కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. మదనపల్లె యువకుడు మృతి.
కర్ణాటకలోని చింతామణిలో సొంత పనిమీద వెళ్లిన మదనపల్లెకు చెందిన సమీర్ భాష (38) శుక్రవారం వేకువజామున తిరిగి వస్తుండగా, రాయల్పాడు మండలం తూపల్లి క్రాస్ వద్ద రోడ్డుపై నిలిపి ఉన్న లారీని బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో సమీర్ భాష అక్కడికక్కడే మృతి చెందాడు. తాలూకా సీఐ కళా వెంకటరమణ ఈ విషయాన్ని తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
0 Comments 0 Shares 279 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com