• ప్రభుత్వం చేపడుతున్న “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆలోచనను, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు.

    మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. 99 రోజుల కార్యక్రమాల కార్యాచరణను వివరించి, వివిధ అంశాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

    ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ పనితీరుకు కొలమానమని, వారి సర్వీస్ కెరీర్‌కు పునాదిగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జిల్లా కలెక్టర్లు వారధిగా పని చేయాలని సూచించారు. “ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ప్రజా సమస్యలు అర్థం కావు. నెలలో కనీసం 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించాలి” అని ఆదేశించారు.

    కలెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేసి నివేదిక అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “ఆషామాషీగా ఐఏఎస్ కాలేరు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్థకత చేకూరుతుంది. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా రాణించగలరు” అన్నారు.

    “కలెక్టర్ల పనితీరును ప్రభుత్వం నిశితంగా గమనిస్తుంది. మీరు మంచి పనిచేస్తే మిమ్మల్ని అభినందిస్తుంది. పనితీరుకు సంబంధించి వార్షిక నివేదికల ఆధారంగా బేరీజు వేస్తాం. వచ్చే జూన్‌లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం” అని తెలిపారు.

    మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరిగే ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.

    గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో 99 రోజుల ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.

    శాఖల వారీగా 10 వారాలపాటు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలిపారు.

    గ్రామ, వార్డు సభల్లో నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల వివరాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

    ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారుల ముఖ గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని, అర్హులకు తప్పనిసరిగా లబ్ధి చేరేలా చూడాలని ఆదేశించారు. అనర్హులు లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

    రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన పర్యవేక్షణకు ఒక అధికారికి బాధ్యత ఇవ్వాలని సూచించారు. కలెక్టర్లు వారానికి ఒకసారైనా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయాలని తెలిపారు.

    వచ్చే విద్యా సంవత్సరం తొలి రోజైన జూన్ 12న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

    ప్రభుత్వ ఆసుపత్రులను తరచుగా సందర్శించి సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు.

    మిల్లర్ల వద్ద నుంచి ధాన్యాన్ని తిరిగి రాబట్టాలని, ఇసుక మాఫియా మరియు అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

    ఔట్‌సోర్సింగ్ నియామకాలలో అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని, పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించాలని సూచించారు.

    భూభారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించి, ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ విజన్ అమలులో జిల్లా కలెక్టర్లు పూర్తి భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి గారు తెలిపారు.
    ప్రభుత్వం చేపడుతున్న “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆలోచనను, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు. ❇️ మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. 99 రోజుల కార్యక్రమాల కార్యాచరణను వివరించి, వివిధ అంశాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ❇️ ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ పనితీరుకు కొలమానమని, వారి సర్వీస్ కెరీర్‌కు పునాదిగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జిల్లా కలెక్టర్లు వారధిగా పని చేయాలని సూచించారు. “ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ప్రజా సమస్యలు అర్థం కావు. నెలలో కనీసం 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించాలి” అని ఆదేశించారు. ❇️ కలెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేసి నివేదిక అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “ఆషామాషీగా ఐఏఎస్ కాలేరు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్థకత చేకూరుతుంది. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా రాణించగలరు” అన్నారు. ❇️ “కలెక్టర్ల పనితీరును ప్రభుత్వం నిశితంగా గమనిస్తుంది. మీరు మంచి పనిచేస్తే మిమ్మల్ని అభినందిస్తుంది. పనితీరుకు సంబంధించి వార్షిక నివేదికల ఆధారంగా బేరీజు వేస్తాం. వచ్చే జూన్‌లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం” అని తెలిపారు. ❇️ మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరిగే ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ❇️ గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో 99 రోజుల ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ❇️ శాఖల వారీగా 10 వారాలపాటు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ❇️ గ్రామ, వార్డు సభల్లో నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల వివరాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ❇️ ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారుల ముఖ గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని, అర్హులకు తప్పనిసరిగా లబ్ధి చేరేలా చూడాలని ఆదేశించారు. అనర్హులు లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ❇️ రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన పర్యవేక్షణకు ఒక అధికారికి బాధ్యత ఇవ్వాలని సూచించారు. కలెక్టర్లు వారానికి ఒకసారైనా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయాలని తెలిపారు. ❇️ వచ్చే విద్యా సంవత్సరం తొలి రోజైన జూన్ 12న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ❇️ ప్రభుత్వ ఆసుపత్రులను తరచుగా సందర్శించి సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. ❇️ మిల్లర్ల వద్ద నుంచి ధాన్యాన్ని తిరిగి రాబట్టాలని, ఇసుక మాఫియా మరియు అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ❇️ ఔట్‌సోర్సింగ్ నియామకాలలో అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని, పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించాలని సూచించారు. ❇️ భూభారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించి, ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ విజన్ అమలులో జిల్లా కలెక్టర్లు పూర్తి భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి గారు తెలిపారు.
    Like
    1
    3 Comments 0 Shares 2K Views 0 Reviews
  • *ఉమ్మడి వరంగల్ జిల్లా మునిసిపల్ ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు.*

