• 29 Posts
  • 34 Photos
  • 7 Videos
  • Reporter at Way2news
  • Studied Government at Private
    Class of PG
  • Followed by 1 people
Work Info
  • Current Position
    Non-Working
Location Info
  • State
    Telangana
Search
Recent Updates
  • తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య..!


    డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్వామి..!


    ఉదయం 5.30 సమయంలో వాష్ రూమ్ లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న స్వామి..!


    సూసైడ్ నోట్ లభ్యం..


    తన భార్య పిల్లలను ఏమి అనవద్దని.. చనిపోయి దయ్యం అయినా కూడా వాళ్ళను చూసుకుంటానని.. వాళ్ళు మంచివాళ్ళని ఓ నోట్ బుక్ లో సూసైడ్ నోట్ రాసిన స్వామి..!
    తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య..! డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్వామి..! ఉదయం 5.30 సమయంలో వాష్ రూమ్ లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న స్వామి..! సూసైడ్ నోట్ లభ్యం.. తన భార్య పిల్లలను ఏమి అనవద్దని.. చనిపోయి దయ్యం అయినా కూడా వాళ్ళను చూసుకుంటానని.. వాళ్ళు మంచివాళ్ళని ఓ నోట్ బుక్ లో సూసైడ్ నోట్ రాసిన స్వామి..!
    0 Comments 0 Shares 39 Views 0 Reviews
  • పత్రికా ప్రకటన


    రంగారెడ్డి జిల్లాలో రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day) Mop-up Round నిర్వహణ


    రంగారెడ్డి జిల్లాలో రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day) Mop-up Round నిర్వహించబడుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. స్వర్ణకుమారి తెలిపారు.


    ప్రధాన విడతలో నులిపురుగుల నివారణ మాత్ర (Albendazole) తీసుకోలేకపోయిన 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, విద్యార్థులు ఈ Mop-up Round ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మరియు ఆరోగ్య సంస్థల ద్వారా ఈ మాత్రలు ఉచితంగా అందించబడతాయని తెలిపారు.


    నులిపురుగుల నివారణ వల్ల పిల్లల్లో రక్తహీనత తగ్గడం, పోషకాహారం శరీరానికి బాగా అందడం, శారీరక మరియు మానసిక ఎదుగుదల మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు.


    తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు అంగన్‌వాడీ కార్యకర్తలు సహకరించి, ఇప్పటివరకు మాత్ర తీసుకోని ప్రతి చిన్నారికి ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చూడాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. స్వర్ణకుమారి విజ్ఞప్తి చేశారు.
    పత్రికా ప్రకటన రంగారెడ్డి జిల్లాలో రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day) Mop-up Round నిర్వహణ రంగారెడ్డి జిల్లాలో రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day) Mop-up Round నిర్వహించబడుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. స్వర్ణకుమారి తెలిపారు. ప్రధాన విడతలో నులిపురుగుల నివారణ మాత్ర (Albendazole) తీసుకోలేకపోయిన 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, విద్యార్థులు ఈ Mop-up Round ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మరియు ఆరోగ్య సంస్థల ద్వారా ఈ మాత్రలు ఉచితంగా అందించబడతాయని తెలిపారు. నులిపురుగుల నివారణ వల్ల పిల్లల్లో రక్తహీనత తగ్గడం, పోషకాహారం శరీరానికి బాగా అందడం, శారీరక మరియు మానసిక ఎదుగుదల మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు అంగన్‌వాడీ కార్యకర్తలు సహకరించి, ఇప్పటివరకు మాత్ర తీసుకోని ప్రతి చిన్నారికి ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చూడాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. స్వర్ణకుమారి విజ్ఞప్తి చేశారు.
    0 Comments 0 Shares 81 Views 0 Reviews
  • కల్తీల నియంత్రణకు కఠిన చట్టం.. టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు: సీఎం రేవంత్


    హైదరాబాద్ :
    ఆహార, ఔషధ కల్తీలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో శనివారం తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (TGFADCA)పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.


    కూరగాయలు, పండ్లు, పాలు తదితర ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా రసాయనాల వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీల నివారణలో సమగ్ర చట్టాలు అమలు చేస్తున్న దేశాల విధానాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా బిల్లు సిద్ధం చేసి శాసనసభలో సమగ్ర చర్చ అనంతరం చట్టం తీసుకురావాలని సూచించారు.


    కల్తీలపై సమాచారం సేకరణకు విజిల్‌బ్లోయర్లను నియమించడంతో పాటు ప్రజల ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే క్యూర్ (CURE) ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నిబంధనలను తొలుత అక్కడ అమలు చేసి, అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు.


    సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సి.వి. ఆనంద్, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, సీఎం ప్రధాన కార్యదర్శులు వి. శేషాద్రి, ఎన్. శ్రీధర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    కల్తీల నియంత్రణకు కఠిన చట్టం.. టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు: సీఎం రేవంత్ హైదరాబాద్ : ఆహార, ఔషధ కల్తీలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో శనివారం తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (TGFADCA)పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కూరగాయలు, పండ్లు, పాలు తదితర ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా రసాయనాల వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీల నివారణలో సమగ్ర చట్టాలు అమలు చేస్తున్న దేశాల విధానాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా బిల్లు సిద్ధం చేసి శాసనసభలో సమగ్ర చర్చ అనంతరం చట్టం తీసుకురావాలని సూచించారు. కల్తీలపై సమాచారం సేకరణకు విజిల్‌బ్లోయర్లను నియమించడంతో పాటు ప్రజల ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే క్యూర్ (CURE) ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నిబంధనలను తొలుత అక్కడ అమలు చేసి, అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సి.వి. ఆనంద్, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, సీఎం ప్రధాన కార్యదర్శులు వి. శేషాద్రి, ఎన్. శ్రీధర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 108 Views 0 Reviews
  • 🚨🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨🚨


    🔥 హనుమాన్ నగర్ బస్తీ మొత్తం బీఆర్ఎస్ వైపు...! 🔥


    రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హనుమాన్ నగర్‌లో నిర్వహించిన "బస్తీ బాట" కార్యక్రమం ఘనవిజయంగా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారు, మాజీ మంత్రి శ్రీమతి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి గారు, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి గారు ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా విని, పరిష్కారానికి భరోసా కల్పించారు.


    ఈ సందర్భంగా హనుమాన్ నగర్ ప్రజలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించి BRS లో చేరారు, శివరాంపల్లి మరియు గగన్‌పహాడ్ డివిజన్లకు చెందిన పలువురు నాయకులు, యువకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.


    💗 సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం...
    💗 కార్తీక్ రెడ్డి గారి కృషికి ప్రజల మద్దతు...
    💗 హనుమాన్ నగర్‌లో మార్మోగిన జై బీఆర్ఎస్ నినాదాలు...


    🚗 రాజేంద్రనగర్‌లో రోజురోజుకు బలపడుతున్న బీఆర్ఎస్ పార్టీ
    🚨🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨🚨 🔥 హనుమాన్ నగర్ బస్తీ మొత్తం బీఆర్ఎస్ వైపు...! 🔥 రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హనుమాన్ నగర్‌లో నిర్వహించిన "బస్తీ బాట" కార్యక్రమం ఘనవిజయంగా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారు, మాజీ మంత్రి శ్రీమతి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి గారు, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి గారు ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా విని, పరిష్కారానికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా హనుమాన్ నగర్ ప్రజలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించి BRS లో చేరారు, శివరాంపల్లి మరియు గగన్‌పహాడ్ డివిజన్లకు చెందిన పలువురు నాయకులు, యువకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 💗 సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం... 💗 కార్తీక్ రెడ్డి గారి కృషికి ప్రజల మద్దతు... 💗 హనుమాన్ నగర్‌లో మార్మోగిన జై బీఆర్ఎస్ నినాదాలు... 🚗 రాజేంద్రనగర్‌లో రోజురోజుకు బలపడుతున్న బీఆర్ఎస్ పార్టీ
    0 Comments 0 Shares 460 Views 0 Reviews
  • *స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు'.. దేవుడికి నోటుపై వినతి*


    దేవుడిని భక్తులు రకరకాల కోరికలు కోరుకుంటారు. కానీ, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. గురువారం ఆలయ హుండీని లెక్కించగా, ఓ రూ.20 నోటుపై 'స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, ఆమె త్వరగా చనిపోయేలా చూడు' అని రాసి ఉన్న వినతి కనిపించింది. ఈ వింత కోరికను చూసి అధికారులు, భక్తులు ముక్కున వేలేసుకున్నారు.
    *స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు'.. దేవుడికి నోటుపై వినతి* దేవుడిని భక్తులు రకరకాల కోరికలు కోరుకుంటారు. కానీ, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. గురువారం ఆలయ హుండీని లెక్కించగా, ఓ రూ.20 నోటుపై 'స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, ఆమె త్వరగా చనిపోయేలా చూడు' అని రాసి ఉన్న వినతి కనిపించింది. ఈ వింత కోరికను చూసి అధికారులు, భక్తులు ముక్కున వేలేసుకున్నారు.
    0 Comments 0 Shares 317 Views 0 Reviews
  • రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుపై 'SIR' పేరుతో పాలకులు సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. - ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్
    రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుపై 'SIR' పేరుతో పాలకులు సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. - ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్
    0 Comments 0 Shares 393 Views 0 Reviews
  • తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ హైదరాబాద్ జిల్లా యూనియన్ అధ్యక్షులు శ్రీ ఎస్. విక్రమ్ కుమార్ మరియు కార్యదర్శి శ్రీ కురాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేడు జిల్లా సంఘం ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, శాఖల యూనియన్ నాయకులు కలిసి టీఎన్‌జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. ఎమ్. హుస్సేని (ముజీబ్) గార్లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.


    ప్రస్తుతం జరుగుతున్న బదిలీలలో హైదరాబాద్ జిల్లాలోని టీఎన్‌జీఓస్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎక్కడికక్కడ తమ ప్రస్తుత పని ప్రదేశాలలోనే కొనసాగేలా కేంద్ర సంఘం చేసిన అసాధారణ కృషికి గాను ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు.


