S.F.S స్కూల్ రోడ్డు సమస్యపై 24 గంటల్లోనే పరిష్కారం తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

0
198
పర్చూరు: పర్చూరు మండలం నాగులపాలెం గ్రామంలో S.F.S స్కూల్ మెయిన్ రోడ్డును కొత్తగా నిర్మించిన హైవే కారణంగా వినియోగించకపోవడంతో, ఆ ప్రాంతం పూర్తిగా చెత్తకుప్పగా మారింది. రోడ్డు మీదే మల–మూత్ర విసర్జనలు జరుగుతుండటంతో ఆ ప్రాంతం దుర్గంధంతో డంపింగ్ యార్డ్‌ను తలపించే పరిస్థితి ఏర్పడింది.ఈ రహదారిని ప్రతిరోజూ S.F.S స్కూల్‌కు వెళ్లే చిన్నారులు నడక మార్గంగా వినియోగించాల్సి రావడంతో, చెత్త మురికి, దుర్వాసన కారణంగా పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో, చివరకు ఈ అంశాన్ని సోషల్ మీడియా ద్వారా గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారి దృష్టికి తీసుకువచ్చారు.సమస్య తీవ్రతను గమనించిన వెంటనే ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు తక్షణమే స్పందించి, అధికారులను ఆదేశించి యుద్ధ ప్రాతిపదికన శుభ్రత పనులు చేపట్టించారు. చెత్త తొలగింపు, పరిసరాల శుభ్రత, పిల్లలకు ఆటంకం కలగకుండా రోడ్డు సర్దుబాటు వంటి చర్యలు తీసుకుని 24 గంటల్లోనే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు.
ప్రజల సమస్యలపై ఆలస్యం చేయకుండా వెంటనే స్పందిస్తూ, ముఖ్యంగా చిన్నారుల భద్రత, ఆరోగ్యాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకునే ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారి నాయకత్వానికి ఇది మరో నిదర్శనం.
ఈ సమస్యను సత్వరమే పరిష్కరించినందుకు పిల్లల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం మరియు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
 
#Narendra
Search
Categories
Read More
Telangana
ఆశాడమాస బోనాలు.. అమ్మ వార్లను దర్శించుకుని పూజలలో పాల్గొన్న బీజేపీ నాయకులు.
హైదరాబాద్/సికింద్రాబాద్. ఆషాడ మాస లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గం లోని చిలకలగూడ...
By Sidhu Maroju 2025-07-21 07:58:49 0 971
Andhra Pradesh
పుంగనూరు: ఎమ్మార్వో హామీతో దీక్ష విరమించిన దళిత సంఘాలు
పుంగనూరు మండలం, రాంపల్లి గ్రామ సమీపంలో మహేష్ అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించిన ఐదు సెంట్ల భూమిని...
By Kothuru Murali 2026-03-02 12:33:11 0 71
Andhra Pradesh
అయోధ్య రామయ్య చెంతన సీఎం చంద్రబాబు నాయుడు గారు
 అయోధ్య రామాలయంలో శ్రీ రాముడుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-28 10:09:17 0 121
Andhra Pradesh
ఎస్ ఐ ఆర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయడానికి సహకరించాలి: కమిషనర్
కర్నూలు : ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతానికి సహకరించాలి కర్నూలు నియోజకవర్గ ఆర్వో, కమిషనర్...
By Hari Krishna 2026-01-06 11:39:00 0 138
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com