Chandrababu Naidu: కేంద్ర నిధులపై సీఎం చంద్రబాబు ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.

0
142

కేంద్ర బడ్జెట్ 2026-27లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. కేంద్రం నుంచి గరిష్ఠంగా నిధులు, ప్రాజెక్టులు సాధించేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు పలు కీలక సూచనలు చేశారు.

 

కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయగలిగితేనే, అదనపు నిధులు పొందే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు ఖర్చు చేయకపోవడంతో పథకాలు నిర్వీర్యమయ్యాయని, యుటిలిటీ సర్టిఫికెట్ల విషయంలోనూ సమస్యలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.

 

ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్‌ను శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, పల్నాడు ప్రాంతంలో మెగా టెక్స్‌టైల్ పార్కు, తిరుపతిలో స్పోర్ట్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్, హిందూపురంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్‌ను ప్రతిపాదించాలని సూచించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద అమరావతిలో సెమీ కండక్టర్ డిజైన్ ప్రాజెక్టులు చేపట్టాలని, రాజధానిలోని హెల్త్ సిటీలో 'హీల్ ఇన్ ఏపీ' విధానంలో మెడికల్ టూరిజం ప్రాజెక్టులను ప్రోత్సహించాలని తెలిపారు. కేంద్రం మంజూరు చేసిన 1000 ఎలక్ట్రిక్ బస్సులను సద్వినియోగం చేసుకుని, మరిన్ని బస్సులను సాధించాలని ఆదేశించారు.

Search
Categories
Read More
SURAKSHA
Meenu Choudhary IPS: Intelligence with Integrity & Vision
A distinguished 2000-batch AGMUT cadre IPS officer, Meenu Choudhary serves as Inspector General...
By Lokeshwari Panthadi 2026-07-23 12:34:36 0 41
Andhra Pradesh
MLA రాము 10,000 మందికి అక్షయపాత్ర కేంద్రీయ వంటశాల
*కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం    ఎమ్మెల్యే రాము కృషితో... గుడివాడలో అక్షయపాత్ర...
By Rajini Kumari 2025-12-23 10:00:15 0 299
SURAKSHA
కమాండ్ కంట్రోల్ సెంటర్: అత్యాధునిక నిఘా
తెలంగాణ పోలీసు వ్యవస్థలో సాంకేతిక విప్లవానికి ప్రతీక "కమాండ్ కంట్రోల్ సెంటర్"....
By Kalaga Sailaja 2026-06-25 06:38:14 0 38
Andhra Pradesh
మదనపల్లి: సచివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.
మదనపల్లి పట్టణంలోని సొసైటీ కాలనీ పార్క్ సమీపంలో ఉన్న సచివాలయాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా...
By Pagadala Venkateswar 2026-06-20 04:30:33 0 62
Andhra Pradesh
బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ కె.వెంకటరమణ గుండెపోటుతో మృతి పోలీస్ లాంఛనాలతో దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ
బాపట్ల: బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కె. వెంకటరమణ మృతి పట్ల జిల్లా...
By Gadiyapudi Narendra 2026-02-05 16:17:47 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com