కరీంనగర్ లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
కరీంనగర్ జిల్లా భారత్ అవార్డ్ న్యూస్.
కరీంనగర్ జిల్లా కు చెందిన ఆసరా ఫౌండేషన్ (ఆపదలో సహాయానికి రా) ఆధ్వర్యంలో జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు రక్తదాన శిబిరాలను ఈనెల 14 మరియు 15వ తేదీలలో నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ రాపోలు గోపి కృష్ణ తెలిపారు. ఈనెల 14 వ తేదీన ఆదివారం కిసాన్ నగర్ లోని శివాజీ నగర్ చౌరస్తా...