    ఈ సమావేశంలో టీఎన్‌జీఓ కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీమతి ఉమ (కోశాధికారి), శ్రీ కొండల్ రెడ్డి (ఉపాధ్యక్షులు), శ్రీ నరసింహారెడ్డి (ఉపాధ్యక్షులు), మరియు శ్రీమతి శైలజ (సంయుక్త కార్యదర్శి) గార్లు కూడా పాల్గొన్నారు.


    అలాగే జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ కె.ఆర్. రాజ్ కుమార్, ఈసీ مెంబర్ శ్రీ ముఖీమ్ ఖురేషి గార్లతో పాటు ఖైరతాబాద్, అమీర్‌పేట్, కింగ్ కోఠి, జగమ్మేట్, నాంపల్లి, గోల్కొండ ఆసుపత్రుల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, వర్క్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, పెన్షన్ పేమెంట్, ట్రెజరీస్ డిపార్ట్‌మెంట్, నిలోఫర్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు మరియు ఈసీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


    కృతజ్ఞతలు తెలిపిన అనంతరం, హైదరాబాద్ జిల్లా పరిధిలోని వైద్య ఆరోగ్య శాఖ, కార్మిక ఉపాధి మరియు శిక్షణ శాఖలలో నిబంధనలకు విరుద్ధంగా, మానవతా దృక్పథం లేకుండా జిల్లా దాటించి బదిలీ చేసిన పలువురు ఉద్యోగుల సమస్యలను విక్రమ్ కుమార్ గారు కేంద్ర సంఘం నేతలకు వివరించారు.
    ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో (పోస్ట్-న్యూరోసర్జరీ, ఫిట్స్) బాధపడుతున్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు సెక్టార్ పరిధి దాటకుండా చూడాలని, అలాగే భర్త హైదరాబాద్‌లో పనిచేస్తూ భార్యను అన్యాయంగా సంగారెడ్డికి బదిలీ చేసిన ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 లాంటి వారిని తిరిగి డెప్యుటేషన్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం చేయాలని కేంద్ర సంఘం నాయకత్వాన్ని కోరారు.
    దీనిపై టీఎన్‌జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు సానుకూలంగా స్పందిస్తూ.. ఈ సమస్యలను వెంటనే సదరు శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు డైరెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి, ఉద్యోగులందరికీ త్వరలోనే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
    తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ హైదరాబాద్ జిల్లా యూనియన్ అధ్యక్షులు శ్రీ ఎస్. విక్రమ్ కుమార్ మరియు కార్యదర్శి శ్రీ కురాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేడు జిల్లా సంఘం ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, శాఖల యూనియన్ నాయకులు కలిసి టీఎన్‌జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. ఎమ్. హుస్సేని (ముజీబ్) గార్లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బదిలీలలో హైదరాబాద్ జిల్లాలోని టీఎన్‌జీఓస్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎక్కడికక్కడ తమ ప్రస్తుత పని ప్రదేశాలలోనే కొనసాగేలా కేంద్ర సంఘం చేసిన అసాధారణ కృషికి గాను ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో టీఎన్‌జీఓ కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీమతి ఉమ (కోశాధికారి), శ్రీ కొండల్ రెడ్డి (ఉపాధ్యక్షులు), శ్రీ నరసింహారెడ్డి (ఉపాధ్యక్షులు), మరియు శ్రీమతి శైలజ (సంయుక్త కార్యదర్శి) గార్లు కూడా పాల్గొన్నారు. అలాగే జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ కె.ఆర్. రాజ్ కుమార్, ఈసీ مెంబర్ శ్రీ ముఖీమ్ ఖురేషి గార్లతో పాటు ఖైరతాబాద్, అమీర్‌పేట్, కింగ్ కోఠి, జగమ్మేట్, నాంపల్లి, గోల్కొండ ఆసుపత్రుల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, వర్క్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, పెన్షన్ పేమెంట్, ట్రెజరీస్ డిపార్ట్‌మెంట్, నిలోఫర్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు మరియు ఈసీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలిపిన అనంతరం, హైదరాబాద్ జిల్లా పరిధిలోని వైద్య ఆరోగ్య శాఖ, కార్మిక ఉపాధి మరియు శిక్షణ శాఖలలో నిబంధనలకు విరుద్ధంగా, మానవతా దృక్పథం లేకుండా జిల్లా దాటించి బదిలీ చేసిన పలువురు ఉద్యోగుల సమస్యలను విక్రమ్ కుమార్ గారు కేంద్ర సంఘం నేతలకు వివరించారు. ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో (పోస్ట్-న్యూరోసర్జరీ, ఫిట్స్) బాధపడుతున్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు సెక్టార్ పరిధి దాటకుండా చూడాలని, అలాగే భర్త హైదరాబాద్‌లో పనిచేస్తూ భార్యను అన్యాయంగా సంగారెడ్డికి బదిలీ చేసిన ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 లాంటి వారిని తిరిగి డెప్యుటేషన్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం చేయాలని కేంద్ర సంఘం నాయకత్వాన్ని కోరారు. దీనిపై టీఎన్‌జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు సానుకూలంగా స్పందిస్తూ.. ఈ సమస్యలను వెంటనే సదరు శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు డైరెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి, ఉద్యోగులందరికీ త్వరలోనే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
    0 Comments 0 Shares 332 Views 0 Reviews
  • అందరికీ నమస్తే.
    ఈ రోజు శ్రీ రంగనాథ్ గారు, HYDRA కమిషనర్, శ్రీ జోయెల్ డేవిస్ గారు, జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్, హైదరాబాద్, శ్రీ రాహుల్ హెగ్డే గారు, డీసీపీ ట్రాఫిక్-III, శ్రీ రామకృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ, రాజేంద్రనగర్ జోన్, శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, జోనల్ కమిషనర్, రాజేంద్రనగర్ జోన్, ఇతర GHMC, HYDRA అధికారులు మరియు ట్రాఫిక్ పోలీసు అధికారులు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దేవ్ బాబా వాటర్ లాగింగ్ పాయింట్, పిల్లర్ నెం. 265 మరియు ఇతర వాటర్ లాగింగ్‌ ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు.
    వాటర్ లాగింగ్‌కు గల కారణాలను ఫీల్డ్ సిబ్బందితో చర్చించి తెలుసుకున్నారు. వర్షాకాలంలో నీరు సాఫీగా ప్రవహించేందుకు మరియు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు సిల్ట్, చెత్త మరియు ఇతర వ్యర్థాలను తొలగించి, వాటర్ లాగింగ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.
    అందరికీ నమస్తే. ఈ రోజు శ్రీ రంగనాథ్ గారు, HYDRA కమిషనర్, శ్రీ జోయెల్ డేవిస్ గారు, జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్, హైదరాబాద్, శ్రీ రాహుల్ హెగ్డే గారు, డీసీపీ ట్రాఫిక్-III, శ్రీ రామకృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ, రాజేంద్రనగర్ జోన్, శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, జోనల్ కమిషనర్, రాజేంద్రనగర్ జోన్, ఇతర GHMC, HYDRA అధికారులు మరియు ట్రాఫిక్ పోలీసు అధికారులు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దేవ్ బాబా వాటర్ లాగింగ్ పాయింట్, పిల్లర్ నెం. 265 మరియు ఇతర వాటర్ లాగింగ్‌ ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. వాటర్ లాగింగ్‌కు గల కారణాలను ఫీల్డ్ సిబ్బందితో చర్చించి తెలుసుకున్నారు. వర్షాకాలంలో నీరు సాఫీగా ప్రవహించేందుకు మరియు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు సిల్ట్, చెత్త మరియు ఇతర వ్యర్థాలను తొలగించి, వాటర్ లాగింగ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.
    0 Comments 0 Shares 617 Views 0 Reviews
  • తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు హైదరాబాద్ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ కార్యాలయ ప్రాంగణంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో ఉద్యోగ బంధువులు, కేంద్ర మరియు జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


