మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలో దోర్నాల ఈనెల 25వ తేదీన ముఖ్య మంత్రి పర్యటన

0
207

మార్కాపూర్ జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో దోర్నాలఈనెల 25వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన.

 కలెక్టర్ రాజాబాబు వెల్లడి

 దోర్నాల మండలంలో ఈనెల 25వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వెల్లడించారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి మండలంలోని కొత్తూరు, గంటవానిపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రాజెక్టు ఫీడర్, కెనాల్, ముఖ్యమంత్రి హెలిప్యాడ్, సభా ప్రాంగణ స్థలాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యటన కన్వాయ్ వెళ్లే గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ లైన్లు చెట్లు సీఎం కాన్వాయ్ కి అడ్డంకు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. ఈ పర్యటనపై మరోసారి జిల్లా ఎస్పీతో తాను పరిశీలిస్తానని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామి రెడ్డి, వెలిగొండ ప్రాజెక్టు ఎస్సీ అబూద్ అలీ, పంచాయతీరాజ్ ఈఈ సుబ్బారెడ్డి, డీఎస్పీ నాగరాజు, మండలంలోని రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వెలుగొండ ప్రాజెక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.( జిల్లా పౌర సంబంధాల అధికారి

Search
Categories
Read More
Telangana
పేట తెలంగాణ డైరీ ని ఆవిష్కరించిన విద్యశాఖ అధికారి : యాదయ్య
మంచిర్యాల : ఈరోజు ఉదయం పట్టణంలోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ (స్పాట్ వాల్యుయేషన్ సెంటర్) లో...
By Avunoori Mahesh 2026-04-08 07:30:22 0 203
Business
Three Additional Strategic Oil Reserves
The Indian government is considering setting up three additional strategic oil reserves, in...
By Bharat Aawaz 2025-07-03 08:13:47 0 2K
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం:లో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం పుంగనూరు...
By Kothuru Murali 2026-02-16 11:26:14 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com