Chandrababu Naidu: కేంద్ర నిధులపై సీఎం చంద్రబాబు ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.

0
107

కేంద్ర బడ్జెట్ 2026-27లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. కేంద్రం నుంచి గరిష్ఠంగా నిధులు, ప్రాజెక్టులు సాధించేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు పలు కీలక సూచనలు చేశారు.

 

కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయగలిగితేనే, అదనపు నిధులు పొందే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు ఖర్చు చేయకపోవడంతో పథకాలు నిర్వీర్యమయ్యాయని, యుటిలిటీ సర్టిఫికెట్ల విషయంలోనూ సమస్యలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.

 

ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్‌ను శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, పల్నాడు ప్రాంతంలో మెగా టెక్స్‌టైల్ పార్కు, తిరుపతిలో స్పోర్ట్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్, హిందూపురంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్‌ను ప్రతిపాదించాలని సూచించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద అమరావతిలో సెమీ కండక్టర్ డిజైన్ ప్రాజెక్టులు చేపట్టాలని, రాజధానిలోని హెల్త్ సిటీలో 'హీల్ ఇన్ ఏపీ' విధానంలో మెడికల్ టూరిజం ప్రాజెక్టులను ప్రోత్సహించాలని తెలిపారు. కేంద్రం మంజూరు చేసిన 1000 ఎలక్ట్రిక్ బస్సులను సద్వినియోగం చేసుకుని, మరిన్ని బస్సులను సాధించాలని ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆధునిక పరికరాల పై 90 శాతం రాయితీ.
AP Weavers Get Machines At 90% Subsidy: చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త....
By John Baji 2025-12-23 07:51:54 0 211
Telangana
సకల జనుల హితం కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం 'తెలంగాణ రాష్ట్ర సేన'
తెలంగాణ ఉద్యమంలో, తదనంతరం కేసీఆర్‌కు పోటీగా అనేక మందిని దించారు. ‎‎ఆలె నరేంద్ర -...
By Ponnala Srinivasrao 2026-04-25 08:26:51 0 79
Telangana
మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 
భారత్ అవాజ్  మద్దూర్ మండల్ రిపోర్టర్    సూర్యమోహన్    మద్దూరు...
By Vanmoj Suryamohan 2026-03-23 12:33:07 0 232
Andhra Pradesh
పుంగునూరు:సదుం ఎస్సై గా విష్ణు నారాయణ.
పుంగనూరు నియోజకవర్గంలోని సదుం పోలీస్ స్టేషన్ లో బుధవారం నూతన ఎస్సై విష్ణు నారాయణ తన పదవీ బాధ్యతలు...
By Kothuru Murali 2026-01-15 05:52:28 0 145
Andhra Pradesh
కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి కావాలి
ఏకీకృత కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు....
By Boiena Rajesh 2026-03-07 09:42:32 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com