    ఉదయం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ:
    తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉదయం హైదరాబాద్ జిల్లా యూనియన్ ప్రాంగణంలో శ్రీ విక్రమ్ కుమార్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాలు, ఉద్యోగుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని, ఆ నాడు ఉద్యమకారుల చూపిన బాటలోనే నేడు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.


    సాయంత్రం ప్రధాన ఉత్సవాలు - కేక్ కట్టింగ్:
    సాయంత్రం జరిగిన ఉత్సవాలకు టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్) గారు ఒక ప్రత్యేక కేక్‌ను సిద్ధం చేయగా, ముఖ్య అతిథి మరియు ఇతర నేతల సమక్షంలో ఆ కేక్‌ను కట్ చేసి అందరికీ తీపి తినిపించారు.


    కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ ప్రసంగం:
    ఈ సందర్భంగా సభను ఉద్దేశించి శ్రీ మారం జగదీశ్వర్ గారు మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో ఉద్యోగుల పోరాట పటిమను, అలుపెరగని దీక్షను గుర్తుచేసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం నూతనంగా ప్రతిపాదించిన ఆరోగ్య పథకం (EHS) అమల్లోకి వచ్చేలా కేంద్ర సంఘం చేసిన అగణిత కృషిని, పడిన శ్రమను ఆయన ఉద్యోగులకు వివరించారు. ఎటువంటి ప్రీమియం భారం లేకుండా స్వతంత్ర ట్రస్ట్ ఆధారిత ఈహెచ్ఎస్ రావడం ఉద్యోగుల విజయమని పేర్కొన్నారు.


    ఇదే వేదికగా ఆయన ఒక కీలకమైన పిలుపునిచ్చారు. కొందరు ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా ఈహెచ్ఎస్ (EHS) పథకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అలాంటి వారి మాటలను నమ్మవద్దని మరియు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదని ఉద్యోగులను కోరారు. పథకం మరింత పటిష్టంగా మారేందుకు ప్రభుత్వానికి అవసరమైన సవరణలను సూచిస్తున్నామే తప్ప, పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాలను ఎవరూ ప్రోత్సహించవద్దని ఆయన హెచ్చరించారు.


