చీరాలలో ఘనంగా ప్రింటర్స్ డే వేడుకలు

0
179

చీరాల:  ముద్రణ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని ముద్రణ రంగంలో వృద్దిలోకి రావాలని పలువురు సీనియర్ ప్రింటింగ్ రంగ ప్రతినిధులు పేర్కొన్నారు. ముద్రణ యంత్రం రూపొందించిన జోహాన్ఎస్ గూటెన్ బర్గ్ జయంతి సందర్బంగా ప్రింటర్స్ వేడుకలు మంగళవారం నిర్వహించారు.  ముందుగా జెండా ఆవిష్కరణ చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రముఖుల విగ్రహాలుకు పూల మాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రోటరీ కమ్యూనిటీ హాలులో సభను నిర్వహించడం జరిగింది. ముద్రణ రంగంలో పని చేసి మరణించిన పలువురికి నివాళులు అర్పించారు. ముద్రణ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీ ని అంది పుచ్చుకొని ఆర్ధికంగా ఎదగాలన్నారు. ముద్రణ రంగం పై ఎంతో మంది ఆధార పడి ఉపాధి పొందుతున్నారని అన్నారు. అక్షరం పేర్చే స్థాయి నుంచి ఏఐ స్థాయి వరకు ప్రింటింగ్ రంగం పెరిగిందన్నారు. అందరు ఐక్యత గా ఉండి ప్రింటింగ్ రంగాన్ని అభివృద్ధికి పాటుపడాలాన్నారు. అనంతరం శివ శంకర్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అధినేత అచ్చుల నాగేశ్వరావు ను ఘనంగా సత్కరించుకున్నారు. లక్కీ డిప్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు నక్కల శ్రీనివాసరావు, కార్యదర్శి అరవింద్, కోశాధికారి కొణిజేటి నాగేశ్వరరావు, ప్రింటింగ్ ప్రెస్, బైండర్స్, ఫ్లెక్స్ ప్రింట్రర్స్, డీటీపీ ఆపరేటర్స్ తదితరులు ఎంతో ఉత్సహంగా పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Bihar
Bihar Wooing Investors With Amended Package
Addressing the centenary business conclave of the Bihar Chamber of Commerce and Industries in...
By Dunna Jessicaruth 2026-05-25 05:00:04 0 71
Andhra Pradesh
పిజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం వద్దు: ఎస్పీ
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-20 06:15:49 0 174
Andhra Pradesh
ఎమ్మెల్యే సుజనా చౌదరి గో సేవ
ఎమ్మెల్యే సుజనా చౌదరి గోసేవ..                 ...
By Rajini Kumari 2026-01-13 15:48:41 0 198
Andhra Pradesh
మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు...
By Boiena Rajesh 2026-04-19 04:04:51 0 142
Andhra Pradesh
విజయవాడ కృష్ణ లంకకు చెందిన గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులతో సహా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును నేడు కలిశారు
విజయవాడ కృష్ణ లంకకు చెందిన గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులతో సహా గౌరవ...
By Chennaiah Kati 2026-06-22 05:28:47 0 57
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com