• ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శాత్రాజుపల్లిలో నిర్వహించిన మహంకాళి బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు హాజరై భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

    ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని దేవతల ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు కలిసి శ్రీ రెడ్డబోయిన గోపి గారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

    ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

    ఈ మహోత్సవంలో పట్టణ అధ్యక్షులు రాపెళ్లి శ్రీధర్ వంతడుపుల సుధాకర్ పిన్నింటి హనుమాన్లు మహంకాళి శ్రీను రేగుల రాజకుమార్ జవ్వాజి రాజశేఖర్ బిల్లా కృష్ణ యశ్వంత్,కురుమ సంఘం సబ్యులు మేకల చిన్నయ, శ్రీనివాస్ రఘుపతి, గుడిసె మనోజ్, వినోద్ మహేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగింది.
    ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శాత్రాజుపల్లిలో నిర్వహించిన మహంకాళి బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు హాజరై భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని దేవతల ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు కలిసి శ్రీ రెడ్డబోయిన గోపి గారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మహోత్సవంలో పట్టణ అధ్యక్షులు రాపెళ్లి శ్రీధర్ వంతడుపుల సుధాకర్ పిన్నింటి హనుమాన్లు మహంకాళి శ్రీను రేగుల రాజకుమార్ జవ్వాజి రాజశేఖర్ బిల్లా కృష్ణ యశ్వంత్,కురుమ సంఘం సబ్యులు మేకల చిన్నయ, శ్రీనివాస్ రఘుపతి, గుడిసె మనోజ్, వినోద్ మహేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగింది.
    0 Comments 0 Shares 121 Views 0 Reviews
  • ఈ రోజు చిన్నకడుౠరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పించన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ M.G.నరసన్న,కోసిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కలగట్ల లక్ష్మన్న, గ్రామ అద్యక్షులు కల్లు లక్ష్మన్న, గ్రామ ఉపాధ్యక్షులు కోడిగుడ్ల లక్ష్మన్న,గౌళ్ళ హనుమంత్ రెడ్డి, స్కూల్ చైర్మన్ కంపాటి లక్షన్న,జనసేన మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మహాదేవ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు
    ఈ రోజు చిన్నకడుౠరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పించన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ M.G.నరసన్న,కోసిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కలగట్ల లక్ష్మన్న, గ్రామ అద్యక్షులు కల్లు లక్ష్మన్న, గ్రామ ఉపాధ్యక్షులు కోడిగుడ్ల లక్ష్మన్న,గౌళ్ళ హనుమంత్ రెడ్డి, స్కూల్ చైర్మన్ కంపాటి లక్షన్న,జనసేన మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మహాదేవ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు
    0 Comments 0 Shares 84 Views 0 Reviews
  • అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ శాసనసభ. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన రాష్ట్ర శాసనసభ.
    #HistoricAmaravatiResolution
    #APAssembly
    #Amaravati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ శాసనసభ. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన రాష్ట్ర శాసనసభ. #HistoricAmaravatiResolution #APAssembly #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 251 Views 0 Reviews
  • BHARAT AAWAZ NEWS
    28/03/2026
    *తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి మృతదేహాలను పోలీస్ శాఖ సహాయంతో కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ గారు*
    *రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన వారు నిన్న కోసిగి మండలం కందుకూరు గ్రామంలో జరిగిన వివాహానికి హాజరుకావడానికి బంధువులుగా వచ్చారు.*

