అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. బొబ్బిలి కోటలో బుధవారం మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు వేగవంతం చేసేలా పని చేయాలన్నారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు మంజూరు చేయాలన్నారు.గొల్లపల్లి,పాతబొబ్బిలి గ్రామదేవత పండుగలకు సంపూర్ణంగా తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. #RAJESH 
0 Comments 0 Shares 68 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com