    *ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కౌటాం రవీందర్ గారు బలపరిచిన ఐదు వార్డుల అభ్యర్థులకు మద్దతుగా మల్లన్న గారు ప్రచారం చేశారు.*

    *మల్లన్న గారు మాట్లాడుతూ, ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజలు అనేకసార్లు అవకాశం ఇచ్చారని, అయినప్పటికీ మునిసిపాలిటీల్లో ప్రజల మౌలిక సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని అన్నారు.*

    *ఈసారి ఒక్క అవకాశం తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఇస్తే, రాజకీయాలే కాదు అభివృద్ధి కూడా మారుతుందని, ప్రజల సమస్యలను నేరుగా పట్టించుకుని పరిష్కారం చేసే కౌన్సిలర్‌లను TRP అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.*

    *మునిసిపాలిటీలను అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులదేనని, అందుకే ప్రజలు ఈసారి TRP అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.*

    *ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*
    *ఉమ్మడి వరంగల్ జిల్లా మునిసిపల్ ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు.* *ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కౌటాం రవీందర్ గారు బలపరిచిన ఐదు వార్డుల అభ్యర్థులకు మద్దతుగా మల్లన్న గారు ప్రచారం చేశారు.* *మల్లన్న గారు మాట్లాడుతూ, ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజలు అనేకసార్లు అవకాశం ఇచ్చారని, అయినప్పటికీ మునిసిపాలిటీల్లో ప్రజల మౌలిక సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని అన్నారు.* *ఈసారి ఒక్క అవకాశం తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఇస్తే, రాజకీయాలే కాదు అభివృద్ధి కూడా మారుతుందని, ప్రజల సమస్యలను నేరుగా పట్టించుకుని పరిష్కారం చేసే కౌన్సిలర్‌లను TRP అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.* *మునిసిపాలిటీలను అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులదేనని, అందుకే ప్రజలు ఈసారి TRP అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.* *ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*
    0 Comments 0 Shares 249 Views 0 Reviews
  • జనగామ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న *తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
    జనగామ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న *తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
    0 Comments 0 Shares 222 Views 6 0 Reviews

  • ఈరోజు భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా భూపాలపల్లికి మధ్యాహ్నం మల్లన్న గారికి స్వాగతం పలుకుతారు
    ఈరోజు భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా భూపాలపల్లికి మధ్యాహ్నం మల్లన్న గారికి స్వాగతం పలుకుతారు
    0 Comments 0 Shares 292 Views 0 Reviews
  • తిరంగ ర్యాలీకి తరలిన అల్వాల్ బిజెపి నాయకులు.

    నేరేడ్‌మెట్ ఎక్స్ రోడ్స్ లో జరిగే తిరంగా ర్యాలీలో పాల్గొనడానికి అల్వాల్ భారతీయ జనతా పార్టీ నాయకులు తరలి వెళ్లారు. మనం దేశం కోసం పోరాటం చేసిన మన సాయుధ దళాలను సత్కరించడం మరియు "ఆపరేషన్ సింధూర్ విజయ్" విజయాన్ని జరుపుకునే సందర్భంగా, బిజెపి మల్కాజ్‌గిరి అసెంబ్లీ నిర్వహించే తిరంగ ర్యాలీలో కులం మరియు మతాలకు అతీతంగా ప్రతి పౌరుడిని పాల్గొనమని బిజెపి నాయకులు ఆహ్వానించారు.
    మనందరం కలిసి ఈ ర్యాలీని విజయవంతం చేయడం ద్వారా మన ఐక్యత మరియు దేశభక్తిని ప్రదర్శించేందుకు మరియు వారికి కృతజ్ఞత తెలిపేందుకు ఈ ర్యాలీ చేస్తున్నట్టు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్‌గిరి ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్. మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఎన్. రాంచందర్ రావు. పాల్గొంటున్నట్టు మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి తెలియజేశారు.
    తిరంగ ర్యాలీకి తరలిన అల్వాల్ బిజెపి నాయకులు. నేరేడ్‌మెట్ ఎక్స్ రోడ్స్ లో జరిగే తిరంగా ర్యాలీలో పాల్గొనడానికి అల్వాల్ భారతీయ జనతా పార్టీ నాయకులు తరలి వెళ్లారు. మనం దేశం కోసం పోరాటం చేసిన మన సాయుధ దళాలను సత్కరించడం మరియు "ఆపరేషన్ సింధూర్ విజయ్" విజయాన్ని జరుపుకునే సందర్భంగా, బిజెపి మల్కాజ్‌గిరి అసెంబ్లీ నిర్వహించే తిరంగ ర్యాలీలో కులం మరియు మతాలకు అతీతంగా ప్రతి పౌరుడిని పాల్గొనమని బిజెపి నాయకులు ఆహ్వానించారు. మనందరం కలిసి ఈ ర్యాలీని విజయవంతం చేయడం ద్వారా మన ఐక్యత మరియు దేశభక్తిని ప్రదర్శించేందుకు మరియు వారికి కృతజ్ఞత తెలిపేందుకు ఈ ర్యాలీ చేస్తున్నట్టు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్‌గిరి ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్. మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఎన్. రాంచందర్ రావు. పాల్గొంటున్నట్టు మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి తెలియజేశారు.
    0 Comments 0 Shares 472 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com