    ఉద్యమ జ్ఞాపకాలను నెమరవేసుకున్న డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్):
    తదనంతరం డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్) గారు మాట్లాడుతూ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీఓల పాత్రను, నాడు సకల జనుల సమ్మె కాలంలో అనుభవించిన క్లిష్ట పరిస్థితులను భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. ఆనాటి పోరాట స్ఫూర్తిని నిరంతరం కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు.


    పాల్గొన్న ప్రముఖులు:
    ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘం ట్రెజరర్ శ్రీమతి ఉమ, క్లాస్-IV కేంద్ర అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ ఖాదర్ బిన్ హసన్, నాగర్ కర్నూల్ అధ్యక్షులు శ్రీ బి. వెంకటేష్, నల్గొండ అధ్యక్షులు శ్రీ ఎన్. మురళి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీ కూరాడి శ్రీనివాస్, నల్గొండ జిల్లా కార్యదర్శి శ్రీ శేఖర్ రెడ్డి, మరియు నాయకులు శ్రీ పి. వరద రాజు, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ కె.ఆర్. రాజ్ కుమార్ గారు పాల్గొన్నారు.


    వీరితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ ఖాలెద్ అహ్మద్, శ్రీ బి. శంకర్, శ్రీమతి జి. గీత, శ్రీ వైదిక్ శ్రేష్ట, శ్రీ ముఖీం ఖురేషి, శ్రీ ఎ.వి. శ్రీధర్, మరియు కేంద్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కొండల్ రెడ్డి, శ్రీ గోవర్ధన్ రెడ్డి, శ్రీమతి అనురాధ, శ్రీమతి వరలక్ష్మి లతో పాటు వివిధ యూనిట్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు మరియు పెద్ద సంఖ్యలో ప్రాథమిక సభ్యులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు హైదరాబాద్ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ కార్యాలయ ప్రాంగణంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో ఉద్యోగ బంధువులు, కేంద్ర మరియు జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉదయం హైదరాబాద్ జిల్లా యూనియన్ ప్రాంగణంలో శ్రీ విక్రమ్ కుమార్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాలు, ఉద్యోగుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని, ఆ నాడు ఉద్యమకారుల చూపిన బాటలోనే నేడు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సాయంత్రం ప్రధాన ఉత్సవాలు - కేక్ కట్టింగ్: సాయంత్రం జరిగిన ఉత్సవాలకు టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్) గారు ఒక ప్రత్యేక కేక్‌ను సిద్ధం చేయగా, ముఖ్య అతిథి మరియు ఇతర నేతల సమక్షంలో ఆ కేక్‌ను కట్ చేసి అందరికీ తీపి తినిపించారు. కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ ప్రసంగం: ఈ సందర్భంగా సభను ఉద్దేశించి శ్రీ మారం జగదీశ్వర్ గారు మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో ఉద్యోగుల పోరాట పటిమను, అలుపెరగని దీక్షను గుర్తుచేసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం నూతనంగా ప్రతిపాదించిన ఆరోగ్య పథకం (EHS) అమల్లోకి వచ్చేలా కేంద్ర సంఘం చేసిన అగణిత కృషిని, పడిన శ్రమను ఆయన ఉద్యోగులకు వివరించారు. ఎటువంటి ప్రీమియం భారం లేకుండా స్వతంత్ర ట్రస్ట్ ఆధారిత ఈహెచ్ఎస్ రావడం ఉద్యోగుల విజయమని పేర్కొన్నారు. ఇదే వేదికగా ఆయన ఒక కీలకమైన పిలుపునిచ్చారు. కొందరు ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా ఈహెచ్ఎస్ (EHS) పథకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అలాంటి వారి మాటలను నమ్మవద్దని మరియు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదని ఉద్యోగులను కోరారు. పథకం మరింత పటిష్టంగా మారేందుకు ప్రభుత్వానికి అవసరమైన సవరణలను సూచిస్తున్నామే తప్ప, పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాలను ఎవరూ ప్రోత్సహించవద్దని ఆయన హెచ్చరించారు. ఉద్యమ జ్ఞాపకాలను నెమరవేసుకున్న డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్): తదనంతరం డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్) గారు మాట్లాడుతూ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీఓల పాత్రను, నాడు సకల జనుల సమ్మె కాలంలో అనుభవించిన క్లిష్ట పరిస్థితులను భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. ఆనాటి పోరాట స్ఫూర్తిని నిరంతరం కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. పాల్గొన్న ప్రముఖులు: ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘం ట్రెజరర్ శ్రీమతి ఉమ, క్లాస్-IV కేంద్ర అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ ఖాదర్ బిన్ హసన్, నాగర్ కర్నూల్ అధ్యక్షులు శ్రీ బి. వెంకటేష్, నల్గొండ అధ్యక్షులు శ్రీ ఎన్. మురళి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీ కూరాడి శ్రీనివాస్, నల్గొండ జిల్లా కార్యదర్శి శ్రీ శేఖర్ రెడ్డి, మరియు నాయకులు శ్రీ పి. వరద రాజు, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ కె.ఆర్. రాజ్ కుమార్ గారు పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ ఖాలెద్ అహ్మద్, శ్రీ బి. శంకర్, శ్రీమతి జి. గీత, శ్రీ వైదిక్ శ్రేష్ట, శ్రీ ముఖీం ఖురేషి, శ్రీ ఎ.వి. శ్రీధర్, మరియు కేంద్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కొండల్ రెడ్డి, శ్రీ గోవర్ధన్ రెడ్డి, శ్రీమతి అనురాధ, శ్రీమతి వరలక్ష్మి లతో పాటు వివిధ యూనిట్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు మరియు పెద్ద సంఖ్యలో ప్రాథమిక సభ్యులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
    0 Comments 0 Shares 470 Views 0 Reviews
  • *వడదెబ్బతో చనిపోతే రూ. 4 లక్షల పరిహారం - ప్రభుత్వ నిబంధనలు*


