Chandrababu Naidu: శివరాత్రి నేపథ్యంలో... ఏపీలోని శైవక్షేత్రాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.

0
149

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్న సీఎం చంద్రబాబు

దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచన

దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి వచ్చే భక్తులను ఎవ్వరూ అగౌరవంగా చూడకూడదని స్పష్టీకరణ

 

శివరాత్రి సందర్భంగా ఏపీలోని శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతుల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, తీసుకుంటున్న చర్యలపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో నిన్న సీఎం ఢిల్లీ నుంచే సమీక్ష చేశారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. 

 

శివరాత్రి సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీశైలంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్న సీఎం.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, అవసరమైన వసతి సదుపాయాలు అందేలా కార్యాచరణ అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

 

దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి వచ్చే భక్తులను ఎవ్వరూ అగౌరవంగా చూడకూడదని స్పష్టం చేశారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. శివరాత్రి వంటి పర్వదినాల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా ఇప్పటి నుంచే పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
సి. టి. ఎం. వద్ద ఘోర ప్రమాదం.. బొలెరో బోల్తా పడి ఇద్దరు మృతి.
మదనపల్లె మండలం సి.టి.ఎం. కంకర ఫ్యాక్టరీ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-04-09 14:52:21 0 109
Andhra Pradesh
దుర్గ గుడికి మూడు గంటల పాటు విద్యుత్ నిలిపివేత అధికారుల నిర్లక్ష్య వైఖరి
దుర్గగుడిలో 3 గంటలపాటు కరెంటు నిలిపివేయడానికి కారణం 3 కోట్ల 8 లక్షల రూపాయల కరెంట్ బిల్లు బకాయిలు...
By Rajini Kumari 2025-12-28 09:42:23 0 310
Andhra Pradesh
కారంపూడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.
నిందితుల నుంచి బంగారం, వాహనాలు స్వాధీనం  జ్యువెలరీ షాపు ఉద్యోగే సూత్రధారి అని తేల్చిన...
By Pagadala Venkateswar 2026-05-04 06:13:24 0 102
Andhra Pradesh
డ్రైనేజీలో పడిన గోమాతను కాపాడిన స్థానికులు
చీరాల: చీరాల మున్సిపల్ పరిధిలోని సంఘం థియేటర్ ఎదురుగా ఉన్న రోడ్డులో గోమాత ప్రమాదవశాత్తు జారి...
By Gadiyapudi Narendra 2026-02-17 15:51:47 0 177
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:36:47 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com