    *ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో కందుకూరు – అగసనూరు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర నది సమీపానికి స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.*
    *స్నానం చేస్తుండగా లోతైన నీటిలోకి వెళ్లిన నలుగురు వ్యక్తులు — సుమారు 35, 25 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మహిళలు మరియు 18, 19 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకులు — ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అక్కడున్న స్థానికులు చేపల వల సహాయంతో గాలించి వారిని బయటకు తీసే సరికి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.*
    *ఈ విషాద ఘటన విషయం తెలుసుకున్న మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి గారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతూ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.*
    BHARAT AAWAZ NEWS
    M.Thayanna
    Kallukunta v
    Peddakadubur m
    Kurnool g
    Call no 9618860380
    BHARAT AAWAZ NEWS 📰 28/03/2026 *తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి మృతదేహాలను పోలీస్ శాఖ సహాయంతో కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ గారు* *రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన వారు నిన్న కోసిగి మండలం కందుకూరు గ్రామంలో జరిగిన వివాహానికి హాజరుకావడానికి బంధువులుగా వచ్చారు.* *ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో కందుకూరు – అగసనూరు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర నది సమీపానికి స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.* *స్నానం చేస్తుండగా లోతైన నీటిలోకి వెళ్లిన నలుగురు వ్యక్తులు — సుమారు 35, 25 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మహిళలు మరియు 18, 19 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకులు — ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అక్కడున్న స్థానికులు చేపల వల సహాయంతో గాలించి వారిని బయటకు తీసే సరికి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.* *ఈ విషాద ఘటన విషయం తెలుసుకున్న మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి గారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతూ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.* BHARAT AAWAZ NEWS 📰 M.Thayanna Kallukunta v Peddakadubur m Kurnool g Call no 9618860380
    Like
    1
    0 Comments 0 Shares 254 Views 0 Reviews
  • వైసీపీ పాలకవర్గంలో ఆమోదం పొందిన అభివృద్ధి పనులనే బొబ్బిలి మున్సిపాలిటీలో కూటమి పాలకవర్గం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. వైసీపీ కార్యాలయంలో మంగళవారం కౌన్సిలర్లను ఆయన సన్మానించారు.వైసీపీ గుర్తుపై గెలుపొందిన కౌన్సిలర్లు కొంతమంది స్వార్థంతో టీడీపీలో చేరగా చాలామంది వైసీపీలో ఉన్నారన్నారు.
    #Boiena Rajesh
    వైసీపీ పాలకవర్గంలో ఆమోదం పొందిన అభివృద్ధి పనులనే బొబ్బిలి మున్సిపాలిటీలో కూటమి పాలకవర్గం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. వైసీపీ కార్యాలయంలో మంగళవారం కౌన్సిలర్లను ఆయన సన్మానించారు.వైసీపీ గుర్తుపై గెలుపొందిన కౌన్సిలర్లు కొంతమంది స్వార్థంతో టీడీపీలో చేరగా చాలామంది వైసీపీలో ఉన్నారన్నారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • [15/03, 11:49 am] null: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం
    మొయినాబాద్‌లో జరిగిన ఫామ్‌హౌస్‌ పార్టీ డ్రగ్స్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలకు కూడా డ్రగ్స్‌ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం.
    పుట్టా మహేష్ కుమార్‌కు బ్లడ్‌ శాంపిల్ పరీక్షలో డ్రగ్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మొదట చేసిన యూరిన్‌ టెస్టులో నెగెటివ్ వచ్చింది. అనుమానం రావడంతో అధికారులు మరోసారి బ్లడ్‌, యూరిన్‌ పరీక్షలు నిర్వహించారు. పరిశీలనలో యూరిన్‌ శాంపిల్స్‌లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. అందువల్లే యూరిన్‌ టెస్టులో డ్రగ్స్‌ నెగెటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
    ఈ వీకెండ్ పార్టీని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు సమాచారం. కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

    [15/03, 2:16 pm] null: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
    మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్‌ కేసులో కొత్త వివరాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు విచారణలో కీలక అంశాలు గుర్తించారు.
    బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సన్నిహితుడు కౌశిక్ రవి సిమ్లాలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
    రోహిత్ రెడ్డి పీఏ శరత్ కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్ రవిని పోలీసులు విచారిస్తున్నారు.
    రోహిత్ రెడ్డి డ్రైవర్ అర్జున్ రెడ్డి వద్ద డ్రగ్స్‌ను శరత్ కుమార్ పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
    ఫామ్‌హౌస్‌లో జరిగిన రాత్రి పార్టీలో పాల్గొన్న వారికి శరత్ కుమార్ డ్రగ్స్ పంపిణీ చేశాడని పోలీసులు తెలిపారు.
    మిగిలిన కొకైన్ కూడా శరత్ కుమార్ వద్దే ఉన్నట్లు గుర్తించారు.
    శరత్ కుమార్ వద్ద నుంచి రెండు ప్యాకెట్ల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
    ఈ కేసులో ఇంకా పలువురిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