    తెలంగాణ ప్రభుత్వం వడదెబ్బను "ప్రకృతి విపత్తు" గా గుర్తించింది. అందుకే వడదెబ్బతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి *రూ. 4,00,000 పరిహారం* ఇస్తుంది. గతంలో ఇది కేవలం ₹50,000 మాత్రమే. a4bd


    *పరిహారం రావాలంటే ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్*


    *1. వెంటనే సమాచారం ఇవ్వాలి - 24 గంటల్లో*
    - *పోలీస్ స్టేషన్*: మీ ఏరియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వడదెబ్బతోనే చనిపోయారని FIR లో రాయించాలి.
    - *రెవెన్యూ శాఖ*: MRO/VRO కి సమాచారం ఇవ్వండి.
    - *వైద్య శాఖ*: స్థానిక ANM, ఆశా వర్కర్ లేదా PHC డాక్టర్‌కు చెప్పాలి.


    *2. పోస్టుమార్టం తప్పనిసరి*
    వడదెబ్బ వల్లే మరణం సంభవించిందని నిర్ధారించడానికి *ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం* చేయించాలి. ప్రైవేట్ ఆసుపత్రి రిపోర్ట్ చెల్లదు. పోస్టుమార్టం రిపోర్టులో "Cause of death: Heat Stroke/Sunstroke" అని స్పష్టంగా ఉండాలి. a0e3


    *3. కావాల్సిన డాక్యుమెంట్లు*
    1. మరణ ధృవీకరణ పత్రం - గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ నుంచి
    2. పోస్టుమార్టం రిపోర్ట్ - ప్రభుత్వ ఆసుపత్రి నుంచి
    3. పోలీస్ FIR కాపీ
    4. మృతుని ఆధార్ కార్డ్, ఓటర్ ID జిరాక్స్
    5. కుటుంబ సభ్యుల ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ - వారసత్వ ధృవీకరణ కోసం
    6. MRO ఇచ్చే "వడదెబ్బ మరణ ధృవీకరణ" నివేదిక
    7. వైద్యాధికారి ఇచ్చే రిపోర్ట్


    *4. దరఖాస్తు ఎక్కడ ఇవ్వాలి?*
    అన్ని డాక్యుమెంట్లతో *MRO/తహసీల్దార్ ఆఫీస్‌లో* దరఖాస్తు పెట్టాలి. MRO విచారణ చేసి, కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ ఆమోదంతో *SDRF నిధుల నుంచి* 4 లక్షలు వారసుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు.


    *ముఖ్యమైన నిబంధనలు - జాగ్రత్తలు*
    నిబంధన వివరణ
    **వయసు** వయసుతో సంబంధం లేదు. పిల్లలు, పెద్దలు అందరికీ వర్తిస్తుంది.
    **టైమ్ లిమిట్** మరణించిన 30 రోజుల్లో దరఖాస్తు పెట్టడం మంచిది. ఆలస్యమైతే కారణం చెప్పాలి.
    **ఎక్కడ చనిపోయారు** ఇంట్లో, పొలంలో, రోడ్డు మీద ఎక్కడైనా సరే. కానీ వడదెబ్బ వల్లే అని ప్రూవ్ కావాలి.
    **మందు/మత్తు** మద్యం తాగి, వడదెబ్బ తగిలి చనిపోతే పరిహారం రాదు. పోస్టుమార్టంలో తేలుతుంది.
    **ఇతర అనారోగ్యం** గుండె జబ్బు, షుగర్ ఉండి వడదెబ్బతో చనిపోతే, డాక్టర్ "Primary cause Heat Stroke" అని రాస్తేనే వస్తుంది.
    *పరిహారం రాకపోవడానికి కారణాలు*
    1. పోస్టుమార్టం చేయించకపోవడం
    2. FIR లో "వడదెబ్బ" అని రాయించకపోవడం
    3. ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయి, వడదెబ్బ అని ప్రూవ్ చేయలేకపోవడం
    4. మద్యం సేవించి ఉన్నట్టు రిపోర్ట్‌లో రావడం


