ఇంద్రకీలాద్రిపై బడ్జెట్ పత్రులకు ప్రత్యేక పూజలు

0
217

ప్రెస్ నోట్

 

తేదీ: 14 ఫిబ్రవరి, 2026

ఇంద్రకీలాద్రి.

 

ఇంద్రకీలాద్రిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు

 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, నేడు ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ వారి పాదాల చెంత బడ్జెట్ ప్రతులను ఉంచి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో ఈ క్రింది ఉన్నతాధికారులు పాల్గొన్నారు

శ్రీ పీయూష్ కుమార్ (IAS), ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ (PFS)

శ్రీ డి. రోనాల్డ్ రోస్ (IAS), కార్యదర్శి, ఆర్థిక శాఖ

శ్రీ సూరజ్ గనోరే (IAS)

శ్రీ గౌతమ్ అల్లాడ (IA&AS)

ఆలయానికి విచ్చేసిన అధికారులకు ఆలయ ఈవో శ్రీ శీనా నాయక్ ఘనస్వాగతం పలికి, వారిని అమ్మవారి సన్నిధికి తోడ్కొని వెళ్లారు. 

అర్చకులు బడ్జెట్ ప్రతులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం అధికారులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

 

దర్శనం అనంతరం అధికారులకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ రూపొందించిన ఈ బడ్జెట్ నిర్విఘ్నంగా అమలు కావాలని అధికారులు ఈ సందర్భంగా ప్రార్థించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ రామస్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం పిఎన్ కాలనీ గ్రామం మిన్నం రెడ్డి...
By Benguluri Madhubabu 2026-03-15 08:13:03 0 203
Andhra Pradesh
పెదవడ్లమూడి గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు
*పెదవడ్లపూడి గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు*    *ప్రజల సంక్షేమమే...
By Rajini Kumari 2026-04-20 15:09:32 0 132
Telangana
Congress leader kicks Indiramma house beneficiary in Sircilla
Congress leader kicks Indiramma house beneficiary in Sircilla Rajanna-Sircilla: A...
By BMA ADMIN 2025-05-19 17:20:47 0 3K
Tamilnadu
Stalin Introspects After DMK’s Election Defeat
Following the victory of the Tamilaga Vettri Kazhagam (TVK), DMK President and former CM M.K....
By Dunna Jessicaruth 2026-05-14 11:20:40 0 161
Andhra Pradesh
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
మార్కాపురం జిల్లా.  పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం...
By Chennaiah Kati 2026-03-06 09:08:35 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com