    [15/03, 2:18 pm] null: కేటీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్
    తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్‌ అంశం చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
    కేటీఆర్‌కు దమ్ముంటే డ్రగ్స్‌ టెస్టుకు రావాలని మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు.
    అసెంబ్లీలోనే డ్రగ్స్‌ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు.
    ఆ పరీక్షకు కేటీఆర్ హాజరుకావాలని ఆయన డిమాండ్ చేశారు.
    మొయినాబాద్ డ్రగ్స్‌ కేసు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
    [15/03, 11:49 am] null: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం మొయినాబాద్‌లో జరిగిన ఫామ్‌హౌస్‌ పార్టీ డ్రగ్స్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలకు కూడా డ్రగ్స్‌ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. పుట్టా మహేష్ కుమార్‌కు బ్లడ్‌ శాంపిల్ పరీక్షలో డ్రగ్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మొదట చేసిన యూరిన్‌ టెస్టులో నెగెటివ్ వచ్చింది. అనుమానం రావడంతో అధికారులు మరోసారి బ్లడ్‌, యూరిన్‌ పరీక్షలు నిర్వహించారు. పరిశీలనలో యూరిన్‌ శాంపిల్స్‌లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. అందువల్లే యూరిన్‌ టెస్టులో డ్రగ్స్‌ నెగెటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ వీకెండ్ పార్టీని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు సమాచారం. కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. [15/03, 2:16 pm] null: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్‌ కేసులో కొత్త వివరాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు విచారణలో కీలక అంశాలు గుర్తించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సన్నిహితుడు కౌశిక్ రవి సిమ్లాలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రోహిత్ రెడ్డి పీఏ శరత్ కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్ రవిని పోలీసులు విచారిస్తున్నారు. రోహిత్ రెడ్డి డ్రైవర్ అర్జున్ రెడ్డి వద్ద డ్రగ్స్‌ను శరత్ కుమార్ పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫామ్‌హౌస్‌లో జరిగిన రాత్రి పార్టీలో పాల్గొన్న వారికి శరత్ కుమార్ డ్రగ్స్ పంపిణీ చేశాడని పోలీసులు తెలిపారు. మిగిలిన కొకైన్ కూడా శరత్ కుమార్ వద్దే ఉన్నట్లు గుర్తించారు. శరత్ కుమార్ వద్ద నుంచి రెండు ప్యాకెట్ల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కేసులో ఇంకా పలువురిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. [15/03, 2:18 pm] null: కేటీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్‌ అంశం చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. కేటీఆర్‌కు దమ్ముంటే డ్రగ్స్‌ టెస్టుకు రావాలని మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు. అసెంబ్లీలోనే డ్రగ్స్‌ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు. ఆ పరీక్షకు కేటీఆర్ హాజరుకావాలని ఆయన డిమాండ్ చేశారు. మొయినాబాద్ డ్రగ్స్‌ కేసు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
    0 Comments 0 Shares 156 Views 0 Reviews
  • అనారోగ్యంతో విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి శాసనమండలికి వచ్చిన బొత్స సత్యనారాయణను మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా పలకరించారు. సభలో కలిసిన సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన తిరిగి ఆరోగ్యంగా సభకు హాజరుకావడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. త్వరగా కోలుకుని ప్రజా సేవలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు.
    #Boiena Rajesh
    అనారోగ్యంతో విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి శాసనమండలికి వచ్చిన బొత్స సత్యనారాయణను మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా పలకరించారు. సభలో కలిసిన సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన తిరిగి ఆరోగ్యంగా సభకు హాజరుకావడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. త్వరగా కోలుకుని ప్రజా సేవలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 314 Views 6 0 Reviews
  • జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ APWJF చేపట్టిన నిరసన ర్యాలీలో విజయనగరం జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు. జిల్లా నుంచి వందలాది మంది జర్నలిస్టులు విజయవాడ వెళ్లారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, రైల్వే పాసులు పునరుద్దరణ చేయాలని APWJF జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రమేశ్ నాయుడు, ఆర్.వ్యాస్ బాబు డిమాండ్ చేశారు.
    #Boiena Rajesh
    జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ APWJF చేపట్టిన నిరసన ర్యాలీలో విజయనగరం జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు. జిల్లా నుంచి వందలాది మంది జర్నలిస్టులు విజయవాడ వెళ్లారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, రైల్వే పాసులు పునరుద్దరణ చేయాలని APWJF జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రమేశ్ నాయుడు, ఆర్.వ్యాస్ బాబు డిమాండ్ చేశారు. #Boiena Rajesh
    Like
    1
    0 Comments 0 Shares 313 Views 21 0 Reviews
  • ప్రభుత్వం చేపడుతున్న “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆలోచనను, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు.

    మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. 99 రోజుల కార్యక్రమాల కార్యాచరణను వివరించి, వివిధ అంశాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

    ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ పనితీరుకు కొలమానమని, వారి సర్వీస్ కెరీర్‌కు పునాదిగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జిల్లా కలెక్టర్లు వారధిగా పని చేయాలని సూచించారు. “ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ప్రజా సమస్యలు అర్థం కావు. నెలలో కనీసం 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించాలి” అని ఆదేశించారు.

    కలెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేసి నివేదిక అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “ఆషామాషీగా ఐఏఎస్ కాలేరు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్థకత చేకూరుతుంది. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా రాణించగలరు” అన్నారు.

    “కలెక్టర్ల పనితీరును ప్రభుత్వం నిశితంగా గమనిస్తుంది. మీరు మంచి పనిచేస్తే మిమ్మల్ని అభినందిస్తుంది. పనితీరుకు సంబంధించి వార్షిక నివేదికల ఆధారంగా బేరీజు వేస్తాం. వచ్చే జూన్‌లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం” అని తెలిపారు.

    మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరిగే ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.

    గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో 99 రోజుల ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.

    శాఖల వారీగా 10 వారాలపాటు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలిపారు.

    గ్రామ, వార్డు సభల్లో నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల వివరాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

    ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారుల ముఖ గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని, అర్హులకు తప్పనిసరిగా లబ్ధి చేరేలా చూడాలని ఆదేశించారు. అనర్హులు లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

    రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన పర్యవేక్షణకు ఒక అధికారికి బాధ్యత ఇవ్వాలని సూచించారు. కలెక్టర్లు వారానికి ఒకసారైనా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయాలని తెలిపారు.

    వచ్చే విద్యా సంవత్సరం తొలి రోజైన జూన్ 12న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

    ప్రభుత్వ ఆసుపత్రులను తరచుగా సందర్శించి సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు.

    మిల్లర్ల వద్ద నుంచి ధాన్యాన్ని తిరిగి రాబట్టాలని, ఇసుక మాఫియా మరియు అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

    ఔట్‌సోర్సింగ్ నియామకాలలో అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని, పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించాలని సూచించారు.

    భూభారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించి, ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ విజన్ అమలులో జిల్లా కలెక్టర్లు పూర్తి భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి గారు తెలిపారు.
    ప్రభుత్వం చేపడుతున్న “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆలోచనను, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు. ❇️ మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. 99 రోజుల కార్యక్రమాల కార్యాచరణను వివరించి, వివిధ అంశాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ❇️ ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ పనితీరుకు కొలమానమని, వారి సర్వీస్ కెరీర్‌కు పునాదిగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జిల్లా కలెక్టర్లు వారధిగా పని చేయాలని సూచించారు. “ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ప్రజా సమస్యలు అర్థం కావు. నెలలో కనీసం 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించాలి” అని ఆదేశించారు. ❇️ కలెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేసి నివేదిక అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “ఆషామాషీగా ఐఏఎస్ కాలేరు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్థకత చేకూరుతుంది. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా రాణించగలరు” అన్నారు. ❇️ “కలెక్టర్ల పనితీరును ప్రభుత్వం నిశితంగా గమనిస్తుంది. మీరు మంచి పనిచేస్తే మిమ్మల్ని అభినందిస్తుంది. పనితీరుకు సంబంధించి వార్షిక నివేదికల ఆధారంగా బేరీజు వేస్తాం. వచ్చే జూన్‌లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం” అని తెలిపారు. ❇️ మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరిగే ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ❇️ గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో 99 రోజుల ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ❇️ శాఖల వారీగా 10 వారాలపాటు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ❇️ గ్రామ, వార్డు సభల్లో నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల వివరాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ❇️ ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారుల ముఖ గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని, అర్హులకు తప్పనిసరిగా లబ్ధి చేరేలా చూడాలని ఆదేశించారు. అనర్హులు లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ❇️ రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన పర్యవేక్షణకు ఒక అధికారికి బాధ్యత ఇవ్వాలని సూచించారు. కలెక్టర్లు వారానికి ఒకసారైనా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయాలని తెలిపారు. ❇️ వచ్చే విద్యా సంవత్సరం తొలి రోజైన జూన్ 12న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ❇️ ప్రభుత్వ ఆసుపత్రులను తరచుగా సందర్శించి సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. ❇️ మిల్లర్ల వద్ద నుంచి ధాన్యాన్ని తిరిగి రాబట్టాలని, ఇసుక మాఫియా మరియు అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ❇️ ఔట్‌సోర్సింగ్ నియామకాలలో అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని, పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించాలని సూచించారు. ❇️ భూభారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించి, ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ విజన్ అమలులో జిల్లా కలెక్టర్లు పూర్తి భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి గారు తెలిపారు.
    Like
    1
    3 Comments 0 Shares 2K Views 0 Reviews
  • సిరిసిల్ల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు: సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.

    శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని పోలీస్ యాక్ట్ 1861ల ప్రకారం నెల రోజుల (మార్చ్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు,రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు,పబ్లిక్ మీటింగ్ లు,సభలు,సమావేశాలు నిర్వహించరదాని,నిబంధనలకు విరుద్డిదంగా డి.జే వినియోగించారాదని తెలిపారు. శాతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు.కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.