    *మీరు వెంటనే చేయాల్సింది*: మీ దగ్గర ఎవరైనా వడదెబ్బతో చనిపోతే, ముందు 100 కి డయల్ చేసి పోలీసులకు, 108 కి కాల్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించండి. పోస్టుమార్టం చేయించండి. తర్వాత MRO ని కలవండి.
    *వడదెబ్బతో చనిపోతే రూ. 4 లక్షల పరిహారం - ప్రభుత్వ నిబంధనలు* తెలంగాణ ప్రభుత్వం వడదెబ్బను "ప్రకృతి విపత్తు" గా గుర్తించింది. అందుకే వడదెబ్బతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి *రూ. 4,00,000 పరిహారం* ఇస్తుంది. గతంలో ఇది కేవలం ₹50,000 మాత్రమే. a4bd *పరిహారం రావాలంటే ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్* *1. వెంటనే సమాచారం ఇవ్వాలి - 24 గంటల్లో* - *పోలీస్ స్టేషన్*: మీ ఏరియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వడదెబ్బతోనే చనిపోయారని FIR లో రాయించాలి. - *రెవెన్యూ శాఖ*: MRO/VRO కి సమాచారం ఇవ్వండి. - *వైద్య శాఖ*: స్థానిక ANM, ఆశా వర్కర్ లేదా PHC డాక్టర్‌కు చెప్పాలి. *2. పోస్టుమార్టం తప్పనిసరి* వడదెబ్బ వల్లే మరణం సంభవించిందని నిర్ధారించడానికి *ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం* చేయించాలి. ప్రైవేట్ ఆసుపత్రి రిపోర్ట్ చెల్లదు. పోస్టుమార్టం రిపోర్టులో "Cause of death: Heat Stroke/Sunstroke" అని స్పష్టంగా ఉండాలి. a0e3 *3. కావాల్సిన డాక్యుమెంట్లు* 1. మరణ ధృవీకరణ పత్రం - గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ నుంచి 2. పోస్టుమార్టం రిపోర్ట్ - ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 3. పోలీస్ FIR కాపీ 4. మృతుని ఆధార్ కార్డ్, ఓటర్ ID జిరాక్స్ 5. కుటుంబ సభ్యుల ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ - వారసత్వ ధృవీకరణ కోసం 6. MRO ఇచ్చే "వడదెబ్బ మరణ ధృవీకరణ" నివేదిక 7. వైద్యాధికారి ఇచ్చే రిపోర్ట్ *4. దరఖాస్తు ఎక్కడ ఇవ్వాలి?* అన్ని డాక్యుమెంట్లతో *MRO/తహసీల్దార్ ఆఫీస్‌లో* దరఖాస్తు పెట్టాలి. MRO విచారణ చేసి, కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ ఆమోదంతో *SDRF నిధుల నుంచి* 4 లక్షలు వారసుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు. *ముఖ్యమైన నిబంధనలు - జాగ్రత్తలు* నిబంధన వివరణ **వయసు** వయసుతో సంబంధం లేదు. పిల్లలు, పెద్దలు అందరికీ వర్తిస్తుంది. **టైమ్ లిమిట్** మరణించిన 30 రోజుల్లో దరఖాస్తు పెట్టడం మంచిది. ఆలస్యమైతే కారణం చెప్పాలి. **ఎక్కడ చనిపోయారు** ఇంట్లో, పొలంలో, రోడ్డు మీద ఎక్కడైనా సరే. కానీ వడదెబ్బ వల్లే అని ప్రూవ్ కావాలి. **మందు/మత్తు** మద్యం తాగి, వడదెబ్బ తగిలి చనిపోతే పరిహారం రాదు. పోస్టుమార్టంలో తేలుతుంది. **ఇతర అనారోగ్యం** గుండె జబ్బు, షుగర్ ఉండి వడదెబ్బతో చనిపోతే, డాక్టర్ "Primary cause Heat Stroke" అని రాస్తేనే వస్తుంది. *పరిహారం రాకపోవడానికి కారణాలు* 1. పోస్టుమార్టం చేయించకపోవడం 2. FIR లో "వడదెబ్బ" అని రాయించకపోవడం 3. ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయి, వడదెబ్బ అని ప్రూవ్ చేయలేకపోవడం 4. మద్యం సేవించి ఉన్నట్టు రిపోర్ట్‌లో రావడం *మీరు వెంటనే చేయాల్సింది*: మీ దగ్గర ఎవరైనా వడదెబ్బతో చనిపోతే, ముందు 100 కి డయల్ చేసి పోలీసులకు, 108 కి కాల్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించండి. పోస్టుమార్టం చేయించండి. తర్వాత MRO ని కలవండి.
    0 Comments 0 Shares 708 Views 0 Reviews
  • *శంషాబాద్ ఎయిర్ పోర్టు....*


    శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గాంజా పట్టివేత నిందితుడు అరెస్టు


    బ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుని వద్ద 10 కేజీల గాంజా గుర్తింపు


    నిందితుడు గాంజాని ప్యాకెట్లలో అమర్చి లగేజీ బ్యాగేజ్ కింది భాగంలో పెట్టి తరలించే ప్రయత్నం


    శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన నిందితుని లగేజీ స్కానింగ్ చేయడంతో బయటపడ్డ గాంజా


    పట్టుబడ్డ గాంజా విలువ దాదాపు 6 కోట్ల వరకు ఉంటుందని ఆధికారులు అంచనా వేశారు


    గాంజా స్వాధీనం చేసుకున్న ఆధికారులు నిందితుని విచారణ చేపట్టారు


    *నకిలీ విస్సాతో పట్టుబడ్డ నిందితుడు*


    రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు


    నకిలీ విస్సాతో రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ఒ ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు ఆధికారులు


