్పగించడం జరిగింది.
ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందిని గ్రామ ప్రజలు మరియు జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీ K.Vinay గారు అభినందించారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష జన్మదిన వేడుకలు ఘనంగా.
రామసముద్రం మండల కేంద్రంలోని చెక్‌పోస్ట్ కూడలిలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష జన్మదిన...
By Pagadala Venkateswar 2026-02-01 07:47:58 0 151
Andhra Pradesh
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం… దోర్నాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమీక్ష నిర్వహించిన వైపాలెం సర్కిల్ సీఐ కె అజయ్ కుమార్ గారు
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం… దోర్నాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమీక్ష...
By Chennaiah Kati 2026-06-29 05:55:11 0 41
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్స్ ను పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ లో భాగంగా నడి రోడ్డు లో మీద పేరెడ్ నిర్వహించారు.
  >కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు    గుంటూరు జిల్లా పోలీస్... తేది :...
By KOTESWARARAO KVSR 2026-01-10 15:40:06 0 615
Andhra Pradesh
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే...
By John Baji 2026-01-02 12:57:34 0 193
Meghalaya
Border Tensions: Additional SF-10 Forces Deployed to Lapangap
Security has been intensified in the troubled border village of Lapangap today. Following reports...
By Dunna Jessicaruth 2026-05-15 10:40:18 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com