ఆధార్ కార్డు,రేషన్ కార్డులు,ఇంటి స్థలాలు లేని యానాదులను గుర్తించాలి...... జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,

0
249

చెరుకుపల్లి: జిల్లాలో ఆధార్ కార్డు,రేషన్ కార్డు, ఇంటి స్థలాలు లేని యానాది కుటుంబాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు.

గురువారం చెరుకు పల్లిమండలం ఆరుంబాకపంచాయతీ,కమినేనివారి పాలెం గిరిజన కాలని నందు రెడ్ క్రాస్ సంస్థ  ఆధ్వర్యంలో  నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజనులకు నిత్యావసర వస్తువులను కలెక్టర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ఎన్ని యానాది కుటుంబాలు ఉన్నాయని, అందులో ఎంత మందికి ఆధార్,రేషన్ కార్డులు,ఇంటి స్థలాలు ఉన్నాయా లేవాని పూర్తి సర్వే చేయాలని జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారిని ఆదేశించారు. మండలాల వారిగా యానాది కుటుంబాలు ఎంత మందికి ఆధార్ కార్డు లేదు,ఎంత మందికి రేషన్ కార్డు, ఎంత మందికి ఇంటి స్థలాలు ఉన్నాయా లేవని సర్వే చేయాలన్నారు. ముఖ్యంగా ఆధార్ కార్డు ఉంటేనే రేషన్ కార్డు వస్తుందని తెలిపారు. ఎంత మందికి ఆధార్  లేదన్న జాబితా తయ్యారు చేసి ఆధార్ క్యాంపు లు పెట్టి ఆధార్ కార్డులు   తీయించుటకు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారిణి ఆదేశించారు.

బాపట్ల జిల్లా లోని నిరుపేదలైన యానాది కుటుంబాలకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా  నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.ఈ సందర్భంగా  ఆరుంబాక పంచాయతీ,కమినేనివారి పాలెం గిరిజన కాలని నందు
10 యానాది  కుటుంబాలకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా నిత్యవసర సరుకులు, దుస్తులు, ఒక బస్తా బియ్యం, కూరగాయలు, కిచెన్ కిట్లు, దుప్పట్లు, రగ్గులు, టార్పాలిన్ పట్టలను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ యన్.రామలక్ష్మి, జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి అబ్భులు,తహశీల్దార్ సిహెచ్ పద్మావతి, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు నారాయణ భట్టు,  పంచాయతీ సెక్రటరీ, వి ఆర్ ఓ , యానాది కుటుంబాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

(జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల అధికారి, బాపట్ల వారిచే జారీచేయడమైనది.)

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు మార్కాపురం నియోజకవర్గంలో వివిధ శుభకార్యాలలో పాల్గొన్నారు.
ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు...
By Chennaiah Kati 2026-06-21 13:53:36 0 89
Andhra Pradesh
Nirmala Sitharaman Witnessed the signing of  MoUs during the launch of Cyient AI & Future Skills Hub at Digital Bhawan in Pedamainavanilanka (PM Lanka) village in the West Godavari district of Andhra Pradesh.
Nirmala Sitharaman witnessed the signing of  MoUs during the launch of Cyient AI &...
By Gadiyapudi Narendra 2025-12-28 16:49:24 0 264
Andhra Pradesh
మదనపల్లిలో మహిళా వాకథాన్: అడుగులు కలిపిన ఎస్పీ.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మదనపల్లిలో ఆదివారం...
By Pagadala Venkateswar 2026-03-09 05:32:42 0 139
Chhattisgarh
Chhattisgarh's Industrial Growth and Investment Drive
Chhattisgarh continues to strengthen its position as an emerging industrial hub through strategic...
By Fathima Safa 2026-06-24 07:45:10 0 94
Punjab
Punjab Advances Renewable Energy and Green Initiatives
Punjab continues to expand its renewable energy and environmental sustainability efforts through...
By Fathima Safa 2026-06-27 04:09:52 0 49
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com