    నిందితుని శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ పోలీసులకు అప్పగింత


    నిందితుని విచారణ చేస్తున్న ఔట్ పోస్ట్ పోలీసులు
    *శంషాబాద్ ఎయిర్ పోర్టు....* శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గాంజా పట్టివేత నిందితుడు అరెస్టు బ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుని వద్ద 10 కేజీల గాంజా గుర్తింపు నిందితుడు గాంజాని ప్యాకెట్లలో అమర్చి లగేజీ బ్యాగేజ్ కింది భాగంలో పెట్టి తరలించే ప్రయత్నం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన నిందితుని లగేజీ స్కానింగ్ చేయడంతో బయటపడ్డ గాంజా పట్టుబడ్డ గాంజా విలువ దాదాపు 6 కోట్ల వరకు ఉంటుందని ఆధికారులు అంచనా వేశారు గాంజా స్వాధీనం చేసుకున్న ఆధికారులు నిందితుని విచారణ చేపట్టారు *నకిలీ విస్సాతో పట్టుబడ్డ నిందితుడు* రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు నకిలీ విస్సాతో రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ఒ ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు ఆధికారులు నిందితుని శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ పోలీసులకు అప్పగింత నిందితుని విచారణ చేస్తున్న ఔట్ పోస్ట్ పోలీసులు
    0 Comments 0 Shares 319 Views 0 Reviews
  • శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురైన కుటుంబం


    మృతులు సిరిసిల్ల బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులుగా గుర్తింపు


    బాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్


    16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారు


    కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు.. ఇద్దరు పిల్లలతో సహా ఘటనా స్థలంలోనే మృతి


    ప్రమాదంలో మృతి చెందిన వారు సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులుగా గుర్తించిన పోలీసులు


    సమాచారం తెలుసుకుని రామ్మోహన్‌కు ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్
    శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురైన కుటుంబం మృతులు సిరిసిల్ల బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులుగా గుర్తింపు బాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్ 16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారు కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు.. ఇద్దరు పిల్లలతో సహా ఘటనా స్థలంలోనే మృతి ప్రమాదంలో మృతి చెందిన వారు సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులుగా గుర్తించిన పోలీసులు సమాచారం తెలుసుకుని రామ్మోహన్‌కు ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్
    0 Comments 0 Shares 473 Views 0 Reviews
  • కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున కర్గీ, ప్రధానమంత్రి మోదీ పై చేసిన అనుచిత వాక్యలకు వ్యతిరేకంగా, రాజేంద్రనగర్, అప్పర్పల్లి చౌరస్థలో కారగ్గే డిస్టిబొమ్మ దహనం చేసిన రాజేంద్రనగర్ BJP నాయకులు.
    కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున కర్గీ, ప్రధానమంత్రి మోదీ పై చేసిన అనుచిత వాక్యలకు వ్యతిరేకంగా, రాజేంద్రనగర్, అప్పర్పల్లి చౌరస్థలో కారగ్గే డిస్టిబొమ్మ దహనం చేసిన రాజేంద్రనగర్ BJP నాయకులు.
    0 Comments 0 Shares 507 Views 0 Reviews
  • స్వర్గీయ పి ఇంద్రారెడ్డి గారి వర్ధంతి సందర్బంగా కార్యకర్తలు
    స్వర్గీయ పి ఇంద్రారెడ్డి గారి వర్ధంతి సందర్బంగా కార్యకర్తలు
    0 Comments 0 Shares 321 Views 0 Reviews
  • నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్


    25 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ACB అధికారులకు పట్టుబడ్డ నారాయణపేట ఆర్డీఓ రామచందర్ నాయక్...


    పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...


    నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాబా కాలనిలో నీ ఇంట్లో,కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు...
    నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్ 25 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ACB అధికారులకు పట్టుబడ్డ నారాయణపేట ఆర్డీఓ రామచందర్ నాయక్... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది... నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాబా కాలనిలో నీ ఇంట్లో,కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు...
    Like
    1
    0 Comments 0 Shares 270 Views 0 Reviews
  • రాజేంద్రనగర్ లో చలివేంద్రం ప్రారంభిచిన స్థానిక బీజేపీ నాయకులు
    రాజేంద్రనగర్ లో చలివేంద్రం ప్రారంభిచిన స్థానిక బీజేపీ నాయకులు
    0 Comments 0 Shares 270 Views 0 Reviews
  • రాజేంద్రనగర్లో నిర్వహించిన హిందూ సమ్మేళనం లో పాల్గొన్న శ్రీ శ్రీధర్ స్వామి గారు
    రాజేంద్రనగర్లో నిర్వహించిన హిందూ సమ్మేళనం లో పాల్గొన్న శ్రీ శ్రీధర్ స్వామి గారు
    0 Comments 0 Shares 435 Views 0 Reviews
  • రాజేంద్రనగర్ శ్రీరామ భక్తుల హనుమాన్ ర్యాలీ
    రాజేంద్రనగర్ శ్రీరామ భక్తుల హనుమాన్ ర్యాలీ
    0 Comments 0 Shares 311 Views 0 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com