    #Sircilla #spsircilla #maheshbgeete
    సిరిసిల్ల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు: సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే. శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని పోలీస్ యాక్ట్ 1861ల ప్రకారం నెల రోజుల (మార్చ్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు,రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు,పబ్లిక్ మీటింగ్ లు,సభలు,సమావేశాలు నిర్వహించరదాని,నిబంధనలకు విరుద్డిదంగా డి.జే వినియోగించారాదని తెలిపారు. శాతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు.కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు. #Sircilla #spsircilla #maheshbgeete
    0 Comments 0 Shares 302 Views 0 Reviews
  • ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ నిందితుడు అరెస్ట్
    హైదరాబాద్ పోలీసులు అంతర్జాతీయ సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
    కేసు వివరాలు:
    మ్యాట్రిమోనీ పేరుతో పరిచయాలు పెంచుకుని పెట్టుబడులు పెట్టిస్తానని చెప్పి కోట్ల రూపాయలు మోసం చేసినట్లు ఆరోపణలు.
    నిందితుడు పేరు ప్రసన్నకుమార్‌గా గుర్తింపు.
    హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
    మోసం ఎలా?
    మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల ద్వారా మహిళలతో పరిచయం.
    విదేశాల్లో పెద్ద వ్యాపారాలు ఉన్నట్లు నమ్మబలికడం.
    అధిక లాభాలు వస్తాయని చెప్పి పెట్టుబడులు పెట్టించడం.
    తర్వాత డబ్బులు తీసుకుని మాయమవడం.
    దర్యాప్తు కొనసాగుతోంది
    అంతర్జాతీయ లావాదేవీలపై కూడా పోలీసులు దృష్టి సారించారు.
    మరికొంత మంది బాధితులు ఉండే అవకాశం ఉందని అనుమానం.
    సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల పెట్టుబడి ఆఫర్లను నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
    🕵️‍♂️ ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ నిందితుడు అరెస్ట్ హైదరాబాద్ పోలీసులు అంతర్జాతీయ సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 📌 కేసు వివరాలు: మ్యాట్రిమోనీ పేరుతో పరిచయాలు పెంచుకుని పెట్టుబడులు పెట్టిస్తానని చెప్పి కోట్ల రూపాయలు మోసం చేసినట్లు ఆరోపణలు. నిందితుడు పేరు ప్రసన్నకుమార్‌గా గుర్తింపు. హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 💻 మోసం ఎలా? మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల ద్వారా మహిళలతో పరిచయం. విదేశాల్లో పెద్ద వ్యాపారాలు ఉన్నట్లు నమ్మబలికడం. అధిక లాభాలు వస్తాయని చెప్పి పెట్టుబడులు పెట్టించడం. తర్వాత డబ్బులు తీసుకుని మాయమవడం. 🚨 దర్యాప్తు కొనసాగుతోంది అంతర్జాతీయ లావాదేవీలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. మరికొంత మంది బాధితులు ఉండే అవకాశం ఉందని అనుమానం. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల పెట్టుబడి ఆఫర్లను నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
    0 Comments 0 Shares 137 Views 0 Reviews
  • • రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనివే, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ దశలవారీగా పూర్తి చేస్తాం ..అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో సీఎం చంద్రబాబు

    • కల్తీ నెయ్యి పై చర్చకు వైసీపీ సభ్యులు ఎందుకు భయపడుతున్నారు? శాసనమండలిలో మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ..మంత్రి పయ్యావుల కేశవ్

    • ఘటన జరిగాక కాదు, ముందే మేల్కొనాలి ..అతిసార,కల్తీపాల ఘటనలపై జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు

    • 2027 గోదావరి పుష్కరాలను ఆరు జిల్లాల్లో మహా కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు 373 ఘాట్లు ఏర్పాటు. గోదావరి పుష్కరాలు పై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న ఎనిమిది మంది మంత్రులు

    • రాష్ట్రంలోని గ్రామ ,వార్డు సచివాలయాలకు "స్వర్ణ గ్రామం ", "స్వర్ణ వార్డు" గా పేర్ల మార్పు . మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ.
    • రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనివే, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ దశలవారీగా పూర్తి చేస్తాం ..అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో సీఎం చంద్రబాబు • కల్తీ నెయ్యి పై చర్చకు వైసీపీ సభ్యులు ఎందుకు భయపడుతున్నారు? శాసనమండలిలో మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ..మంత్రి పయ్యావుల కేశవ్ • ఘటన జరిగాక కాదు, ముందే మేల్కొనాలి ..అతిసార,కల్తీపాల ఘటనలపై జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు • 2027 గోదావరి పుష్కరాలను ఆరు జిల్లాల్లో మహా కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు 373 ఘాట్లు ఏర్పాటు. గోదావరి పుష్కరాలు పై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న ఎనిమిది మంది మంత్రులు • రాష్ట్రంలోని గ్రామ ,వార్డు సచివాలయాలకు "స్వర్ణ గ్రామం ", "స్వర్ణ వార్డు" గా పేర్ల మార్పు . మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ.
    0 Comments 0 Shares 200 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com