• వైసీపీ పాలకవర్గంలో ఆమోదం పొందిన అభివృద్ధి పనులనే బొబ్బిలి మున్సిపాలిటీలో కూటమి పాలకవర్గం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. వైసీపీ కార్యాలయంలో మంగళవారం కౌన్సిలర్లను ఆయన సన్మానించారు.వైసీపీ గుర్తుపై గెలుపొందిన కౌన్సిలర్లు కొంతమంది స్వార్థంతో టీడీపీలో చేరగా చాలామంది వైసీపీలో ఉన్నారన్నారు.
    #Boiena Rajesh
    వైసీపీ పాలకవర్గంలో ఆమోదం పొందిన అభివృద్ధి పనులనే బొబ్బిలి మున్సిపాలిటీలో కూటమి పాలకవర్గం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. వైసీపీ కార్యాలయంలో మంగళవారం కౌన్సిలర్లను ఆయన సన్మానించారు.వైసీపీ గుర్తుపై గెలుపొందిన కౌన్సిలర్లు కొంతమంది స్వార్థంతో టీడీపీలో చేరగా చాలామంది వైసీపీలో ఉన్నారన్నారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 3K Views 0 Reviews
  • రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పట్టణ కార్యదర్శి పి.శంకరరావు అన్నారు. బొబ్బిలిలో శనివారం ఆయన మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులు చేసిన తప్పులకు భూరికార్డులను సరి చేసుకునేందుకు రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు.భూరికార్డుల్లో తప్పులను సరి చేయాలంటే డబ్బులు అడుగుతున్నారని ఆయన ఆరోపించారు.
    #BOIENA RAJESH
    రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పట్టణ కార్యదర్శి పి.శంకరరావు అన్నారు. బొబ్బిలిలో శనివారం ఆయన మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులు చేసిన తప్పులకు భూరికార్డులను సరి చేసుకునేందుకు రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు.భూరికార్డుల్లో తప్పులను సరి చేయాలంటే డబ్బులు అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. #BOIENA RAJESH
    0 Comments 0 Shares 783 Views 16 0 Reviews
  • పంట మార్పిడి చేసుకునే రైతులకు ప్రభుత్వం విద్యుత్ బోర్లు మంజూరు చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ చెప్పారు.బొబ్బిలిలో శనివారం ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జిల్లాలో 6వేల ఎకరాలలో పంటల మార్పిడి చేసి ఉద్యాన పంటలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఐదు ఎకరాలను క్లస్టర్ ఏర్పాటు చేసి ప్రభుత్వం విద్యుత్ బోర్ మంజూరు చేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
    #Boiena Rajesh
    పంట మార్పిడి చేసుకునే రైతులకు ప్రభుత్వం విద్యుత్ బోర్లు మంజూరు చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ చెప్పారు.బొబ్బిలిలో శనివారం ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జిల్లాలో 6వేల ఎకరాలలో పంటల మార్పిడి చేసి ఉద్యాన పంటలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఐదు ఎకరాలను క్లస్టర్ ఏర్పాటు చేసి ప్రభుత్వం విద్యుత్ బోర్ మంజూరు చేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 792 Views 2 0 Reviews
  • అనారోగ్యంతో విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి శాసనమండలికి వచ్చిన బొత్స సత్యనారాయణను మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా పలకరించారు. సభలో కలిసిన సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన తిరిగి ఆరోగ్యంగా సభకు హాజరుకావడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. త్వరగా కోలుకుని ప్రజా సేవలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు.
    #Boiena Rajesh
    అనారోగ్యంతో విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి శాసనమండలికి వచ్చిన బొత్స సత్యనారాయణను మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా పలకరించారు. సభలో కలిసిన సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన తిరిగి ఆరోగ్యంగా సభకు హాజరుకావడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. త్వరగా కోలుకుని ప్రజా సేవలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 686 Views 6 0 Reviews
  • గజపతినగరం మండలం మరుపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పెదమానాపురానికి చెందిన నలుగురు ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    #Boiena Rajesh
    గజపతినగరం మండలం మరుపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పెదమానాపురానికి చెందిన నలుగురు ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 795 Views 12 0 Reviews
  • పార్వతీపురం మన్యం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం మండలం నర్సిపురంలో లారీ, బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందారు. సీతానగరం మండలం చిన్న బోగిలోని గ్రామానికి చెందిన సింహాచలం అమ్మ (55) పనిమీద గురువారం పార్వతీపురం వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    #Boiena Rajesh
    పార్వతీపురం మన్యం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం మండలం నర్సిపురంలో లారీ, బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందారు. సీతానగరం మండలం చిన్న బోగిలోని గ్రామానికి చెందిన సింహాచలం అమ్మ (55) పనిమీద గురువారం పార్వతీపురం వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 618 Views 17 0 Reviews
  • ఆత్మ రక్షణకు కరాటే ఎంతో దోహదం చేస్తుందని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలిలోని ప్రభుత్వ బాలికొన్నత పాఠశాలలో మహిళలు, బాలికల రక్షణపై అవగాహన కల్పించారు. ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని సూచించారు. లైంగిక వేధింపులకు గురైతే తల్లిదండ్రులకు గానీ పోలీసులకు గానీ ఫిర్యాదు చేస్తే వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించారు.
    #Boiena Rajesh
    ఆత్మ రక్షణకు కరాటే ఎంతో దోహదం చేస్తుందని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలిలోని ప్రభుత్వ బాలికొన్నత పాఠశాలలో మహిళలు, బాలికల రక్షణపై అవగాహన కల్పించారు. ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని సూచించారు. లైంగిక వేధింపులకు గురైతే తల్లిదండ్రులకు గానీ పోలీసులకు గానీ ఫిర్యాదు చేస్తే వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 635 Views 19 0 Reviews
  • జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ APWJF చేపట్టిన నిరసన ర్యాలీలో విజయనగరం జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు. జిల్లా నుంచి వందలాది మంది జర్నలిస్టులు విజయవాడ వెళ్లారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, రైల్వే పాసులు పునరుద్దరణ చేయాలని APWJF జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రమేశ్ నాయుడు, ఆర్.వ్యాస్ బాబు డిమాండ్ చేశారు.
    #Boiena Rajesh
    జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ APWJF చేపట్టిన నిరసన ర్యాలీలో విజయనగరం జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు. జిల్లా నుంచి వందలాది మంది జర్నలిస్టులు విజయవాడ వెళ్లారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, రైల్వే పాసులు పునరుద్దరణ చేయాలని APWJF జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రమేశ్ నాయుడు, ఆర్.వ్యాస్ బాబు డిమాండ్ చేశారు. #Boiena Rajesh
    Like
    1
    0 Comments 0 Shares 599 Views 21 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com