"చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో మోదీ సభకు భారీ జనసమీకరణ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగరానికి రానున్నారనే వార్తతో ఆల్వాల్ సర్కిల్ మొత్తం ఆదివారం ఉదయం నుంచే పండుగ వాతావరణాన్ని తలపించింది.
వివిధ కాలనీల్లో కార్యకర్తల ఆనందోత్సవాలు అంబరాన్నంటాయి. ప్రతి వీధిలో కాషాయ జెండాలు రెపరెపలాడగా, ఆల్వాల్ ప్రాంతమంతా కాషాయ వర్ణంతో కళకళలాడింది. యువత, మహిళలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి మోదీకి స్వాగత నినాదాలు చేశారు....