ఇంద్రకీలాద్రిపై బడ్జెట్ పత్రులకు ప్రత్యేక పూజలు

0
140

ప్రెస్ నోట్

 

తేదీ: 14 ఫిబ్రవరి, 2026

ఇంద్రకీలాద్రి.

 

ఇంద్రకీలాద్రిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు

 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, నేడు ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ వారి పాదాల చెంత బడ్జెట్ ప్రతులను ఉంచి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో ఈ క్రింది ఉన్నతాధికారులు పాల్గొన్నారు

శ్రీ పీయూష్ కుమార్ (IAS), ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ (PFS)

శ్రీ డి. రోనాల్డ్ రోస్ (IAS), కార్యదర్శి, ఆర్థిక శాఖ

శ్రీ సూరజ్ గనోరే (IAS)

శ్రీ గౌతమ్ అల్లాడ (IA&AS)

ఆలయానికి విచ్చేసిన అధికారులకు ఆలయ ఈవో శ్రీ శీనా నాయక్ ఘనస్వాగతం పలికి, వారిని అమ్మవారి సన్నిధికి తోడ్కొని వెళ్లారు. 

అర్చకులు బడ్జెట్ ప్రతులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం అధికారులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

 

దర్శనం అనంతరం అధికారులకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ రూపొందించిన ఈ బడ్జెట్ నిర్విఘ్నంగా అమలు కావాలని అధికారులు ఈ సందర్భంగా ప్రార్థించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉద్యో గులు సమ్మె
  ఏపీ ఉద్యోగ ల సంఘం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మధ్యాహ్న భోజన విరామ...
By Mobbu Venkatramana 2026-02-12 15:43:29 0 213
Andhra Pradesh
పుంగునూరు:భీమ గాని పల్లి సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం
బుధవారం సాయంత్రం పుంగనూరు మండలం భీమగానిపల్లి సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర...
By Kothuru Murali 2026-03-05 05:21:44 0 84
Andhra Pradesh
In wins third t20 World Cup
కడప : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్లో న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు విజయం సాధించడంతో జిల్లా...
By Naveen Kumar 2026-03-09 04:27:14 0 88
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com