పెద్దపల్లి : మహిళ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిసిపి..!
పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో శుక్రవారం డిసిపి బి.రామ్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాధితులను కుటుంబ సభ్యుల భావించి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. కేసులు దర్యాప్తును వేగవంతం చేసి మహిళ కేసుల్లో పారదర్శక విచారణ జరపాలన్నారు. కుటుంబ కలహాల కేసులో కౌన్సిలింగ్ ద్వారా సమస్యలు పరిష్కారానికి కృషిచేయాలని, ఫిర్యాదుల వివరాలను ఆన్,లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు.
0 Comments 0 Shares 156 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com