Nara Lokesh: లోకేశ్ ఇంట కూటమి నేతల సందడి.. ఇవాళ చిత్తూరు, అనకాపల్లి నేతలకు ఆతిథ్యం.

0
151

మంత్రి లోకేశ్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం

చిత్తూరు, అనకాపల్లి కూటమి నేతలకు ఆత్మీయ విందు

కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు

వినతుల పురోగతిపై ప్రజాప్రతినిధులకు నివేదికల అందజేత

మహిళలకు కానుకగా మంగళగిరి పట్టుచీరలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త, ఆరోగ్యకరమైన సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే. కూటమిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో వ్యక్తిగత బంధాన్ని బలోపేతం చేసే దిశగా పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ఆత్మీయ విందు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో సమావేశం అయిన లోకేశ్... ఇవాళ రాత్రి ఉండవల్లిలోని తన నివాస ప్రాంగణంలో చిత్తూరు, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని కూటమి ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబ సభ్యులకు ఆత్మీయ విందు ఇచ్చారు.

 

ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులతో సహా విచ్చేసిన ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేశ్ స్వయంగా ఎదురేగి ఆప్యాయంగా స్వాగతం పలికారు. వారి కుటుంబ సభ్యులను పలకరించి, పరిచయం చేసుకున్నారు. స్పీకర్, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే అనే హోదాలకు అతీతంగా అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారు. సరదా సంభాషణలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ విందు కొనసాగింది. ఈ సమావేశం ఒక పిక్నిక్‌ను తలపించిందని నేతలు ఆనందం వ్యక్తం చేశారు. 

 

లోకేశ్ కేవలం ఆతిథ్యానికే పరిమితం కాకుండా, పాలనపైనా తనదైన ముద్ర చూపించారు. ఆయా ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై గతంలో ఇచ్చిన వినతుల పురోగతిపై ఒక నివేదికను తయారు చేయించి, వారికి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మహిళలకు మంగళగిరి పట్టుచీరలను బహుమతిగా అందించారు.

 

ఈ ఆత్మీయ సమావేశానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గాలి భాను ప్రకాశ్, వీఎం థామస్, గురజాల జగన్ మోహన్, కె.మురళీమోహన్, పులివర్తి నాని, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ హాజరయ్యారు. అలాగే, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ (బీజేపీ), స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, కొణతాల రామకృష్ణ (జనసేన), పంచకర్ల రమేశ్ బాబు (జనసేన), సుందరపు విజయ్ కుమార్ (జనసేన) తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. విందు పూర్తయ్యాక, అతిథులందరినీ మంత్రి లోకేశ్ స్వయంగా గేటు వద్దకు వచ్చి సాగనంపడం ఆయన వినయానికి, సంస్కారానికి నిదర్శనంగా నిలిచింది.

Search
Categories
Read More
Bharat Aawaz
Installment Loot": Opposition Slams Modi Government Over Massive Fuel Price Hike
India’s state-run oil companies implemented a sharp fuel price hike, raising petrol by...
By Hazu MD. 2026-05-25 09:47:23 0 288
Andhra Pradesh
అభిమానులకు, కూటమి శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన చినబాబు.
తెలుగు రాష్ట్ర యువత అధికార ప్రతినిధి శ్రీరామ్ చినబాబు ఆదివారం మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు,...
By Pagadala Venkateswar 2026-03-16 02:15:45 0 160
Business & Finance
GST Composition Scheme for Small Business Compliance
The GST Composition Scheme is a simplified taxation scheme designed for eligible small businesses...
By Navya Sree 2026-07-24 06:22:16 0 17
Business & Finance
Infrastructure Investments Boost Sikkim's Growth
Continued investments in roads, public infrastructure, and connectivity projects across Sikkim...
By Navya Sree 2026-07-02 12:44:54 0 49
Punjab
Punjab Businessmen Face Extortion Threats from International Callers
Punjab Businessmen Face Extortion Threats from International Callers In Ludhiana, a series of...
By Bharat Aawaz 2025-07-17 07:44:58 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com