జగిత్యాల : ట్రాక్టర్ మీద పడి డ్రైవర్ మృతి
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో మంగళవారం విషాదం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ గౌరీ గంగయ్య( 42 )పొలం పనులు ముగించుకొని వస్తుండగా కెనాల్ మలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి కాలువల పడింది. ట్రాక్టర్ ఆయనపై పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
0 Comments 0 Shares 91 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com